పక్కన పెట్టడంలో మొహమాటం అవసరం లేదు
— నేతలు కలిసి పని చేయాలి
–మరోసారి అధికారంలోకి వచ్చేలా సమన్వయంతో పనిచేయాలి
–మంత్రి పదవుల కోసం కొందరు నేతలధర్నాలుపై ఆగ్రహం
–పీసీసీ రాజకీయ వ్యవహారాల క మిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
Chief Minister Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చేలా నేతలు అంద రూ సమన్వయంతో పని చేయాల ని, పార్టీ కమిటీలలో ఉన్న నా య కులు క్షేత్రస్థాయిలో పని చేయాల్సిం దేనని, పనిచేస్తేనే పదవులు వస్తా యి, పార్టీ కష్ట కాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. లక్ష్యాన్ని నిర్దేశిం చుకొని పార్టీ నాయకులు పని చే యాలని, మార్కెట్ కమిటీలు, టెం పుల్ కమిటీల వంటి నామినేట్ పో స్టులు భర్తీ చేసుకోవాలని, పార్టీ నా యకులు క్రమశిక్షణతో వ్యవహరిం చాలని సూచించారు. ప్రభుత్వo చా లా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అనేక సామాజిక అంశాల ను కూడా ప్రభుత్వం పరి ష్కరించిందని, రాబోయే రోజుల్లో చాలా సవాళ్లు ఎదుర్కొబోతున్నా మని, డీలిమి టేషన్, మహిళా రి జర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయన్నారు. నేను గ్రా మాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా నని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని సీఎం రేవం త్రెడ్డి తెలిపారు.మంత్రి పదవుల కోసం కొంతమంది కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని హెచ్చరించా రు. పదవులు వచ్చినవారు తెలం గాణ రాష్ట్రమంతా తిరగాలని ఆదే శించారు. పదవులు అడగటం త ప్పు లేదు కానీ నిరసన హుందాగా ఉండాలని సూచించారు. మంగళ వారం గాంధీభవన్లో జరిగిన పీ సీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవం త్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మా ట్లాడారు.
పీసీసీ కార్యవర్గంలో ఉన్న వారిని రెండుగా చేసి జాబితా సిద్ధం చేయా లని కోరారు. ముందు అందరికీ పని అప్పగించాలని ఆదేశించారు ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి.పని చేసిన వాళ్లది ఒక జాబితా, పనిచేయని వాళ్లది మరో జాబితా సిద్ధం చేయా లని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్దే శించారు. పని చేయకపోతే డిమో షన్, పని చేస్తే ప్రమోషన్ ఇస్తామని స్పష్టం చేశారు. పని చేయకపోతే పక్కన పెట్టడంలో మొహమాటం అ వసరం లేదని తేల్చిచెప్పారు. అలా గే ఇన్చార్జీ మంత్రుల పనితీరుపై రే వంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశా రు. జిల్లాలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే బాధ్యత ఇన్చార్జి మంత్రు లకు అప్పగించినా ఎందుకు చేయ డం లేదని ప్రశ్నిచారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో 99 శాతం గెలిచేలా ఇన్చార్జ్ మంత్రులే బాధ్యత తీసు కోవాలని ఆదేశించారు.
జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు నిధులు ఇచ్చామని, వాటిని సరిగ్గా ఎందు కు ఉపయోగించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
‘గతంలో నేను టీపీసీసీ చీఫ్ అ యిన తర్వాత ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకోమంటే కొందరు తీసుకోలేదు. మేము సీని యర్లం, ఆ చిన్న బాధ్యత తీసుకో మని అన్నారు. ఆ రోజు బాధ్యత తీసుకున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కార్పొరేషన్ పద వులు ఇచ్చామని, పార్టీ నిర్మాణం లో భాగస్వామ్యం అయితే పదవు లు వాటంతట అవే వస్తాయని ఇం కో నాలుగు సంవత్సరాలు మన ప్ర భుత్వం అధికారంలో ఉంటుంది. త్వరలోనే మహిళా రిజర్వేషన్ వ చ్చే అవకాశం ఉంది. 2029 ఎ న్నికలకు అందరూ సిద్ధంగా ఉం డాలి. పార్టీలో పనిచేయని వారిని పదవుల నుంచి తొలగించాలి. తె లంగాణలో కాంగ్రెస్ రెండోసారి అ ధికారంలోకి రావాలంటే పార్టీ నేతల పనితీరుపైనే ఆధారపడి ఉందన్నా రు. పదేళ్లు అధికారం మనదేనని, పార్టీ పదవిని చిన్న చూపు చూస్తే మీకే నష్టమని , పార్టీ, ప్రభుత్వం జో డేదుల్లాలా గా పనిచేయాలని చె ప్పారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. బూత్ స్థాయి లో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థ వంతంగా తీసుకెళ్లగలుగుతాం. పార్టీ నిర్మాణం పైన టీపీసీసీ దృష్టి సారించాలి. పా ర్టీ నాయకులంతా ఐక్యంగా పని చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూ చించారు.
తెలంగాణ ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లా డు తూ పార్టీ నిర్మాణం గురించి బూత్ స్థా యి నుంచి బలోపేతంపై చర్చిం చామని తెలి పారు. సీఎం రేవంత్ నాయకత్వంలో ఏడాదిన్నర కాలం గా నడుస్తున్న ప్రభుత్వాన్ని గోల్డెన్ పీరియడ్గా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమా న్ని గోల్డెన్ పీరియడ్గా జనంలోకి తీసుకెళ్లాలని పీఏసీలో నిర్ణయించా మని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం బోనస్ వంటి వాటిపై చర్చించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కింద ప్రతి నియో జకవర్గంలో 4500 ఇండ్లు ఇస్తున్నా మని అన్నారు. 93 లక్షల కుటుం బాలకు సన్నబియ్యం అందజేస్తు న్నామని వెల్లడించారు. ఏడాదిన్న రలో రూ.95,351 కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేశామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.