సీఎం సమక్షంలో అరెకపూడి గాంధీ
–కాంగ్రెస్ లోకి శేరిలింగంపల్లి బీఆరె స్ ఎమ్మెల్యే
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో బిఆర్ఎస్ (brs) కు మరో బిగ్ షాక్ తగిలింది. హైదరాబాదులోని శేర్ లింగంపల్లి బిఆర్ఎస్ శా సనసభ్యుడు (mla) అరికపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా రు. శని వారంజూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో కండువా కప్పి పా ర్టీలోకి ఆహ్వా నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM revanth reddy).
ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్లు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో శేరిలింగంపల్లి కార్పొ రేటర్ (corpirator) నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
CM revanth reddy BRS