CM Revanth : ప్రజా దీవెన హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం పరిపాలనా సౌలభ్యం, రెండు రాష్ట్రాల్లో సం స్థలకు ఒకే పేరు కార ణంగా ఎదు రవుతున్న గందర గోళానికి తెర దించాలన్న ఉద్దేశంతో శ్రీ పొట్టి శ్రీరా ములు తెలుగు విశ్వవి ద్యాలయా నికి సురవరం ప్రతాప రెడ్డి పేరును పెడుతున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రే వంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగా ణ ఏర్పడిన తర్వాత గత పదేళ్లుగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయా లు, విధివిధానాలు పరిశీలించిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయ పేరు మార్పును ప్రతిపాదించామని చెప్పారు.శ్రీ పొట్టి శ్రీరాములు తెలు గు విశ్వ విద్యాలయానికి శ్రీ సురవ రం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యా లయంగా మార్పు చేస్తూ ప్రవేశపెట్టి న బిల్లుపై శానససభలో ముఖ్య మంత్రి స్పందించారు. పొట్టి శ్రీరా ములు స్వాతంత్య్రోద్యమంలో మ హాత్మ గాంధీ గారి స్ఫూర్తితో పోరా టాలు చేసి ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాల ద్వారానే మద్రాసు రా ష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభ జన జరిగిందని గుర్తుచేశారు. పొట్టి శ్రీరా ములు పట్ల ప్రభుత్వానికి అ పారమైన గౌరవం, విశ్వాసం ఉంద ని స్పష్టం చేశారు. వారి దేశభక్తి, ప్రాణ త్యాగం మరువలేనిదని అ న్నారు. “తెలంగాణ ఏర్పాటుకు కృ షి చేసిన ప్రముఖులను మనం స్మరించుకుంటున్నాం, వారి పేర్లను మన విద్యా సంస్థలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు పెట్టుకుంటున్నాం.
ఈ విషయంలో కొందరు అపోహ లు సృష్టించే ప్రయత్నాలు చేయ డం మంచిది కాదు.రాష్ట్ర విభజన తర్వాత ఆయా భౌగోళిక ప్రాంతా ల్లో ఉన్న యూనివర్సిటీలు ఆయా రాష్ట్రాల పరిధిలోకి వెళ్లగా, ఆ ప్రక్రియలో భాగంగా యూనివర్సి టీలకు కొత్త పేర్లు పెట్టుకోవడం జరిగిం ది. ఉమ్మ డి రాష్ట్రంలో ఎన్టీఆర్ యూనివర్సి టీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ఉండగా, తెలంగాణ ఏర్పడిన త ర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ పేరు కొన సాగిస్తున్నారు. తెలంగాణలో దాని కి శ్రీ కాళోజీ నారాయణ రావు హెల్త్ యూని వర్సిటీగా నామకరణం చేసుకు న్నాం. ఇలా మార్చడం వల్ల ఎన్టీ ఆర్ని అగౌరవపరిచినట్టు కాదని, రెండు రాష్ట్రాల్లో ఒకే పేరు తో యూనివర్సిటీలను కొనసాగిస్తే పరిపాలనలో గందరగోళం ఏర్పడు తుంది. ఈ నేపథ్యంలో హెల్త్ యూనివర్సిటీ పేరును కాళోజీ నారాయణరావు పేరును పెట్టుకున్నాం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవి ద్యాలయానికి ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యా లయంగా నామకరణం చేసుకు న్నాం. ఆంధ్ర ప్రదేశ్లో కొనసాగుతు న్న వ్యవ సాయ వర్సిటీ రంగా పేరు తో కొనసాగుతోంది. రాష్ట్ర విభ జన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశే ఖర రెడ్డిపేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీ ఆంధ్రప్ర దేశ్లో యధాతథంగా కొనసాగు తుండ గా, తెలంగాణలో హార్టికల్చర్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివ ర్సిటీ కొనసాగుతుండగా తెలం గాణలో వెటర్నరీ యూని వర్సిటీకి స్వర్గీయ పీవీ నరసిం హారావు పేరును పెట్టుకున్నాం. ఈ కోవలోనే రాష్ట్ర విభజన తర్వాత తెలుగు విశ్వ విద్యాలయం ఆంధ్రప్రదేశ్లో శ్రీ పొ ట్టి శ్రీరాములు పేరుతో కొనసాగు తుండగా, తెలంగాణలో సురవరం ప్రతాప రెడ్డి పేరును ప్రతిపాదిం చాం. ఈ మార్పు ఒక వ్యక్తి కోసమో, కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. మిగతా యూనివర్సిటీలకు పేర్లను ఎలా మార్చుకున్నామో అదే తరహాలో తెలుగు విశ్వవిద్యాలయానికీ మార్పు ప్రతిపాదన చేశాం. ఆరోజుల్లో తెలంగాణకు అసలు భాషనే లేదని అవహేళన చేసిన సందర్భంలో 354 మంది తెలంగా ణ కవుల సంచికగా గ్రంధా న్ని తీసుకొచ్చారు. గోల్కొండ పత్రిక ను ప్రారంభించి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని సురవరం ప్రతాప రెడ్డి ముందుండి నడిపించారు.
రాష్ట్ర విభజన తర్వా త ఏపీఎస్ ఆర్టీసీని టీజీ ఆర్టీసీగా, ఏపీఐఐసీని టీజీఐఐ సీగా, ఏపీ పీఎస్సీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చుకు న్నాం. తెలం గాణ ఏర్పడిన తర్వా త పరిపాలనలో భాగంగా తెలంగా ణకు ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఉద్దే శంతో యూనివర్సిటీల పేర్లకు మా ర్పులు చేశాం. ఈ నిర్ణయాల్లో ఎవ రినో కించ పరచాలన్న ఉద్దేశం కా దు. పరి పాలన పరంగా ఎదుర య్యే ఇబ్బం దులను తొలగించా లని, రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసు కుంది. పొట్టి శ్రీరాములు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ రోశయ్యxపట్ల, ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఇటీవల చర్లపల్లి రైల్వే స్టేషన్ను ఒక హబ్గా తీర్చిదిద్దు కున్న నేపథ్యంలో ఆ స్టేషన్కు పొట్టి శ్రీరాములు పేరును పెట్టి ఆ ప్రము ఖుడి త్యాగాలను స్మరించుకుం దాం. ఈ విషయంలో రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహి స్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసు కోవాలని విజ్ఞప్తి. అలా గే, ప్రముఖ నాయకులు రోశయ్య హైదరాబాద్ లో నివాసమున్న ఇంటికి సమీపం లోని బల్కంపేటలో ఉన్న ప్రకృతి చికి త్సాలయానికి రోశయ్య పేరు ను పెట్టాలని ప్రతిపాదిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సుదీర్ఘ అను భవజ్ఞులు, ముఖ్యమంత్రిగా గవర్న ర్గా ఎన లేని సేవలు అం దించిన రోశయ్య పేరును పెట్టడం సమం జసం. రోశయ్య జయంతి, వర్ధంతి కార్య క్ర మాలను అధికారి కంగా చేస్తున్న నేపథ్యంలో ఆ చికి త్సాలయంలో రోశయ్య విగ్రహం ఏర్పా టు చేస్తాం. తద్వారా వారి సేవలను ఎల్లప్పుడూ స్మరించుకో వచ్చు. ఈ రెండు చర్యల ద్వారా ఆర్యవైశ్యుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానాన్ని నిరూపించుకుందమని ముఖ్యమం త్రి చెప్పారు.