Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandrababu: శ్రీకాకుళం జిల్లా కవిటిలో ‘ఇది మన ప్రభుత్వo’

–రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు రాక

Chandrababu: ప్రజా దీవెన, శ్రీకాకుళం: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు (Chandrababu) శుక్రవారం ఇచ్చా పురం నియోజకవర్గంలో పర్యటిం చనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వందరోజుల పూర్తయిన నేపథ్యంలో ” ఇది మన ప్రభుత్వం ” పేరిట కవిటి మండలం రాజపురం గ్రామంలో నిర్వహించే రచ్చబండ (Rachabanda)కార్యక్రమంలో ఆయన పాల్గొంటా రు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రోజులపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం (Ichchapuram)నియోజకవర్గంలో నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమం నిర్వహణకు ఒక్కరోజే గడువు ఉండడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్రబాబు నాయుడు జిల్లాకు రావడంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి గురువారం ఉదయం ఏడు గంటలకే రాజపురం చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఏర్పాట్లను స్వయంగా జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. వింధ్య గిరిలో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్ (Helipod)నుంచి రూట్ మ్యాప్, రాజపురంలో గ్రామసభ నిర్వహించే రచ్చబండ వేదిక ఏర్పాటు, అలాగే తొలుత నలుగురు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో ముచ్చటించే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వారు స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్ తో కలసి స్థానిక యంత్రాంగానికి ఈ సందర్భంగా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, ఆర్డీవో భరత్ నాయక్, ఏఎస్పి శ్రీనివాసరావు డిఎస్పి వివేకానంద, డిఆర్డిఏ పిడి కిరణ్ కుమార్, ఆర్అండ్బి ఎస్ఈ జాన్ సుధాకర్ తదితరులు ఉన్నారు.