Sustainable Urban Development : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, ప్రకృతి ని పరిరక్షిస్తూనే గొప్పనగరంగా తీ ర్చిదిద్దుతాం
Sustainable Urban Development :ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్ వారసత్వ సంపదను కాపా డుకుంటూ, ఇక్కడి ప్రకృతిని పరిర క్షిస్తూ దీన్ని ఒక గొప్ప నగరంగా తీ ర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చె ప్పారు. సహజ వనరులు, సంపద కాలగర్భంలో కలిసిపోతున్న తరు ణంలో ఈ నగరాన్ని పునరుద్ధరిం చాలన్న ఆలోచనతోనే హైడ్రాను ప్రా రంభించామని వివరించారు. ట్యాం క్బండ్ బుద్ధభవన్లో హైద రాబా ద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. హై డ్రాకు ప్రత్యేకంగా కేటాయించిన 12 2 వివిధ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. హైడ్రా కోసం ప్రత్యే కంగా రూపొందించిన వెబ్సైట్ను ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే …హైడ్రా ఆవ శ్యకతను వివరించారు. “హైడ్రా అంటే ఇదేదో కేవలం పేదల ఇండ్లు కూల్చడానికన్నట్టు కొందరు చిత్రీకరి స్తున్నారు. శాఖల మధ్య సమన్వ య లోపం వల్ల నగరంలో తలెత్తే సమస్యలు ఎవరు ప రిష్కరించాల న్న విషయంలో ఇబ్బందులు తలె త్తుతున్నాయని గమనించి నిపుణు లతో చర్చించి హైడ్రాను తెచ్చాం.
ఆక్రమణలను తొలగించడం, అక్ర మ నిర్మాణాలను తొలగించడం, క బ్జాలను అరికట్టడం, నాలాల పు నరుద్దరణ, నీటి కాలుష్యాలపై చ ర్యలు తీసుకోవడం, వర్షాలు, వరద ల వంటి విపత్తు సమయాల్లో సహా యక చర్యల్లో పాల్గొనడం, ప్రజా ఫి ర్యాదులను పరిశీలించి పరిష్కరిం చడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతుంది.
హైడ్రాపై అతిపెద్ద సామాజిక బాధ్య త పెట్టాం. ఇందులో పనిచేసే వారికి ఉద్యోగం కాదు. కాజ్యువల్ గా పని చేస్తే కుదరదు. హైడ్రా మానవీయ కోణంలో పనిచేయాలి. నిరుపేదల పట్ల ప్రేమతో, పెద్దొళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి. పేదవారిని ఆదు కోవడానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక లు తయారు చేయాలి. వారికి అవ సరమైన అన్ని వసతులు ప్రభు త్వం కల్పిస్తుంది.
ఇది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ…. దీన్ని పునరుద్దరించుకో వలసిన అవసరం ఉంది. బెంగుళూ రులో నీటి నిలువలను ఒడిసిపట్టు కునే పరిస్థితి లేక వలసపోయే దు స్థితి వచ్చింది. చిన్న వరదలు వచ్చి నా ముంబయ్, చెన్నై వరదల మ యమైపోయాయి. దేశ రాజధాని ఢి ల్లీ కాలుష్యం నియంత్రించని కార ణంగా పార్లమెంట్ నుంచి పాఠశా లల వరకు సెలవులు ప్రకటించుకో వలసిన పరిస్థితి వచ్చింది.
దేశంలోని మెట్రోపాలిటన్ సిటీలు నివసించడానికి యోగ్యం కాని నగ రాలుగా మారుతున్నాయి. అలాం టి ఉపద్రవాల నుంచి గుణపాఠం నే ర్చుకోకపోతే హైదరాబాద్ నగరం కూడా వాటి జాబితాలో చేరుతుం ది.
రాజధాని నగర అభివృద్ధిలో హైడ్రా భాగస్వామి అవుతుంది. అన్ని శా ఖల సమన్వయంతో హైడ్రా అనేక పనులు చేస్తుంది. వర్షాలొస్తే, వరద లొస్తే కాలనీలకు కాలనీలే నీళ్లల్లో మునిగిపోతున్నాయి. చిన్న గాలొ స్తే చెట్లు విరిగి పడుతున్నాయి. ఇ లాంటి పరిస్థితుల్లో నీళ్లను తొలగిం చడానికి, కరెంట్ పోతే పునరుద్దరిం చడానికి, వరదలు వస్తే చిక్కుకున్న వారిని రక్షించుకోవడానికి హైడ్రా పనిచేస్తుంది.
మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవ సరంపై ప్రజలే అప్రమత్తం కావాలి. చెరువులు, నాలాల్లో ప్రవహించా ల్సిన నీరు ఇళ్లల్లో పారుతుంటే వాటిని కాపాడుకోవలసిన అవస రం లేదా మూసీలో బతకాలని ఏ పేదవారైనా అనుకుంటారా. నగరం లో 421 చెరువులు, పెద్ద పెద్ద నా లాలు కబ్జాలకు గురయ్యాయి. ఎవ రైతే మూసీ ఆక్రమణలను ప్రోత్స హించారో, ఎవరైతే నాలాలను ఆక్ర మించారో వారే హైడ్రా అంటే భయ పడుతున్నారు.
తొందరలోనే మూసీ పరీవాహక ప్రాంత ప్రజల దగ్గరకు ప్రజా ప్రతిని ధులు, అధికారులను పంపించి వా రితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయిస్తా. వారి జీవితాలకు మంచి వెలుగు ఇవ్వాలని అనుకుంటు న్నా. కావాలంటే వారందరికీ మరో ప్రాంతంలో ఇళ్ల పట్టాలిస్తాం. మూసీ మురికికూపంలో ఎందుకు బతకా లి. ప్రభుత్వ భూములున్న చోట వా రికి అపార్ట్ మెంట్లు కట్టి ఇళ్లిస్తాం. ఆ కుటుంబాలు గౌరవంగా బతక డానికి ఏర్పాటు చేస్తామని ముఖ్య మంత్రి సమగ్రంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కు మార్ యాదవ్, నగర మేయర్ గ ద్వాల విజయలక్ష్మి, హోం శాఖ ము ఖ్య కార్యదర్శి రవి గుప్తా, హైడ్రా కమిషనర్ రంగనాధ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొ న్నారు.