–కళాశాలల్లో క్షేత్ర స్థాయి పరిశీలన కు అధికారులతో కమిటీ
–మూడేళ్లలో అన్ని కళాశాలలు పూ ర్తి స్థాయి వసతులతో ఉండాలి
–నర్సింగ్ కళాశాలల్లో ఆప్షనల్గా జపనీస్ ఉండాలి
–వైద్యారోగ్య సమీక్షలో ముఖ్యమం త్రి ఏ.రేవంత్ రెడ్డి
Chief Minister A. Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని 34 వైద్య కళాశాల లు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే త యారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదే శించారు. ఇందుకోసం అధికారుల తో ఒక కమిటీని ఏర్పాటు చేయాల ని, ఆ కమిటీ ప్రతి కళాశాలను సం దర్శించి అక్కడ ఏం అవసరాలు ఉ న్నాయి. ఎంత మేర నిధులు కావా లి, తక్షణమే పూర్తి చేయాల్సిన ప నులు, ప్రభుత్వపరంగా అందించా ల్సిన సహాయం తదితర వివరాల తో నివేదికను సమర్పించాలని సీ ఎం ఆదేశించారు. వైద్యారోగ్య శా ఖపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఐసీసీసీలో సోమవారం ఆ శాఖ అ ధికారులతో సమీక్ష నిర్వహించారు.
జాతీయ వైద్య మండలి (ఎన్ఎం సీ) రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశా లపై చర్చించారు. ప్రభుత్వ వైద్య క ళాశాలల్లో నియామకాలు, బోధన సిబ్బందికి ప్రమోషన్లు, వైద్య కళా శాలలకు అనుబంధంగా ఉన్న ఆసు పత్రుల్లో పడకల పెంపు, ఆయా క ళాశాలలకు అవసరమైన వైద్య ప రికరాలు, ఖాళీల భర్తీ వీటన్నింటిపై సమగ్ర నివేదిక రూపొందించి అం దించాలని అధికారులను సీఎం ఆ దేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చే యాల్సిన నిధులను వెంటనే విడు దల చేస్తామని సీఎం తెలిపారు. కేం ద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అ నుమతులకు సంబంధించిన అం శాలుంటే వెంటనే తెలియజేయాల ని, కేంద్ర మంత్రి నడ్డా, ఆ శాఖ అధి కారులను సంప్రదించి వాటిని పరి ష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు. న ర్సింగ్ కళాశాలల్లో జపనీస్ (జపాన్ భాష) ను ఒక ఆప్షనల్గా నేర్పించా లని, జపాన్లో మన నర్సింగ్ సి బ్బందికి డిమాండ్ ఉందని సీఎం తె లిపారు. ఈ విషయంలో మనకు మద్దతు ఇచ్చేందుకు జపాన్ ప్రభు త్వం సిద్ధంగా ఉందని సీఎం వెల్ల డించారు. ఆసుపత్రులకు వచ్చే రో గులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆసుపత్రుల సమయాల పర్యవేక్ష ణకు ఒక యాప్ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
విద్యా, వైద్య రంగాలు ఎంతో కీలక మని, ప్రతి నెలా మూడో వారంలో ఈ రెండు శాఖలపై సమీక్ష నిర్వహిం చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ము ఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టి యానా జడ్ చోంగ్తూ, వైద్యారోగ్య శాఖ డైరెక్టరేట్ డాక్టర్ నరేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.