Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandrababu: అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను దివాలా తీయించారు

–వారి దోపిడీతో ఖజానా ఖాళీ అయిన పరిస్థితి త‌లెత్తింది
–ఏపీ దీనగాధ ప‌రిస్థితుల‌న్నీ ప్రధా ని మోదీకి వివరించాం
–సుజల స్రవంతితో ఉత్తరాంధ్రకు సాగునీళ్ళు ఇస్తాం
–అనకాపల్లిలో సీఎం చంద్రబాబు

Chandrababu:ప్రజా దీవెన, విశాఖపట్నం: ఉత్తరాం ధ్ర సుజల స్రవంతి (Sujala Sravanti) పూర్తైతే ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకు సాగునీరు అం దించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu)అన్నారు. సుజల స్రవంతిని (Sujala Sravanti) పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంత మంతా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాప ల్లి జిల్లాలో 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం తో పాటు తాగునీటి సమస్య పరిష్కారం అవు తుంది. సుజల స్రవం తి పనుల్లో టీడీపీ హయాంలో చేసి న పనులు తప్ప గత ప్రభుత్వంలో ఒక్క ముందడుగు పడలేదన్నారు. ఎక్కడ వేసి న గొంగళి అక్కడే ఉంద ని, ఒక్క ఇంచు కూడా పని ముందు కు కద ల్లేదన్నారు. ఐదేళ్లలో ఎక్కడైనా తట్ట మట్టి వేశారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప ట్టాక తొలిసారి ఉత్తరాంధ్ర లో చంద్ర బాబు నాయుడు పర్యటించారు.

అనకాపల్లి జిల్లా పాయక రావుపేట నియోజకవర్గం దార్లపూడి వద్ద గురువారం పోలవరం ఎడ మ కాల్వను పరిశీలించారు. అంత కుముందు కాల్వ పనులపై ఏర్పా టు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ (Photo exhibition)ను పరి శీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యటన కు వచ్చిన సీఎంకు మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, పార్టీ నేత లు, జిల్లా ఉన్నతాధికారులు స్వా గతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఓట్లు వేసి గెలిపించిన వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని అన్నారు.రాష్ట్రంలో ఉభ య గోదావరి జిల్లాల తర్వాత ఎక్కు వ ఆదరించిన ప్రాంతం ఉత్తరాంధ్ర. కూటమి అభ్యర్థులను మంచి మె జారిటీతో గెలిపించారనీ, మీ రుణం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాన ని, భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి నంతా ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చు కుంటానని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన-బీజేపీ (TDP, Janasena-BJP) కలిసి కూటమిగా వచ్చాయనీ, అరాచకాలు చేసిన వ్య క్తిని, తప్పు లు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారని గుర్తు చేశా రు.రాజకీయాల్లో విర్రవీగితే సరిచేసే శక్తి ప్రజలకే ఉంది. ప్రజలు గెలవాల నీ, రాష్ట్రం నిలబడాలని ఎన్నికల ముందు ప్రచారం చేశామని, ఇప్పు డు ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టడానికి మేము కష్టపడ తామన్నారు.

ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ రంగంపై ( power sector) శ్వేతపత్రం విడుదల చేశామని తెలిపారు. పోలవరంను 72 శాతం నేను పూర్తి చేశానని, ఒక దుర్మార్గుడు వచ్చి డయాఫ్రం వాల్ ను గోదావరిలో కలిపేశాడని, కాఫర్ డ్యామ్ లు డ్యామేజ్ Damage to coffer dams)అయ్యాయని, 2021 జూన్ కు నీళ్లు రావాల్సి ఉం డగా నిర్వీర్యం చేశారాన్నారు. పోల వరం రాష్ట్రానికి వరమని, ఉత్తరాం ధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి పోల వరం ద్వారా గోదావరి నీళ్లు తీసు కొస్తే ప్రతి ఎకరాకు నీరు అందిం చొచ్చుని, కరవు అనే సమస్య ఉండ దని, గత ప్రభుత్వ నిర్వాకంతో పోల వరం పూర్తవ్వడానికి ఆలస్యం అవు తోందని, అందువల్ల పురుషోత్త ప ట్నం, పుష్కర్ లిఫ్ట్ ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని ఈ ప్రాంతానికి తీసుకురావొచ్చు. అండర్ పాస్ లకు కూడా టెండర్లు (tenders) పిలిచి త్వరితగతిన పూర్తి చేస్తామని సీఎం తెలిపారు.

నదుల అనుసంధానమే కరవు కు పరిష్కారం… ఉత్తరాంధ్ర సు జల స్రవంతిలో కుడి కాలువ 21 4 కి.మీ పూర్తి కావాల్సి ఉందని, మొద టి విడతగా కాలువను 93 కి.మీ పూర్తి చేయడానికి రూ.800 కోట్లు ఖర్చు అవుతుందని, దీంతో లక్ష ఎక రాలకు అనకాపల్లి పరిధిలో నీరం దించవచ్చని, ఇప్పుడే టెండర్లు పిలి చి పనులు ప్రారంభిస్తామని తెలిపా రు. యాక్షన్ ప్లాన్ తయారు చేశాక మరింత వేగవంతంగా పనులు పూర్తి చేస్తామని, ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు పోలవరం (polavaram) కుడి కాల్వ ద్వారా సాగునీరు అందించవచ్చని వివరించారు. 23 టీఎంసీల నీళ్లతో అనకాపల్లి జిల్లాలో ఇంటింటికీ కు ళాయిల ద్వారా నీరందించవచ్చని, రూ.800 కోట్లు ఖర్చు చేసి 93వ కి.మీ వరకు 2.20 లక్షల ఎకరాలకు నీరందించేందుకు మొదటి విడతలో పనులు పూర్తి చేస్తామని, ఈ ఉత్త రాంధ్ర సుజల స్రవంతి వంశధార నది దాకా వెళ్తుందని, వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో కర వు లేకుండా చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

మూడు షుగర్ ఫ్యాక్టరీలు (Sugar factory) మూత …ఈ ప్రాంతంలోని షుగర్ ఫ్యాకర్టీ రైతులకు కూడా హామీ ఇస్తున్నామని, గత అసమర్థ ప్రభు త్వం కారణంగా 3 షుగర్ ఫ్యాక్టరీలు పడకేశాయని, ఇక్కడి రైతులకు కూడా న్యాయం జరగాలని, వారి భాగస్వామ్యంతోనే ఫ్యాక్టరీలు నడ వాలని, రైతులకు న్యాయం చేస్తా మని, శాశ్వతంగా సమస్యను పరి ష్కరిస్తామని, నేను కష్టపడతానని, సంపద సృష్టించి ఆదాయం పెంచి పేదలకు పంచుతామని, మీకు వెసు లుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీ యే ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశా రు. దేశంలో ఎక్కడా ఇవ్వని విజ యాన్ని ఏపీ ప్రజలు ఎన్డీయేకు ఇచ్చారని, ఇది చారిత్రక విజయ మని, 95 వేల మెజారిటీతో అభ్య ర్థులను గెలిపించారని, మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత, దొంగ మాటలు చెప్పేవాళ్ల మాటలు నమ్మి బజారులో తిరగనిస్తే బతుకులు ఏమవుతాయో ఆలోచించాల ని సూచించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant)పై తప్పుడు ప్రచారం …విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant)ను ఏ విధంగా కాపాడుకోవాలో ఆలోచి స్తున్నామని, కానీ ఒక పనికి మాలి న పార్టీ ఉంది ఆ పార్టీ నేతల పొట్ట నిండా అబద్ధాలే, వారికి కల వచ్చిందంటా, అమ్మడానికి నేను ఒప్పుకున్నానంట, తెలుగువారి ఆత్మ గౌరవానికి (self respect) ప్రతీక విశాఖ ఉక్కు అని పునరుద్ఘాటించారు.విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పోరా డి ఫ్యాక్టరీని సాధించుకున్నామని, నాడు ప్రైవేట్ పరం చేస్తామని ప్రతి పాదనలు వచ్చినప్పుడు నేను పోరాడి అడ్డుకున్నానని, కేంద్రం నుండి ఆర్థిక సాయం కూడా తీసుకొచ్చామని, స్టీల్ ప్లాంట్ ను కాపా డుకునే బాధ్యత మాదేనని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పే వారి మాటలు ఖండిస్తూ వాస్తవాలు చెప్పాలని, కరుడుగట్టిన ఆర్థిక ఉగ్ర వాదులు విశాఖను దోచేశారని, వీళ్ల ను వదలిపెట్టననని, ప్రజల మనో భావాలకు అనుగుణంగా పని చేస్తా మని సీఎం చంద్రబాబు అన్నారు.

జగన్ అనే భూతాన్ని భూ స్థాపి తం చేయాల్సింది ప్రజలే సూపర్-6 (super06)హామీలు కూడా త్వరలో అమలు చేస్తామని, ప్రతి కుటుంబా నికి అండగా ఉంటామని, 30 రోజు లు కూడా కాలేదని, అయినా చెప్పి నమాట ప్రకారం పింఛన్ ను రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచా మని వివరించారు. మూడు నెలల బకాయిలు కలిపి రూ.7 వేలు ఒకే సారి అందించామని, దేశంలోనే ఇదొ క చారిత్రాత్మక ఘట్టమని, మొదటి సంతకం డీఎస్సీపైనే (dsp)పెట్టి 16,347 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపామని, మీ భూములు కొట్టే సేందుకు తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేశామని, 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి ప్రారంభించబోతున్నామని, పేదవాడికి అన్నం పెడితే సహించలే ని మనస్తత్వం గత ప్రభుత్వానిదని, పెట్టుబడిదారులతో మాట్లాడుతుం టే మీ రాష్ట్రంలో భూతం ఉందని అది లేస్తే ఏమవుతుందోనని అన్నా రు. ఆ భూతానికి భూత వైద్యం చేసి శాశ్వతంగా భూ స్థాపితం చేసే బాధ్యత ప్రజలకే అప్పజెప్పామని వారితో చెప్పామని, ఆ భూతాన్ని కంట్రోల్ చేసే వైద్యులు (docters)ప్రజలే అని అన్నారు.