–రెండు నెలల్లో 267 కిలోల బంగా రం అక్రమ రవాణా
–మలద్వారంలో బంగారంతో గంట సేపు మలవిసర్జన భంగిమలో కూ ర్చునేలా స్మగ్లర్లకు ప్రత్యేక శిక్షణ
–కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పేందు కు సరికొత్త మార్గంలో స్మగ్లర్లు
–చెన్నై యూట్యూబర్ గ్యాంగ్ అరెస్టు
Chennai YouTuber Smuggled:ప్రజా దీవెన, చెన్నై: బంగారాన్ని పొడిగా, పేస్ట్గా (Dry gold into a paste)మార్చి 300 గ్రాముల చొప్పున సిలికాన్ బాల్స్ లో పెట్టి ఆ బాల్స్ను మలద్వా రంలో పెట్టుకుని బంగారాన్ని దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న చెన్నై యూట్యూబర్ సాబిర్ అలీ(29) గ్యాంగ్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో ఆ గ్యాంగ్ ఇలా అడ్డదారిలో తరలించిన బంగారం అక్షరాలా 267 కిలోలు దాని విలువ సుమారుగా రూ.167 కోట్లు ఉంటుందని అంచనా. సాబిర్ అలీకి ‘షాపింగ్బాయ్జ్’ పేరుతో ఒక యూట్యూబ్ చానల్ ఉంది. దాని ద్వారా ఇంటర్నేషనల్ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా అతడిని సంప్రదించి.. బంగారం అక్రమ రవాణాకు ఒప్పం దం కుదుర్చుకున్నట్టు సమాచారం. నిజానికి ఇలా మలద్వారంలో బంగారం పెట్టుకుని అక్రమ రవాణా చేసేవారి గుట్టు బయటపెట్టడానికి కస్టమ్స్ అధికారులు ఓ టెక్నిక్ను అనుసరిస్తారు.
అదేంటంటే అను మానితులను స్క్వాటింగ్ పొజిషన్లో (Squatting position)(అంటే మలవిసర్జన చేసే భంగిమలో) చాలా ఎక్కువసేపు కూర్చోబెడతారు. అసలే లోపల ఉన్న బంగారం కారణంగా వారికి నొప్పిగా ఉంటుంది. దీంతో వారు ఎక్కువసేపు అలా కూర్చోలేక, నొప్పిని తట్టుకోలేక నిజం చెప్పే స్తారు. ఒక్కోసారి ఆ బాల్స్ (balls)బయ టకు వచ్చేస్తుంటాయి. కానీ, చెన్నై ఎయిర్పోర్టులో ‘ఎయిర్హబ్’ పేరు తో ఒక దుకాణాన్ని నడుపుతున్న సాబిర్ అలీ దీన్ని అధిగమించడా నికి ఓ పద్ధతిని కనిపెట్టాడు. గోల్డ్ స్మగ్లింగ్కు ఏడుగురు ఉద్యోగులను నియమించుకుని మలద్వారంలో పసిడి పేస్ట్, పొడి ఉన్న సిలికాన్ బాల్స్ పెట్టుకుని, స్క్వాటింగ్ పొజి షన్లో గంటసేపు ఎలాంటి ఇబ్బందీ లేకుండా కూర్చోగలిగేలా వారికి కఠిన శిక్షణ ఇప్పించాడు. మొదట ఒకబాల్తో మొదలుపెట్టి మూడు బాల్స్ను సైతం లోపలపెట్టుకుని గంట సేపు స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చునే స్థాయికి వారు చేరుకు న్నారు. ఇలా బంగారాన్ని స్మగుల్ చేయాల్సిన ప్రతిసారీ పదిరోజుల ముందే వారు ఈ విధానాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెడతారు.
సాబి ర్ వారికి నెలకు రూ.15 వేల జీతం ఇచ్చేవాడు. మలద్వారంలో బంగా రం ఉన్న సిలికాన్ బాల్ (Silicon ball) పెట్టుకుని దాన్ని అక్రమ రవాణా చేసిన ప్రతి సారీ బాల్కు రూ.5 వేల చొప్పున ఇచ్చేవాడు. వీరి మోడస్ ఆపరెండీ ఎలా ఉంటుందంటే విదేశాల నుంచి బంగారాన్ని ఇదే పద్ధతిలో కొందరు చెన్నై ఎయిర్పోర్టు (Chennai Airport) దాకా తీసుకు వస్తారు. ఇలా తీసుకువచ్చేవారిని క్యారియర్లు అంటారు. వారు చెన్నై ఎయిర్పోర్టులో దిగగానే అక్కడ ట్రాన్సిట్లాంజ్లో వారి నుంచి సాబిర్ అలీ ఉద్యోగుల్లో ఒకరు ఆ బంగారాన్ని తీసుకుంటారు. అక్కడ దాన్ని తమ మలద్వారంలో పెట్టుకు ని ఆ నొప్పి ముఖంలో తెలిసేలోపే బయటకు వచ్చేస్తుంటారు. ఒకవేళ కస్టమ్స్ అధికారులు అనుమానించి స్క్వాటింగ్ పొజిషన్లో (Squatting position) కూర్చోబెట్టి నా గంటసేపు సునాయాసంగా కూ ర్చోగలుగుతారు. దీంతో కస్టమ్స్ అధికారులు వారిని వదిలేస్తారు. ఈ పద్ధతిలోనే వారు భారీగా బంగా రాన్ని అక్రమంగా రవాణాచేస్తూ వచ్చారు. కానీ, ఎట్టకేలకు జూన్ 29న వీరి గ్యాంగ్లో ఒక వ్యక్తి తేదీ ల్లో అధికారులకు దొరికిపోయాడు. అతడి మలద్వారంలో దాచుకున్న సిలికాన్ బాల్స్ గుట్టు ఎక్స్రే ద్వారా రట్టయింది. అతడిచ్చిన సమాచా రం ఆధారంగా సాబిర్ అలీని, మిగ తా ఆరుగురినీ అరెస్ట్ చేశారు. ఈ దందా ద్వారా సాబిర్ అలీ రెండు నెలల్లో రూ.2.5 కోట్ల దాకా సంపా దించినట్టు సమాచారం.