CM Revanth Reddy : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ లో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వ రగా ఆమోదం తెలపాలని కేంద్ర రై ల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ కి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రపం చ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూ లమైన వాతావరణం, ప్రపంచ స్థా యి పరిశోధన, అభివృద్ధి కేంద్రాల తెలంగాణలో ఉన్నందున ప్రతిపాది త అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ASIP) ప్రాజెక్ట్, మైక్రో LED డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్కు ఆమోదం తెలపాలని కోరారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి ముఖ్యమం త్రి రైల్ భవన్లో అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ము చ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్ పార్క్ (Hitech Electr onic park) ఏ ర్పా లటుకు EMC 2.0 పథకం కిం ద తెలంగాణ అభ్యర్థనను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రీజి నల్ రింగు రోడ్డు సమీపంలో నూత న ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యా క్చరింగ్ పార్క్ను ఏర్పాటు చేయాలని విజ్ఞ ప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తుల కు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.తెలంగాణలో రైల్వే అనుసంధానత పెంపు కోసం నూత న ప్రాజెక్టులకు అనుమతులు ఇ వ్వాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు (Regional Ring Railw ay) ప్రాజెక్టును ప్రతిపాదించామని, ఇం దుకు రైల్వే బోర్డు ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.8 వే ల కోట్ల విలువైన ఈ రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్ట్కు త్వరగా అనుమతు లు ఇవ్వాలని కోరారు. రీజినల్ రిం గ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతా ల మధ్య అనుసంధానత పెరగడం తో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గు తుందని కేంద్ర మంత్రికి వివ రించా రు. రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టుతో గ్రామీణ పేదరికం తగ్గడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అ వకాశా లు మెరుగవుతాయని చెప్పారు.
హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బంద రు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫుడ్ ప్రాసె సింగ్ ఉత్పత్తుల ఎగుమతులు, ప లు దిగుమతులకు ఈ మార్గం దో హదపడుతుందని వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆపరేష న్స్ను మరింత సమర్థంగా నిర్వ హించేందుకు కాజీపేట రైల్వే డివిజ న్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు భ ద్రత, వేగవంతమైన సేవలు అందిం చేందుకు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
తెలంగాణలో వివిధ ప్రాంతాల అను సంధానత, పారిశ్రామిక, వ్యవసా యక ఎగుమతులు, దిగుమతుల కోసం వెనుకబడిన ప్రాంతాల అభి వృద్ధికి నూతన రైలు మార్గాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను అందించారు. ఇందులో భాగంగా వికారాబాద్ – కృష్ణా (122 కిలోమీ టర్ల అంచనా వ్యయం రూ.2,677 కోట్లు), కల్వకుర్తి – మాచర్ల (100 కిలోమీటర్ల అంచనా వ్యయం రూ. 2 వేల కోట్లు), డోర్నకల్ – గద్వాల (296 కిలోమీటర్ల అంచనా వ్యయం రూ.6,512 కోట్లు), డోర్నకల్ – మి ర్యాలగూడ (97 కిలోమీటర్ల అం చనా వ్యయం 2,184 కోట్లు) మా ర్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్య యంతో మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
కేంద్ర మంత్రితో జరిగిన సమావేశం లో ఎంపీలు పోరిక బలరాం నాయ క్, సురేశ్ కుమార్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు ర ఘువీర్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి లు ఉన్నారు.