CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవ కాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకు న్నామని, రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గ డిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేర లేదని, అందుకే పదేళ్ల ఆధిపత్యా న్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరిం చిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చే ప్రయత్నం మొదలు పెట్టామని, మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్య స్తమైందని వ్యవస్థలన్నీ నిర్వీర్యమ య్యాయని ఆందోళన వ్యక్తం చేశా రు. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్య త మాపై ఉందని, ఇది నల్లేరుపై న డక కాదని మాకు తెలుసనని, అ యినా ప్రజల ఆకాంక్షలనే ప్రజా ప్ర భుత్వ ఎజెండాగా తెలంగాణ పున ర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తూ ముo దుకు కదిలామని గుర్తు చేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సంద ర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం యావత్తు ఆయన మా టల్లోనే…నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. విద్యార్థు లు-యువకులు, ఉద్యోగులు -మ హిళలు, మేధావులు, కవులు-కళా కారులు, సకలజనులు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చు కున్న రోజు.ఇది మనందరం గర్విం చదగిన రోజు. ఈ సందర్భంగా నా లుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
ఈ రోజు రాష్ట్ర ప్రజల కలను నిజం చేసిన సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ అమర వీరులకు ఘన నివాళులు అర్పిస్తు న్నా. కట్టుబానిసత్వాన్ని, వెట్టిచాకి రీని తెలంగాణ సమాజం సహించ దు. అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్ర జల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళుతున్నాం. గత పదే ళ్లలో నిర్వీర్యమైన వ్యవస్థలను ఒ క్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం. నిర్ల క్ష్యానికి గురైన యూనివర్శిటీలకు వీసీలను నియమించాం.
తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు ని ర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్య వసాయ కమిషన్ ఏర్పాటు చేసుకు న్నాం. సమాచార కమిషనర్లను, లో కాయుక్త, HRC సభ్యులను నియ మించుకుని, వ్యవస్థలు స్వతంత్రం గా పనిచేసేలా చర్యలు తీసుకు న్నాం. తెలంగాణ సమాజానికి పు నాది మహిళలే. అందుకే కోటి మం ది ఆడబిడ్డలను కోటీశ్వరులను చే యాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాల సీని ఆవిష్కరించుకున్నాం. మహిళ లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిది ద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ. 21వేల కోట్లు సున్నా వడ్డీ రుణాల ను పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించే పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాం.
దేశంలో అదానీ, అంబానీలతో పో టీ పడేలామహిళా స్వయం సహా యక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. పె ట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వ హణ, యూనిఫాంల కుట్టుపనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్స హిస్తున్నాం. తాము తయారు చేసి న ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్ లో మహి ళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏ ర్పాటు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మ హిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులుగా మార్చే కా ర్యక్రమాలను చేపట్టాం. మహిళా సంఘాల ద్వారా 600 బస్సలు కొ నుగోలు చేయించి, ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ఆలోచన చేశాం. ఇప్పటికే 150 బస్సులను వారికి అందజేసి రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో మహిళ లను భాగస్వాములను చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిర మ్మ ఇండ్లు అందిస్తున్నాం.
రాష్ట్రంలో స్వయం సహాయక సం ఘాల మహిళా సభ్యులకు క్యూ ఆ ర్ కోడ్ తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం. వా రికి ప్రతీ సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాల ను ఆ కార్డులో పొందుపరుస్తాం. రా ష్ట్రంలో మహిళలు మహాలక్ష్మిలా మారి సగర్వంగా నిలబడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రానికి రైతే వెన్నెముక. అందుకే రైతు సం క్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం ఎనిమిది నెలల్లో 25 లక్షల, 35వేల,964 మంది రైతు లకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసి అన్నదాతల రుణం తీర్చుకు న్నాం. రూ.15,333 కోట్లతో రైతుల కు 24గంటల ఉచిత విద్యుత్ అం దిస్తున్నాం. రైతు భరోసా పథకం కిం ద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12వేలకు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథ కంతో భూమి లేని వ్యవసాయ కూ లీల కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు అందిస్తున్నాం.
వరి ధాన్యానికి మద్ధతు ధరతో పా టు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తు న్నాం. దీనివల్ల రైతులకు అద నపు ఆదాయం లభించడమే కా కుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. దీంతో 275 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశం లోనే నెంబర్ వన్ గా నిలిచింది. పె రిగిన ధాన్యం ఉత్పత్తికి తగినట్టు గా రాష్ట్రవ్యాప్తంగా 8వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే శాం. రైతులు పండించిన ప్రతీ గిం జను ప్రభుత్వం కొనుగోలు చేసి రై తులు దళారుల బారిన పడకుండా చూస్తున్నాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి -2 025 చట్టాన్ని తీసుకువచ్చాం. భూ హక్కుల రికార్డులు పక్కాగా నిర్వ హించి, భూ యజమానులకు భరో సా కల్పిస్త్నున్నాం. భూ సమస్యల కు శాశ్వత పరిష్కారం చూపుతు న్నాం. యువతే మన భవిష్యత్తు… అందుకే ప్రజా ప్రభుత్వం అధికా రం లోకి వచ్చిన16నెలల్లోనే 60వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించాం. డీఎస్సీ ప్రకటించి 10వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమిం చాం. అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో ప్రైవేట్ రంగంలో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిం చాం. వైద్యరంగంలో, పోలీస్, నీటి పారుదల, సింగరేణి కాలరీస్, ఇలా వివిధ రంగాలలో ఖాళీలను భర్తీ చే స్తూ నిరుద్యోగులకు భరోసా కల్పి స్తున్నాం.
సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం.వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాల్లో ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని మేం విశ్వసించాం. ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలల్లో విద్య ప్రమాణాలు పెంచేందుకు విద్యా కమిషన్ ను నియమించాం. మెరుగైన విద్య వ్యవస్థ ఏర్పాటుకు సమగ్ర విధా నాన్ని రూపొందించాలని కమిషన్ ను ఆదేశించాం. ప్రభుత్వ పాఠశా ల ల్లో కూడా ప్రీ స్కూల్ విధానం తీసు కువచ్చే ఆలోచన చేస్తున్నాం. ప్రభు త్వ గురుకులాలు, హాస్టల్స్ లో మె స్ చార్జీల సమస్యను పరిష్కరిం చాం. గతంలో ఎప్పుడూ లేని విధం గా డైట్ చార్జీలను 40శాతం, కాస్మో టిక్ చార్జీలను 200 శాతం పెంచాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యా ర్థులంతా ఒకే ప్రాంగణంలో చదువు కునేలా యంగ్ ఇండియా రెసిడెన్షి యల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. తొలి దశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టాం.
రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసు పత్రికి పూర్వ వైభవం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకోసం 30 ఎకరాల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవ నాలను నిర్మిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వ రకు ఉచిత వైద్యం అందిస్తున్నాం.
రిజర్వేషన్లు పెంచి బలహీన వర్గాల వారికి అండగా నిలవాలన్నదే ప్రజా ప్రభుత్వ విధానం. బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆద ర్శంగా నిలిపాం. శాస్త్రీయంగా కులగ ణన నిర్వహించింది. బీసీల లెక్క 50.36 శాతంగా తేల్చాం. దానికి అనుగుణంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే నిర్ణయం తీ సు కున్నాం. శాసనసభ,శాసన మండ లిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదిం చుకున్నాం. తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభుత్వం జనగణలోకులగ ణన చేపట్టేందుకు సిద్ధమైంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపకు లాలవర్గీకరణపై మా ప్రభుత్వం ఇ చ్చిన మాట నిలబెట్టుకుంది. ఎస్సీ ఉప కులాను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్దత కల్పించాం. ప్ర తీ సంవత్సరం ఫిబ్రవరి 4 ను తెలం గాణ సోషల్ జస్టిస్ డే గా జరపాల ని నిర్ణయించాం.
సంక్షేమ పథకాలను పటిష్టంగా అ మ lలు చేసి పేదలకు ప్రజా ప్రభు త్వం అండగా నిలుస్తోంది. ఇండ్లు లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి నిర్మా ణానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తున్నాం. రూ.22,5 00 కోట్లతో 4లక్షల 50వేల ఇంది రమ్మ ఇండ్లు నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. నిజమైన లబ్దిదారులను పారదర్శకంగా ఎం పిక చేస్తున్నాం. ఎంపిక చేసిన కొం తమందికి తొలి దశలో లక్ష రూపా యలు చెల్లించాం. మే 20 నాటికి 5,364 ఇందిరమ్మ లబ్దిదారులకు 53కోట్ల 64లక్షల రూపాయలు నేరు గా లబ్దిదారుల ఖాతాల్లో జమ చే సాం. పేదల ఆకలి తీర్చడమే కాదు, వారు ఆత్మగౌరవంతో జీవించేలా స న్న బియ్యం పథకాన్ని ప్రారంభిం చాం. సంక్షేమ పథకాల చరిత్రలో స న్న బియ్యం ఒక ట్రెండ్ సెట్టర్. తె లంగాణలో మూడు కోట్ల మంది స న్న బియ్యం పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. ఇది విప్లవాత్మక మార్పు. ఖమ్మం జిల్లా సారపాకలో స్వయంగా నేను సన్నబియ్యం లబ్ది దారుల ఇంట్లో భోజనం చేశాను. ఆ రోజు వారి కళ్లలో చూసిన ఆనందం నా గుండెల్లో ఎప్పటికీ నిలిపోతుం ది. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను తీర్చి దిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళు తోంది.దావోస్, సింగపూర్,జపాన్ లాంటి దేశాల్లో పర్యటించిఇప్పటి వరకు3లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్.సీ.ఎల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద పెద్ద కంపెనీ లు హైదరాబాద్ లో తమ సంస్థల ను విస్తరిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ లో ఇదొక తొలి మెట్టు.
ప్రపంచ దేశాల నగరాలకు ధీటుగా హైదరాబాద్ ను తీర్చదిద్దేందకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేం దుకు మూసీ పునరుజ్జీవనం ప్రా జెక్టును చేపడుతున్నాం. బాపూఘా ట్ ను అంతర్జాతీయ స్థాయిలో గాం ధీ సరోవర్ గా తీర్చిదిద్దాలని నిర్ణ యించాం. అంతర్జాతీయ ప్రమాణా లతో ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. ఏఐ సిటీ, స్పో ర్ట్స్ సిటీ, ఫార్మా సిటీలతో పాటు లై ఫ్ సైన్సెస్, హెల్త్ సిటీలను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో మౌలిక సదుపా యాలలో భాగంగా విమానాశ్రయా ల సంఖ్యను పెంచుకునేందుకు చ ర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మామునూరు విమానావ్రయం పు నరుద్ధరణకు అన్ని అనుమతులు సాధించాం. హైదరాబాద్ నగర అ భివృద్ధి లక్ష్యంగా దాదాపు 18వేల కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు నిర్మించబో తున్నాం. రీజనల్ రైల్ తో పాటు మె ట్రో రైల్ విస్తరణ చేపడుతున్నాం. భ విష్యత్ అవసరాలకు అనుగుణం గా రూ.24వేల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేప డుతున్నాం.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖను మరింత పటిష్టపరి చాం. డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపేం దుకు చర్యలు తీసుకున్నాం. ఇండి యా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబ ర్ వన్ గా నిలిచింది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ విభా గానికి దుబాయ్ లో అంతర్జాతీయ అవార్డు లభించింది. ఇది మనకు ఎంతో గర్వకారణం. దేశ రక్షణ, స మగ్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా మద్దతుగా నిలుస్తు న్నాం. పహల్గామ్ దాడుల ఘ టనలో మన సైన్యానికి, కేంద్ర ప్ర భుత్వానికి మద్దతు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘భా రత్ సమ్మిట్’ కార్యక్రమాన్ని ప్రతిష్టా త్మకంగా నిర్వహించాం. ఈ కార్య క్రమం ద్వారా హైదరాబాద్ ను అం తర్జాతీయ వేదికగా మార్చాం. ప్రపం చవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి దాదాపు 450 మంది ప్రతిని ధులు ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు.
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అందించిన అలీన విధాన స్ఫూర్తితో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక స మస్యలపై సమ్మిట్ లో చర్చించాం. భారత్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ ను ప్రపంచం దృష్టికి తీసుకె ళ్లాం.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టా త్మకంగా నిర్వహించే ప్రపంచ సుం దరి పోటీలకు ఆతిథ్యం కల్పించాం. తెలంగాణ జరూర్ ఆనా అంటూ వందకు పైగా దేశాల నుంచి 72వ మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందు కు హైదరాబాద్ వచ్చారు. వారంతా తెలంగాణ చారిత్రక కట్టడాలను, టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించి తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్ర పంచ నలుదిశలా చాటారు.
2047 నాటికి భారత దేశం వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమవు తుంది. దేశాన్ని 30 ట్రిలియన్ ఎకా నమీ తీర్చిదిద్దడంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అందుకే తెలంగాణ రై జింగ్-2047 భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం. వచ్చే పదే ళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎ కానమీగా తీర్చిద్దాలని నిర్ణయిం చాం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే ల క్ష్యంతో ముందుకు వెళుతున్నాం. తెలంగాణ రైజింగ్ మనల్ని నడిపిం చే మంత్రం. 2047నాటికి దేశంలో నే కాదు, ప్రపంచంలోనే తెలంగాణ ను నెంబర్ వన్ గా నిలిపే దిశగా ప్ర జా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పారదర్శక పరిపాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అభి వృద్ధి పథంలో నడిపించేందుకు ప్ర జా ప్రభుత్వానికి మీరంతా అండగా ఉంటారని ఆశిస్తున్నా.