CM A. Revanth Reddy : ప్రజా దీవెన, నారాయణపేట: రాష్ట్రంలో మొదటి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిం చారు. నారాయణపేట జిల్లా అప్ప కపల్లి గ్రామంలో దళిత మహిళ బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వ హించారు.
ఇండ్ల నిర్మాణానికి పత్రా లు అందుకున్న గ్రామ మహిళలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రు లు దామోదర రాజనర్సింహ, జూ పల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, లోక్ సభ సభ్యు రాలు డీకే అరుణతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికా రులు ఈ భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు.