–ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం’ తొలి’ సంత కం ఐదు అంశాలకు ఆమోదం
–మొట్టమొదటి కూటమి మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
–పెంచిన పింఛన్ జూలై 1వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా నేరుగా ఇంటికే
–ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు,తొలి దశలో 203 అన్న క్యాంటీన్లు ప్రారంభం, గంజాయిపై ఉక్కుపాదం
–ఐదుగురు మంత్రులతో కమిటీతో పాటు 7 అంశాలపై శ్వేత పత్రాల విడుదల
Chandrababu: ప్రజా దీవెన, అమరావతి: ఆంద్ర ప్రదేశ్ లో కొలువు దీరిన కూటమి ప్రభుత్వం హామీల అమలుకు అడుగులు ముందుకు పడ్డాయి. ఎన్నికల సమయం తో పాటు అధికారంలోకి రాగానే తొలి సంతకం చేసిన పలు హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మెగా డీఎస్సీ, సామాజిక పింఛ ను రూ.4వేలకు పెం పు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీ న్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి అత్యవసర అంశాలపై ము ఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) బాధ్యత లు స్వీకరించిన వెంటనే పెట్టిన ఐదు తొలి సంతకాల అమలు కు రంగం సిద్ధమైంది. సోమవారం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షన కూటమి స ర్కారు తొలి క్యాబినెట్ సమావేశం (First Cabinet meeting)జరిగింది. ఈ భేటీలోనే కీలక నిర్ణ యాలపై ఆమోదముద్ర పడింది. మాజీ సీఎం జగన్ హయాంలో ఆంధ్ర ప్రదేశ్పై గంజాయి రాజధా నిగా పడిన ముద్రను తొలగించా లని ప్రభుత్వం సంకల్పించిన నేప ద్యంలో గంజాయితో పాటు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీని కో సం ఐదుగురు మంత్రులతో కమి టీని నియమించింది.
పెంచిన వృద్ధాప్య పింఛన్లను (Enhanced old age pensions)జూలై 1 నుంచి సచి వాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పంపిణీ చేయించాలని నిర్ణ యం తీసుకుంది. పోలవరం, అమరావతి సహా ఏడు అంశాలపై (On seven points) వేర్వే రుగా శ్వేతపత్రాలను విడుదల చే యాలని నిశ్చయించింది. క్యాబినెట్ నిర్ణయాలను (Cabinet decisions) సమాచారశాఖ మం త్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. ఏపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)నైపుణ్య సెన్సెస్ 2024 నిర్వ హణకు సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. దీనిపై కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను కక్షపూరితంగా మూసేసి నిరుపేదల నోటి దగ్గర ము ద్ద తీసేసిందని గుర్తు చేస్తూ పేదవా డి ఆకలి తీర్చేందుకు సీఎం చంద్ర బాబు బాధ్యతలను స్వీకరించిన రోజునే అన్న క్యాంటీన్లను పునరు ద్ధరిస్తూ సంతకం పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా 20 3 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలి దశలో 183 క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మిగిలిన 20 క్యాంటీన్లు తదుపరి దశలో ప్రారంభం అవుతా యి. ఉదయం అల్పాహారం, మధ్యా హ్నం భోజనం, రాత్రి భోజనం సబ్సి డీ ధరకు రూ.5 లకే అన్న క్యాంటీన్ల లో అందుతుందని పార్థసారథి తెలి పారు. కాగా పూర్వ అడ్వకేట్ జనర ల్ ఎస్.శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి (Sudhakar Reddy) రాజీనామాలను ఆమోదిస్తూ, అడ్వ కేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివా స్ను నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ఇక గత ప్రభుత్వ అవినీతిపై ప్రజల్లో అవగా హన కల్పించేందుకు 7 శ్వేతపత్రా లను విడుదల చేస్తామని వెల్లడిం చారు. పోలవరం, అమరావతి, విద్యుత్తు, పర్యావరణం ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొద లైనవి మద్యం, శాంతిభద్రతలు, ఆర్థిక రంగంపై ఈ శ్వేతపత్రాలు ఈ నెల 28 నుంచి జూలై 18 వరకు విడుదల అవుతాయని సమాచార మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.