Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Minister A. Revanth Reddy : సీఎం కీలక వ్యాఖ్య, న్యాయ పర మైన చిక్కులు లేకుండా ఎస్సీ వర్గీ కరణ

Chief Minister A. Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ క్రమ ప ద్ధతిలో షెడ్యూల్డు కులాల వర్గీక రణ అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చా మని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ వర్గీకరణ ఎవరికీ వ్య తిరేకం కాదని, వారిలో జగిరిన అ న్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నమే నని వివరించారు. ఈ వర్గీకరణ ప్రక్రియ భవిష్యత్తులో ఎలాంటి న్యా యపరమైన చిక్కులు ఎదురుకా కుండా శాశ్వత పరిష్కారం చూపిం చాలన్న ఉద్దేశంతో సుదీర్ఘ కసరత్తు చేశామని అన్నారు.శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై బిల్లును ఆమో దించి చట్టం చేసిన నేపథ్యంలో ఎ స్సీ ప్రజా ప్రతినిధులు, ఎస్సీ సం ఘాల ప్రతినిధులతో బుధవారం జరిగిన సమా వేశంలో ముఖ్యమం త్రి ప్రసంగించారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా వర్గీకరణకు శా శ్వత పరిష్కారం చూపించాలని ప్ర యత్నించామని తెలిపారు. 59 కులాలను ఏ రకంగా వర్గీకరించా లి, రోస్టర్ విధానం ఎలా ఖరారు చేయాలన్న విషయాల్లో ఏక సభ్య కమిషన్ చాలా లోతుగా విశ్లేషణ లు చేసి ప్రభుత్వానికి 199 పేజీల నివేదిక సమర్పించింది. అందులో వారు ఎస్సీల 15 శాతం రిజర్వేషన్ల ను మూడు కేటగిరీలుగా వర్గీకరిం చారు. ఆ ప్రయత్నం చట్టపరంగా, న్యాయపరంగా ఉండాలన్న ఉద్దేశం తో అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎస్సీ వర్గాలకు న్యాయం చేయలే మని భావించి నిర్ణయాలు తీసు కున్నాం. అసెంబ్లీలో బిల్లు ఆమో దం పొందాలంటే దానికొక విధానం ఉంటుంది. రూపొందించించే చట్టం లో లొసుగులు ఉండొద్దు. శాశ్వత పరిష్కారం చూపాలని భావించాం.


వర్గీకరణను దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు. ము ఖ్యంగా మాదిగలు ఎవరికీ అన్యా యం చేయడం లేదు. వారి న్యాయ మైన హక్కు కోసం వారు ప్రయత్నం చేస్తున్నారనే ఒక విస్తృతమైన అభి ప్రాయం కల్పించడం కోసం ప్రభు త్వం ఈ కసరత్తులో పూర్తిగా ప్రయ త్నం చేసింది.ఈ అంశం కొలిక్కి వచ్చే వరకు కొత్తగా ఒక్క నోటిఫికే షన్ కూడా జారీ చేయలేదు. ఎందు కంటే ముందు ఈ అంశం ఏదో ఒక టి తేల్చాలని, పరిష్కారం చూపా లని పట్టుదలతో పనిచేశాం. ఇంత చేసిన తర్వాత వర్గీకరణ వృధా కా వొద్దు. భవిష్యత్తులో పది మందికి ఉపయోగపడాలి. అవకాశం వచ్చి నప్పుడు సద్వినియోగం చేసుకో వాలి. మీ సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది..” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు దా మోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మె ల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.