Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Minister A. Revanth Reddy : ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల

Chief Minister A. Revanth Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: సామా జిక న్యాయం కోసం అందరికీ స మాన అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో డా. బీఆర్ అంబేద్కర్ జ యంతి రోజే ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గెజిట్ నోటిఫి కేషన్‌ను విడుదల చేసింది. సోమ వారం ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి మంత్రివర్గ ఉప సంఘం జీవో తొలి కాపీని అంద జేసింది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నర్సింహ, పొన్నం ప్రభాకర్, పొం గులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్, ఎం పీలు అనిల్ కుమార్ యాదవ్, పోరిక బలరాం నాయక్, ఉన్న తాధికారులు పాల్గొన్నారు.