–త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీని పునర్ నిర్మిస్తాం
–ఎన్టీఆర్ భవన్ లో పార్టీ శ్రేణులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై పుట్టిన టీడీపీ (tdp) పార్టీనీ పునర్నిస్తామని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ధీమా వ్య క్తం చేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) రికార్డు విజయం సాధించిన కూటమి తరపున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా నాలుగోసారి ఎన్నికయ్యారు. ఈమే రకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబును (Chandrababu Naidu) టీడీపీ తెలంగాణ నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల ను (TDP leaders, activists and fans) ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడా రు. రాష్ట్రంలో టీడీపీ నేటికి బలంగా ఉందని కీలక నేతలు పార్టీ మారిన ప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీ మారలేదని, త్వరలోనే తెలంగాణ లో (telagana)టీడీపీ పార్టీకి పునర్వైభవం తీసు కొస్తామని తెలంగాణ గడ్డపై పుట్టిన టీడీపీ పార్టీనీ మళ్లీ నిర్మిస్తా మన్నారు. టీ టీడీపీ పార్టీనీ యువ రక్తంతో నింపుతానని సీఎం చంద్రబాబు తెలంగాణ నేతలకు హామీ ఇచ్చారు.
అలాగే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో (NDA Govt) దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తుంద ని 2047 సంవత్సరం వరకు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగు తుందని సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీని యుగపురుషుడు ఎన్టీఆర్ ఇదే గడ్డపై, ఇక్కడే ఎమ్మెల్యే కాలనీలో ప్రారంభించారని గుర్తుచేశారు. తెలు గు వాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేందుకు టీడీపీ పుట్టుకొచ్చిం దని, ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చంద్ర బాబు (Chandrababu Naidu)చెప్పారు.
తెలుగుజాతికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్(ntr).. తెలుగువాళ్లను మదరాసీ అని పిలుస్తుంటే కాదు తెలుగుజాతి అనేది ఒకటుందని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొని యాడారు. కరణం, మునసబు, పటేల్ పట్వారీ వ్యవస్థతో తెలం గాణ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను ఎన్టీఆర్ తొలగించారని గుర్తుచేశారు.ఆ వ్యవస్థలను ఎన్టీఆర్ రద్దు చేయడంతో మాకు స్వాతంత్ర్యం వచ్చిందని ఇక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన సమ యంలో రెండు రాష్ట్రాలు సమాం తరంగా అభివృద్ధి చెందాలని, ఏ ప్రాంతంవైపు మొగ్గుచూపబోనని తాను చెప్పానన్నారు. రెండు ప్రాంతాల ప్రయోజనాల కోసం ఆలోచించి పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)అని చెప్పారు. . తెలుగుజాతి ఐకమత్యంతో Telugu Jati Unity)ఉండా లని కోరుకుంటా, కలిసి మెలిసి ఉండాలనే నా చివరి రక్తపు బొట్టు వరకు ఆలోచిస్తానని చంద్ర బాబు పేర్కొన్నారు.