CM Revanth Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ఖ్యాతిని విశ్వమంతటా పరి చయం చేసేందుకు ఉపయోగపడే మిస్ వరల్డ్ 2025 వేడుకలను ప్రతి ష్ఠాత్మకంగా నిర్వహించాలని అ న్నారు. ప్రపంచ వ్యాప్తంగా 116 దే శాలకు చెందిన యువతులు ఈ పో టీల్లో పాల్గొంటున్నారని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా వారికి ఆతి థ్యమివ్వాలని అధికారులను ము ఖ్యమంత్రి ఆదేశించారు. మిస్ వర ల్డ్ 2025 పోటీలు విజయవంతం గా నిర్వహించేందుకు ఘనంగా ఏ ర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదే శించారు. మే 10వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు జరిగే ప్రపంచ స్థాయి పోటీల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీ సు అధికారులను అప్రమత్తం చేశా రు. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, డీజీపీ జితేందర్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ పోలీస్ కమిష నర్ జి.సుధీర్బాబు, ఏడీజీపీ స్టీఫెన్ రవీంద్రతో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావే శంలో పాల్గొన్నారు.
పోటీదారులతో పాటు దేశ విదేశాల నుంచి ఈవెంట్ కవరేజీకి దాదాపు మూడు వేల మంది మీడియా ప్రతి నిధులు హాజరవుతారని అన్నారు. వివిధ దేశాల నుంచి పోటీలకు వ చ్చే వారిని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలని, పోటీలు పూర్తయ్యేంత వరకు ఎక్క గా చిన్న పొరపాటు లేకుండా ఏ ర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను హెచ్చరించారు. ప ర్యాటక శాఖతో పాటు అన్ని విభా గాలు సమన్వయంతో పని చేయా లని, అధికారులందరూ సమర్థంగా తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు.
మే 10 నుంచి 31వ తేదీ వరకు వ రుసగా జరిగే కార్యక్రమాల షె డ్యూ లుకు అనుగుణంగా భద్రతా ఏర్పా ట్లు చేయాలని ముఖ్యమంత్రి అధి కారులను ఆదేశించారు. ప్రతి కార్య క్రమానికి ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని సూచించారు. మే 10వ తేదీన సాయంత్రం హైదరాబా ద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్డేడియం లో మిస్ వరల్డ్ ప్రారంభోత్సవం నుంచీ 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్య మంత్రి పిలుపునిచ్చారు.
హైదరాబాద్ లోని చార్మినార్, లాడ్ బజార్తో పాటు తెలంగాణ తల్లి, సెక్రెటేరియట్తో పాటు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించను న్న నేపథ్యంలో, అవసరమైన రవా ణా, వసతులు కల్పించాలన్నారు. అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉండే లా చూసుకోవాలన్నారు. అనుకోని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తి నా వాటిని అధిగమించే ప్రత్యా మ్నాయ ప్రణాళికలను అధికారు లు రూపొందించుకోవాలని ఆదే శించారు.
మహిళా సాధికారతను చాటిచె ప్పేలా రాష్ట్రంలో ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ సంద ర్శనతో పాటు, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీఫైనల్స్ తిలకించేందు కు అవసరమైన ఏర్పాట్లు చేయా లన్నారు.
హైదరాబాద్లో మిస్ వరల్డ్ కార్య క్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు అంతరా యం లేకుండా జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. వాతావరణ సూచనల కు అనుగుణంగా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఈదురు గాలులు, వర్షాలు వచ్చినా గ్రేటర్ సిటీ పరిధిలో ఇబ్బందులు తలెత్త కుండా జీహెచ్ఎంసీతో పాటు హై డ్రా విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మిస్ వరల్డ్ కు వచ్చే విదేశీ అతిథు లు బస చేసే హోటళ్లతో పాటు గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సెక్రెటేరియట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ రం గాల్లో ప్రముఖులను ప్రభుత్వం తర ఫున మిస్ వరల్డ్ 2025 ప్రారంభో త్సవానికి ఆహ్వానించాలని సూ చించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, బీసీ, ఎస్సీ ఎస్టీ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కస్తూరిబా పా ఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా ఒకరోజు మిస్ వరల్డ్ వేడుక లు చూపించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వేడుకలు జరిగే రో జుల్లో హైదరాబా ద్ అంతటా మిస్ వరల్డ్ సందడి కనిపించేలా తోరణా లు, లైటింగ్, హోర్డింగ్ లతో పాటు సిటీలోని ముఖ్యమైన జంక్షన్లు, చా రిత్రక ప్రదేశాలను అందంగా అలంక రించాలని అన్నారు.