Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Minister A. Revanth Reddy : సీఎం కీలక నిర్ణయం, ప్రజాభిప్రా యంతోనే గిగ్ వర్కర్ల ముసాయిదా

Chief Minister A. Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: గిగ్ వ ర్కర్లకు భద్రత కల్పించడానికి ఉ ద్దేశించిన బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందు బాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజ ల నుంచి వచ్చే సలహాలు, సూచన లు, అభ్యంతరాలను పరిగణనలో కి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు.

గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతి నిధులు, వివిధ శాఖల ఉన్నతా ధికారులతో ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాల యంలో ప్రత్యేకంగా సమావేశ మ య్యారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భ ద్రత, బీమా సదుపాయం, ఇతర హక్కులను కల్పించేలా కార్మిక శాఖ రూపొందించిన ముసాయిదా “తె లంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వ ర్కర్స్ బిల్లు”లో పొందుపరిచిన అంశాలను అధికారులు సమావేశం లో ముఖ్యమంత్రికి వివరించారు.

ముసాయిదాలో ముఖ్యమంత్రి ప లు మార్పులు చేర్పులను సూచిం చారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్య తను ఇవ్వటంతో పాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం, సుహృద్భావం ఉండేలా కొత్త చట్టం ఉండాలని చెప్పారు. ఈ బిల్లు ము సాయిదాను వెంటనే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి, ప్రజాభిప్రా యాన్ని సేకరించాలని అధికారుల ను ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్స్ డ్రైవర్లు, ప్యాకేజ్ డెలి వరీల్లో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని, అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచ నలు, అభ్యంతరాలను స్వీకరిం చాలని సూచించారు. ముసాయి దాలో పొందుపరిచిన అంశాలపై తుది కసరత్తు చేయాలని, అన్నింటి నీ పరిగణనలోకి తీసుకొని ఈనెల 25వ తేదీ నాటికి బిల్లు తుది ము సాయిదాను సిద్ధం చేయాలని ఆదే శించారు.

నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూ ర్తి చేసే అంతర్జాతీయ కార్మిక దినో త్సవమైన మే డే రోజున ఈ బిల్లు ను అమల్లోకి తెచ్చేందుకు ఏర్పా ట్లు చేయాలని చెప్పారు. గిగ్ వ ర్కర్లు, ప్లాట్ ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముం దే హామీ ఇచ్చిన విషయాన్ని ము ఖ్యమంత్రి గుర్తు చేశారు. దేశంలోనే మొదటి సారిగా గిగ్ వర్కర్లకు ప్ర మాద బీమాను అమలు చేశామని చెప్పారు.

గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లు మరణిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమాను అం దించేలా 2023 డిసెంబర్ 30న ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింద న్నారు. కొత్తగా అమలు చేసే చట్టం కూడా దేశానికి తెలంగాణ మార్గద ర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో మంత్రులు పొ న్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివా సరెడ్డి , ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.