CM Revanth Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో చేపట్టే వివిధ రకాల నిర్మాణాలు, ఇ తర సదుపాయాల కల్పనకు సం బంధించిన పౌరసేవలు, అనుమ తుల ప్రక్రియ సరళంగా, సులభత రంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించి సమగ్ర అధ్యయనం తో సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆ దేశించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో పౌర సే వలు, అనుమతుల మంజూరు వంటి అం శాలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రా ష్ట్ర సచివాలయంలో ముఖ్యమం త్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు.
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని జీ హెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధి లో ని కోర్ అర్బన్ రీజియన్లో వివిధ రకాల నిర్మాణాలకు ప్రజలు పలు విభాగాలకు దరఖాస్తులు చేసుకొని ఆయా కార్యాలయాల చుట్టూ తిర గాల్సిన అవసరం లేకుండా ఒకే ప్లా ట్ఫామ్పై దరఖాస్తు చేసుకుని సిం గిల్ విండోలో అనుమతి లభించేలా వ్యవస్థ ఉండాలని ఆదేశించారు.
ఇందుకు రెవెన్యూ, పురపాలక, జ ల వనరులు, నీటి సరఫరా, ము రుగు నీటి పారుదల, పోలీసు, అ గ్నిమాపక, విద్యుత్ తదితర విభా గాలు సంయుక్తంగా పని చేయాల ని ముఖ్యమంత్రి సూచించారు. ఆ యా శాఖలు వసూలు చేసే బిల్లు లు సైతం ఒకేసారి, ఒకే విండో ద్వా రా చెల్లించే విధానానికి రూపకల్పన జరగాలన్నారు.
వినియోగదారులు చెల్లించే మొత్తా న్ని ఆయా విభాగాల ఖాతాల్లో జ మయ్యే విధానాన్ని రూపొందించా లన్నారు. ఈ క్రమంలో ఆస్తులు, వ నరుల గుర్తింపునకు లైడార్ సర్వే చేయాలని, మరింత సులభతర వి ధానాల అధ్యయనానికి నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచిం చారు. అనుమతుల ప్రక్రియలో అ నవసరమైన జాప్యం జరగరాదని, ఏ కారణం లేకుండా అనుమతు ల ను నిరాకరించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఏదైనా కారణం చే త అనుమతులకు ఆలస్యమైతే వి వరాలను దరఖాస్తుదారుడి తెలి యజేసి వాటి పరిష్కారానికి మా ర్గాలను కూడా అధికారులే సూచిం చాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ముఖ్య మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల ఉన్నతాధికా రులు పాల్గొన్నారు.