–సమీక్షా సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి
Chief Minister A. Revanth Reddy : ప్రజా దీవెన హైదరాబాద్: ప్రజల అర్జీలను పరిష్కరించడంలో విజ యవంతంగా సాగుతున్న ప్రజా వా ణి కార్యక్రమంలో మరింత పార ద ర్శకమైన విధానాలను అమలు చే యాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమా న్ని ప్రజాభవన్లో కొనసాగుతున్న ప్రజావాణి డ్యాష్ బోర్డుతో అనుసం ధానం చేయాలని చెప్పారు.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్లో వారంలో రెండు రోజులు కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్ర మంపై డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి స మావేశంలో ముఖ్యమంత్రి సమీ క్షిం చారు. ప్రజలు ఇప్పటివరకు సమ ర్పించిన అర్జీలు, వాటిల్లో పరిష్కా రమైనవి, పరిష్కారానికి అధికారు లు అనుసరిస్తున్న విధానాలను ముఖ్యమంత్రి సమీక్షించారు.
2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 117 సార్లు ప్రజావాణి ని ర్వహించగా, అందులో 54,619 అర్జీలను ప్రజలు నమోదు చేసు కున్నారు. వీటిలో 68.4 శాతం (37,384) అర్జీలు పరిష్కారమ య్యాయని అధికారులు ముఖ్య మంత్రికి వివరించారు. అర్జీల వివ రాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల సమాచా రాన్ని ఆన్లైన్లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని ముఖ్య మంత్రి అధికారులకు సూచించా రు.
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వాటి అమలు పురోగతి పారదర్శ కంగా అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఉండేలా ఈ పోర్టల్ రూ పొందించాలని సూచించారు. వి విధ విభాగాలకు ప్రజావాణిలో ప్ర త్యేక డెస్క్లు ఏర్పాటు చేశామని, గల్ఫ్ సంబంధిత సమస్యల పరి ష్కారానికి ప్రవాసీ ప్రజావాణి ప్రత్యే కంగా ఏర్పాటు చేసినట్లు అధికా రులు వివరించారు. అర్జీదారులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
అత్యవసరమైన అర్జీలుంటే అక్క డికక్కడే పరిష్కరిస్తామని, అం బులెన్స్ సదుపాయం కూడా ప్రజా వాణి జరిగే రోజుల్లో అందుబాటు లో ఉంచినట్లు చెప్పారు. ప్రజావా ణి డ్యాష్ బోర్డు యాక్సెస్ను తనకు అందించాలని, తనకు లైవ్ యా క్సెస్ ఉండేలా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. త ద్వారా తాను ఎక్కడ ఉన్నా ప్రజా వాణి అర్జీల పరిష్కారం తీరును, ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయో తెలుసుకునే వీలుం టుందని, అర్జీల పరిష్కారానికి తీ సుకోవాల్సిన చర్యలపై అధికారు లకు దిశా నిర్దేశం చేయటం సుల భమవుతుందని అన్నారు.
ప్రజల వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది లేకుండా అమల్లో ఉన్న చట్టాల ప్ర కారం ఏయే సమాచారాన్ని గోప్యం గా ఉంచాలి, వేటిని ప్రజలకు అం దుబాటులో ఉంచాలనేది ముందు గా సమీక్షించుకోవాలన్నారు. అధి కారుల స్థాయిలో కమిటీ వేసి అం దుకు సంబంధించిన మార్గదర్శకా లు రూపొందించాలని ముఖ్యమం త్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు పొం గులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభా కర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు డు చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి శాంతికుమారి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యతో పాటు వివి ధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొ న్నారు.