Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక ప్రకటన, మహి ళలను ‘కోటీ ‘శ్వరులను చేస్తాం

CM Revanth Reddy : ప్రజా దీవెన, నారాయణపేట: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమేతెలంగాణ‌ ప్ర‌భుత్వం ధ్యేయమని ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్ రెడ్డి పునరుద్ఘాటిం చారు. మ‌హిళ‌లను 600 బ‌స్సుల‌ కు ఓన‌ర్ల‌గా చేస్తామని ప్రకటించా రు. కోటి మంది మ‌హిళ‌లు మ‌హి ళా స‌మాఖ్య‌లో చేరాలని పిలుపు నిచ్చారు. కార్పొరేట్‌తో స‌మానంగా మ‌హిళా సంఘాల వ్యాపారం చే యాలని ఆకాంక్షించారు. నారాయ‌ ణ‌పేట జిల్లా గురుకుల హాస్టల్ ఆవ రణలో శుక్రవారం జరిగిన బహిరం గ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిం చారు.ఒక‌రోజు కోటి మంది మ‌హిళ‌ ల‌తో అవుట‌ర్ రింగ్‌ రోడ్డులో ప్ర‌ద‌ ర్శ‌న నిర్వ‌హించి తెలంగాణ మ‌హి ళ శ‌క్తి నిరూపిద్దామ‌న్నారు. ఆ రోజు ఎంపీ డీకే అరుణ స‌హ‌కారంతో ప్ర‌ ధాన మంత్రి నరేంద్ర రెడ్డి కూడా ఆహ్వానించుదామ‌ని పేర్కొన్నారు. మ‌హిళ సంఘాల ద్వారా ప‌లు వ్యాపారాలు చేస్తున్న మ‌హిళ‌లకు పెట్రోల్ బంకు కూడా మంజూరు చేశామ‌ని తెలిపారు. అలాగే ఆర్టీసీ కి బ‌స్సులు అద్దెకు ఇచ్చాలా మ‌హి ళ సంఘాల‌ను ప్రోత్స‌హించిన‌ట్లు చెప్పారు. ఆర్టీసీకి ఆరు వంద‌ల బ‌స్సుల‌ను మ‌హిళ సంఘాలు అద్దె ప్రాతిప‌దిక‌న ఇచ్చే విధంగా చ‌ర్య‌ లు తీసుకున్నామ‌న్నారు. అంటే ఆరు వంద‌ల బ‌స్సుల‌కు ఓన‌ర్ల‌గా మ‌హిళ‌లు అవుతున్నార‌న్నారు.

కార్పొరేట్ సంస్థ‌ల‌తో స‌మానంగా మ‌హిళ సంఘాలు వ్యాపారం చే య‌డానికి ప్ర‌భుత్వం స‌హ‌కారం అందిస్తోంద‌ని రేవంత్ రెడ్డి అన్నా రు. హైటెక్ సిటీ స‌మీపాన ఉన్న శిల్ప‌రామం ప‌క్క‌న మూడున్న‌ర ఎక‌రాల భూమిలో మ‌హిళ సం ఘాలు ఉత్ప‌త్తులు చేయ‌డానికి త‌గిన షాపింగ్ కాంప్లెక్స్ సిద్ధం చేస్తు న్నామ‌న్నారు. మీరు మరింత ఆర్థి కంగా అభివృద్ధి చెందాల‌ని ప్ర‌భు త్వ ద్యేయమ‌న్నారు. అందుక‌ను గుణంగా మ‌హిళ సంఘాలు నాణ్య‌ త‌తో కూడిన ఉత్ప‌త్తులు త‌యారు చేసి ఈ మార్కెట్‌కు ప్ర‌ముఖులు వ‌ చ్చేలా చేయాల‌న్నారు. పెద్ద‌పెద్ద కా ర్పొరేట్ సంస్థ‌ల యాజ‌మానులు నిర్వ‌హించే సోల‌ర్ విద్యుత్ ఉత్ప‌ త్తి చేసే వ్యాపారం ఆడ‌బిడ్డ‌ల‌కు అప్ప‌గిస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోల‌ర్ విద్యుత్ ఉత్ప‌త్తి చేసే అవ‌కాశం మీకే ఇస్తున్నాన‌ని చెప్పారు. కార్పొరేట్ సంస్థ‌ల‌కు దీటుగా మీరు వ్యాపారం చేయాల‌ని కోరారు. అంతకుముం దు ఆయన వికారాబాద్​, నారాయ ణపేట జిల్లాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్​ రెడ్డి, ఇలా పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రా రంభించారు. హైదరాబాద్​ నుంచి మధ్యాహ్నానికి హెలికాప్టర్​లో వికా రాబాద్​ జిల్లా దుద్యాల మండలం పోలెపల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఏటా ఘనంగా నిర్వహిస్తు న్న పోలెపల్లి ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు. పోలేపల్లి రేణుకా ఎల్లమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిం చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ము ఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి శ్రీకారం చు ట్టారు. మొదటి విడతలో మంజూ రైన 72,045 ఇళ్లకు నారాయణపే ట జిల్లా అప్పక్​పల్లిలో లాంఛనం గా శంకుస్థాపన చేశారు. జిల్లా మ హిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన పెట్రోల్​ బంకు, సమా ఖ్య భవనం, ఇందిరమ్మ గృహాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణపేట మెడికల్ కాలేజీలో అకడమిక్ బ్లాక్ తో పాటు, ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సీఎంతో పాటు మంత్రులు దామో దర రాజనరసింహ, పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు,సీతక్క, ఎంపి డి కె అరుణ, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో సహ పలువురు ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు ఈ పూజా కా ర్యక్రమాలలో పాల్గొన్నారు.