Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CITU District President Lakshminarayana: మండల మహిళా సమైక్య అటెండర్స్ కు వేతనాలు పెంచాలి

–సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ

CITU District President Lakshminarayana: ప్రజాదీవెన నల్గొండ : మండల మహిళా సమైక్య లో అటెండర్స్ గా 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారందరికీ కనీస వేతనం 18వేలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం మండల మహిళా సమైక్య అటెండర్స్ సమస్యలు పరిష్కరించాలని డిఆర్ డిఏ పిడి శేఖర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మండల మహిళ సమైక్య లు ఏర్పడిన నాటి నుండి 20 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అనేక రకాల పనులు చేస్తున్నారు. జిల్లాలో అటెండర్స్ కి 2వేలు నుండి 6వేలు వరకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ఈ వేతనాలు సరిపోక వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వీరికి గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, యూనిఫాం క్యాజువల్ సెలవులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి దాపురించిందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే వీరి వేతనాలు పెంచే విధంగా ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల అటెండర్స్ అందరూ పోరాటాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఉల్లెందుల సైదులు, లింగమ్మ, సుదర్శన్, కమలమ్మ, సుధాకర్, మణమ్మ, సైదమ్మ, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.