Chief Minister A. Revanth Reddy : ప్రజా దీవెన, జపాన్: తెలంగాణముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నే తృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్ర తినిధి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలక పెట్టుబడి ఒ ప్పందాలను కుదుర్చుకుంది. జపా న్కు చెందిన వ్యాపార దిగ్గజం మ రుబెనీ తెలంగాణలో పెట్టుబడుల కు ముందుకొచ్చింది.
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నె క్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పా ర్క్ను ఏర్పాటు చేసేందుకు మరు బెనీ సంసిద్ధమైంది. టోక్యోలో మరు బెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి, ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రి యల్ పార్క్ ఏర్పాటుకు సంబంధిం చిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు.
మరుబెనీ రూ. 1,000 కోట్ల ప్రారం భ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేప ట్టనుంది. ఫ్యూచర్ సిటీలో 600 ఎ కరాల్లో దశలవారీగా ప్రపంచ స్థా యి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేసేందుకు ప్రతి పాదనలు రూపొందించింది. ఈ ఒ ప్పందానికి సంబంధించిన లెటర్ ఆ ఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమ క్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మరుబెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు.
జపాన్ మరియు ఇతర మల్టీనే షనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఈ ఇండస్ట్రియల్ పా ర్క్ను అభివృద్ధి చేస్తారు. దీని ద్వా రా రూ. 5,000 కోట్లకు పైగా పెట్టు బడులను ఆకర్షించే అంచనా ఉంది.
మరుబెనీ ఇండస్ట్రియల్ పార్క్ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రం గాలపై దృష్టి సారిస్తుంది. అధునా తన తయారీ రంగాల్లో విదేశీ పెట్టు బడులను ఆకర్షించడంతోపాటు నైపుణ్య ఉపాధి అవకాశాలను సృ ష్టించాలనే తెలంగాణ రైజింగ్ లక్ష్యా లకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చే పడుతారు.
చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యూ చర్ సిటీలో మరుబెనీకి స్వాగతం పలికారు. ఈ పార్క్ ఫ్యూచర్ సిటీ లో అభివృద్ధి చేసే తొలి ప్రాజెక్ట్ అ వుతుందని పేర్కొన్నారు. దీని ద్వా రా తెలంగాణలో సుమారు 30,0 00 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకా శాలు సృష్టించబడి, జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు.
తెలంగాణలో వ్యాపారానికి అను కూలమైన అవకాశాలున్నాయని, మరుబెనీకి అవసరమైన సహకారా న్ని ప్రభుత్వం అందిస్తుందని ము ఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. హైద రాబాద్ ఫ్యూచర్ సిటీ భారతదే శంలోనే తొలి నెట్ జీరో సిటీగా అ భివృద్ధి చెందుతుందని, మరుబెనీ పెట్టుబడులకు ముందుకొచ్చినం దుకు సంతోషం వ్యక్తం చేశారు. భారత్-జపాన్ స్నేహ బంధం దృ ష్ట్యా పెట్టుబడిదారులు తెలంగాణ ను స్వస్థలంగా భావిస్తారని ముఖ్య మంత్రి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ, హైదరాబాద్ అభి వృ ద్ధిని విస్తరించేందుకు ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి ఎంచుకున్న వ్యూహాలు, వారి దార్శనికతను మరుబెనీ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దయ్ సకా కురా అభినందించారు. తెలంగాణ లో పెట్టుబడులకు తాము ఆసక్తిగా ఉన్నామని, అక్కడి అవకాశాలను వినియోగించుకునేందుకు ముందు వరుసలో ఉంటామని సకాకురా పే ర్కొన్నారు.
మరుబెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410కి పైగా గ్రూప్ కం పెనీల ద్వారా వ్యాపార కార్యక లాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమిక ల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనా న్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరో స్పేస్, మొబిలిటీ వంటి రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్ర పంచవ్యాప్తంగా సుమారు 50,000 మంది ఉద్యోగులను నియమించు కుంది.