Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CJ Chandrachud: న్యాయవాదులపై సీజేఐ అసహనం

–కోర్టులు, న్యాయమూర్తులపై ఒత్తి డి ఎంత ఉంటుందో అర్థంచేసుకోవా లి
–ముంబై చెంబుర్‌ కాలేజిలో విద్యార్థినిలు బురఖా, హిజాబ్‌ రద్దు విచారణ సందర్భంగా సీజే చంద్రచూడ్

CJ Chandrachud:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: న్యా య వాదులపై సీజేఐ చంద్రచూడ్ (CJ Chandrachud) ఆగ్ర హం, అసహనం వ్యక్తం చేశారు. పలువురు సుప్రీంకోర్టు న్యాయ వాదులపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కోర్టులు, న్యా యమూ ర్తులపై (Courts and Justices)ఎంత ఒత్తిడి ఉందో కనీసం అర్ధం చేసుకోవాలని సీజేఐ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. న్యాయవాదులు ఒక రోజు సీజేఐ స్థానంలో కూర్చుంటే ఎంత ఒత్తడి తో పని చేస్తున్నామో అన్న విష యం తెలుస్తుందని చంద్రచూడ్‌ అన్నారు. ఒక్క రోజు తమ స్థానం లో కూర్చుంటే మళ్లీ జీవితంలో ఆ స్థానంలోకి రాకుండా పారిపోతారని సీజేఐ వ్యాఖ్యానించారు.ముంబై చెంబుర్‌ కాలేజిలో విద్యార్థినిలు బురఖా, హిజాబ్‌ రద్దు చేసిన వ్యవ హారంపై విచారణ సందర్భంగా సీ జేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నార ని, కానీ న్యాయమూర్తుల మీద ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరని తెలిపారు.

ప్రతి ఒక్క పిటిషన్‌పై (Petition) విచారణ చేస్తామని దానికి ఒక తేదీని ఇస్తామన్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి కానీ న్యాయమూర్తులను, కోర్టును శాసిం చవద్దు అని జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలి పారు. ముంబైకి చెందిన చెంబూర్ కళాశాల తన ప్రాంగణంలో హిజాబ్, బుర్కా, నఖాబ్‌ (Hijab, Burka, Naqab)లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించగా జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. న్యాయమూర్తులు ఎఎస్ చం దూర్కర్, రాజేష్ పాటిల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కళాశాల తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని తెలిపారు. విద్యార్థు లు హిజాబ్, నఖాబ్, బుర్కా, స్టో ల్స్, క్యాప్‌లు, బ్యాడ్జీలు ధరించరా దని డ్రస్ కోడ్ విధిస్తూ చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ విద్యార్థులు ఈ నెల ప్రారంభంలో ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తమ మతాచారాల ను పాటించడం తమ ప్రాథమిక హక్కు అని కానీ చెంబూర్ ట్రాంబే కాలేజ్ నిర్ణయం దీనికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. నఖాబ్, బుర్కా, హిజాబ్‌లపై ఉన్న పరి మితిని ఉపసంహరించుకోవాలని వారు మొదట కళాశాల యాజమా న్యాన్ని, ప్రిన్సిపాల్‌ను అభ్యర్థించా రు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం వివక్ష లేకుండా పౌరులంద రికీ విద్యను అందించాలనే స్ఫూర్తిని పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. బాంబే హైకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు.