Chief Minister A. Revanth Reddy : ప్రజా దీవెన హైదరాబాద్: లోక్సభ నియోజకవర్గాల పునర్వి భజన దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తు న్న ప్రయత్నాలు, అనుసరించ బో యే విధి విధానాలు, రాష్ట్ర ప్రభు త్వాలతో పారదర్శకమైన సంప్ర దింపులు జరపకుండా చేస్తున్న కసరత్తు పట్ల తెలంగాణ శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో లోక్సభ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించడంతో పాటు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ప్రస్తుత సరిహద్దులను మార్పు చేయాలని కోరుతూ సభా నాయకుడు, ముఖ్యమంత్రి ఎ.రే వంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానా న్ని శాసనసభ ఆమోదించింది.
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన కసరత్తు పారదర్శ కంగా ఉండాలని, అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని తీర్మానంలో కోరారు. పునర్విభజనకు ప్రాతిపదిక విష యంలో రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకపోవడం, ప్రస్తుత కసరత్తు వల్ల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల నష్టం వాటిల్లుతుంది.
కేంద్ర ప్రభుత్వానికి తమ అభిమ తాన్ని తెలియజేయాలన్న ఉద్దే శంతో శాసనసభ తీర్మానం ప్రతిపా దించినట్టు ఈ సందర్భంగా ముఖ్య మంత్రి సభ ముందు వివరించారు. సీఎం ప్రసంగం ఆయన మాట ల్లోనే.. తీర్మానాన్ని ముఖ్యమంత్రి సభ లో ప్రవేశపెడుతూ లోక్సభ నియోజక వర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధివిధానాలు, రాష్ట్ర ప్రభుత్వా లతో పారదర్శక మైన సంప్రదిం పులు లేకుండాజరు గుతున్న కసర త్తుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్య క్తం చేస్తోంది.అన్ని రాష్ట్ర ప్రభుత్వా లు, అన్ని రాజకీయపార్టీలు, భాగ స్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజ న కసరత్తును పారదర్శకంగా చేప ట్టాలని సభ కోరుతోంది. కేంద్ర ప్రభు త్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగు ణంగా జనాభా నియంత్రణ కార్యక్ర మాన్ని సమ ర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రా లకు పునర్విభజన శాపంగా మార కూడదు.
జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్దేశ్యంతో చేపట్టిన 42, 84 మరి యు 87వ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదనే చెప్పుకోవాలి. జనాభా నియంత్రణ అమలు చేయటం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూ డదు. అందుకే, నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు.
పార్లమెంట్ సీట్ల సంఖ్యను యథా తథంగా కొనసాగించాలి. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మా ర్పులు చేర్పులు చేయాలి. తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి. మహి ళలకు రిజర్వేషన్లు కల్పించాలి.
అంతే కాకుండా, ప్రాతినిధ్య ప్రజా స్వామ్యాన్ని బలోపేతం చేయడా నికి, తాజా జనాభా లెక్కల ప్రకా రం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభ జన చట్టం-2014లో నిర్దేశించిన మేర కు ప్రస్తుతం ఉన్న 119 అసెం బ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మా నిస్తుంది. అందుకు అవసరమైన రా జ్యాంగ సవరణలను ప్రవేశ పెట్టా లని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది అని ప్రతిపాదించారు.
ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వల్ల దక్షిణా ది రాష్ట్రాలకు నష్టం వాటిల్లు తుందని తమిళనాడు ముఖ్య మంత్రి నిర్వహించిన ఈ రాష్ట్రాల సమావేశం ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్య మంత్రి ప్రస్తావించారు. పునర్వి భజన కోసం గతంలో అనుసరించిన విధానాలను సభలో వివరించారు.
జనాభా ప్రాతిపదికన పుర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉన్న ప్రాతినిథ్యం 24 శాతం మేర కు నష్టం వాటిల్లుతుందని తెలిపా రు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153 కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ చట్టంలో పేర్కొ న్న విధంగా పునర్విభజన చేపట్టక పోవడాన్ని సభ ముందు వివరిం చారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన చేసిన తీరు, సిక్కింలో జరిగిన ప్రక్రియను తెలిపారు.
ప్రస్తుతం ప్రతిపాదిత పునర్విభజ న దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం మంచిది కాదని, క్షేమకరం కాదని, అందుకే రాజకీయాలకు అతీతంగా ఈ తీర్మానం ప్రవేశపెట్టినట్టు వివ రించారు.