Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CITU : ఐక్య పోరాటాల వారధి సీఐటీయూ

–55వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జండా ఆవిష్కరణ

CITU: ప్రజాదీవెన నల్గొండ : కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం ఐక్యత పోరాటం నినాదంతో సిఐటియు ఆవిర్భవించిందని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం అన్నారు. శుక్రవారం సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకాశం బజార్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ సంస్కరణ వాద సంఘాలు కార్మికుల సమస్య పరిష్కారానికి మూలం తెలపకుండా కార్మిక వర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేయకుండా యాజమాన్యాల పట్ల ఉదారవాద స్వభావంతో వ్యవహరిస్తున్న సమయంలో ఐక్యత పోరాటం అనే నినాదంతో సిఐటియు ఆవిర్భవించిందని అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలను స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లతో కేంద్ర ప్రభుత్వ అవలంబిస్తున్న నూతన ఆర్థిక విధానాల కు వ్యతిరేకంగా 22 జాతీయ సార్వత్రిక సమ్మెలు నిర్వహించిన ఘనత సిఐటియు ది అని కొనియాడారు. కార్మిక హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందు, తర్వాత 100 సంవత్సరాల కార్మిక ఉద్యమ చరిత్రలో అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు అవుట రవీందర్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జక్కల రవికుమార్, పట్టణ కార్యదర్శి పెరిక కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, దర్శనం ఎల్లమ్మ కత్తుల పద్మ మేడి సుగుణమ్మ రామలింగయ్య తీగల ఎల్లమ్మ బొప్పని శ్రీను తదితరులు పాల్గొన్నారు.