Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: తెలంగాణ.. ప్యూచర్​ స్టేట్​

–మన లక్ష్యం సూచించే ట్యాగ్​ లైన్​ ఖరారు చేసిన సీఎం రేవంత్​ రెడ్డి
–కాలిఫోర్నియాలో ఏఐ యూనికా ర్న్​ కంపెనీ ప్రముఖులతో సమావేశం

CM Revanth Reddy: ప్రజా దీవెన, కాలిఫోర్నియా: రాబో యే రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (Revanth Reddy)పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ (Artificial Intelligence Hub, Net Zero City) లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్ స్టేట్”కు పర్యాయపదంగా నిలుస్తుందని సీఎం ప్రకటించారు.

కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో టెక్ యునికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి ముఖ్య మంత్రి ఏ.రేవంత్ రెడ్డి Revanth Reddy)మాట్లాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. ‘మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం” అని పిలుపునిచ్చారు. ఇప్పటి వర కు మేము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్య టించాం. ఇప్పుడు కాలిఫోర్నియా లో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుటాఫ్ మెనీ వన్ అనేది న్యూ యార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా (Eureka for California) అనే నినాదం ఉంది. అయితే మన ఇం డియాలోని రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు.

ఇప్ప టినుంచి మన తెలంగాణ రాష్ట్రా నికి అటువంటి ఒక లక్ష్య నినాదా న్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందాం. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ (Telangana is a future state.)​.. అని పిలుద్దాం..’ అని సీఎం ప్రకటించారు. ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబు గారు అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యునికార్న్ కంపెనీల వ్యవస్థాప కులు స్వయంగా హైదరాబాద్‌ను సందర్శించాలని మంత్రి ఆహ్వానిం చారు. అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలను పరిశీలించాలని కోరారు.