–ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను మరింతగా విస్త రించాలని ముఖ్యమంత్రి ఎ. రేవం త్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కో రారు. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగళూ రు అనుకూలమైన ప్రాంతంగా ము ఖ్యమంత్రి వివరించారు. ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మ ర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉ న్నారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ, సీఈఓ డాక్టర్ జైతీర్థ్ ఆర్. జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్ , డీఆర్డీఎల్ జీఏ శ్రీనివాస మూర్తితో పాటు పలువురు ముఖ్య మంత్రి ని కలిశారు.
దేశంలో తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశమని ముఖ్య మంత్రి ఆ ప్రతినిధి బృందానికి వివ రిస్తూ, ఏరోస్పేస్ విస్తరణ కోసం తె లంగాణ, హైదరాబాద్ను ఎంచు కో వాలని కోరారు. అందుకు ప్రభు త్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామ ని చెప్పారు. ముఖ్యమంత్రి విజ్ఞ ప్తిపై బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందిం చింది.