CM Revanth Reddy : ప్రజా దీవెన, జపాన్: జపాన్ పర్య టనలో భాగంగా ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలం గాణ రైజింగ్ ప్రతినిధి బృందం టో క్యో నగరంలో ప్రఖ్యాత మల్టీనేషన్ వ్యాపార దిగ్గజం సోనీ కార్పోరేషన్ సోనీ ప్రధాన కార్యాలయాన్ని సం దర్శించింది. ఈ సందర్భంగా సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అ నుబంధ సంస్థ క్రంచై రోల్ బృం దా న్ని కలిసింది.
సోనీ కార్పొరేషన్ తయారు చేస్తు న్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ప్రదర్శించిన కంపెనీ ప్రతినిధులు, ఆయా ఉత్ప త్తులతో పాటు వారి పని తీరును ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ ప్రతినిధులతో ముఖ్య మంత్రి బృందం వివరణాత్మక చ ర్చలు జరిపింది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ , గేమింగ్ రంగాలలో పెట్టుబడుల విస్తరణకు హైదరాబా ద్లో ఉన్న అవకాశాలు, అనుకూల తలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది.
ఎండ్-టు-ఎండ్ ప్రొడక్షన్ సామ ర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి తమ భవిష్యత్తు విజన్ను వారితో పం చుకున్నారు.