–తిరుమలలో ప్రక్షాళన ప్రారంభం
–దళారుల భరతం పడుతున్న యంత్రాంగం
–భక్తులకు సేవలపై దృష్టితో దళా రులకు ఉక్కిరి బిక్కిరి
–నిర్లక్ష్య సిబ్బందికి షోకాజ్ నోటీ సులు, మెమోల జారీ
Chandrababu:ప్రజా దీవెన, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)ప్రక్షాళన కార్య క్రమం ఊపందుకుంటోంది. టీటీడీ కార్యనిర్వహణాధికారిగా (As Executive Officer of TTD)బాధ్యత లు చేపట్టిన శ్యామలరావు అంశా లవారీగా లోటుపాట్లను సరిదిద్దడం మొదలు పెట్టారు. తిరుమలకు(Tirumala) వచ్చే యాత్రీకుల అవసరాలు లక్ష్యంగా పలు వ్యవస్థలలో మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పలువురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు, మెమోలు జారీ చేయడమే కాక కొందరు డెప్యూ టేషన్ అధికారులను మాతృ సంస్థకు పంపించే కార్యక్రమాన్నీ కూడా ప్రారంభించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే తిరుమలేశుని దర్శించుకోడానికి గత నెలలో తిరుమలకు వచ్చిన చంద్రబాబు ఇక్కడినుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నట్టు ప్రకటించారు. ఆ క్రమంలోనే సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి శ్యామలరావు ను టీటీడీ (TTD) కార్యనిర్వహణాధికారిగా నియమించారు. విధుల్లో చేరిన వెంటనే విస్తృతంగా పర్యటనలు మొదలు పెట్టిన శ్యామల రావు ముఖ్యమంత్రి చెప్పిన ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో కిలోమీటర్ల కొద్దీ ఉన్న క్యూ లైన్లలో వేచి వుండే భక్తులను నామమాత్రంగా అందుతున్న అన్న ప్రసాదాలు, పాలు వంటి వాటిపై దృష్టి సారించారు. క్యూలైనులలో వేచివుండే భక్తులకు నిరంతరాయంగా నీళ్లు, పాలు, అన్న ప్రసాదాలు అందించాలని ఆదేశాలను జారీ చేశారు.అదేవిధంగా పారిశుధ్యం విషయంలో తనిఖీలు జరిపి తగు ఆదేశాలు జారీ చేసి చక్కదిద్దే చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో విధినిర్వహణ కు (Performance of duty)సంబంధించి పలువురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు, మెమోలు కూడా జారీ చేశారు. దర్శనం పరమైన సమస్యలను గుర్తించిన శ్యామల రావు (Shyamala Rao) శ్రీవారి మెట్టు మార్గం గుండా వచ్చే వారికి దివ్య దర్శనం టోకెన్లు ఇచ్చే ప్రక్రియను పునః ప్రారం భించారు.తిరుమలలో పెచ్చుమీ రిపోతున్న దళారీలపై దృష్టి సారించి టీటీడీ విజిలెన్సు, పోలీసుల సమన్వయంతో అరికట్టే చర్యలను మొదలు పెట్టారు. ఇటీవలి కాలంలో తిరుమలేశుని దివ్య ప్రసాదం లడ్డూల విషయంలో వస్తున్న నాణ్యతా పరమైన అంశాలను చక్కదిద్దడానికి అటు వస్తువులను సరఫరా చేసే వ్యాపా రులతో, ఇటు లడ్డూలను తయారు చేసే బ్రాహ్మణులతో సమావేశాలు నిర్వహించి లోపాలను సరిద్దిద్దడం ప్రారంభించారు.
అన్నిటినిమించి ప్రభుత్వం నుంచి టీటీడీ (TTD) కి డెప్యూటేషన్ పై వచ్చిన అధికారుల పనితీ రు పై దృష్టి ని సారించిన శ్యామల రావు అవసరాన్ని బట్టి కొనసాగిం చాలా వద్దా అనే అంశంపై చర్యలు మొదలు పెట్టారు.తాజాగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా ) వైస్ చైర్మన్ గా పని చేస్తూ కొన్ని నెలల కిందటే టీటీడీకి డెప్యూటేషన్ పై (Deputation to TTD) వచ్చిన హరికృష్ణ ను వెనక్కు పంపించివేశారు. మరి కొందరిని కూడా పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంమీద పలు కారణాలవల్ల గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవస్థలను, విభాగాలను చక్కదిద్దడం ద్వారా చంద్రబాబు నిర్దేశకత్వంలో టీ టీ డి ప్రక్షాళన ఊపందుకుంది. తిరుమ లలో దళారుల ఆటకట్టించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
టీటీడీ (TTD)విభాగం నుంచి గదులు పొంది అక్ర మాలకు పాల్పడిన వారిపై నిఘా పెంచారు.దళారుల అక్రమాలపై 2019 నుంచి ఇప్పటివరకూ 279 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లోని నిందుతుల వివరాలను ప్రకటించారు. నకిలీ ఆధార్లతో గదులు, సేవా టికెట్లు పొందిన 589 మందిని గుర్తించారు. వీరిలో 208 మందిని అరెస్ట్ (arrest)చేశారు. మిగిలిన 381 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు సమర్పించిన నకిలీ ఆధార్ కార్డుల ఆధారంగా పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిఘా పెట్టారు. చిన్న తప్పు దొరికినా వెంటనే చర్యలు తీసుకుంటు న్నారు. గత ప్రభుత్వంలో చాలా అక్రమా లు, అవకతవకలు జరిగిన బుట్లు గుర్తించారు. దీంతో వారంద రిపై చర్యలు తీసుకు నేందుకు చంద్రబాబు (chandra babu) ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.