Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, గొప్ప ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిది ద్దే వరకు విశ్రమించo

CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: సామా జిక న్యాయం, సమాన అవకాశా లతో తెలంగాణను ప్రపంచంలోనే ఒక గొప్ప ఆదర్శవంతమైన రాష్ట్రం గా తీర్చిదిద్దే వరకు విశ్రమించేది లే దని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను ఒ క అద్భుతమైన నగరంగా అభివృ ద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వర కు నిద్రపోనని, అందుకు అండగా నిలబడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ లో మంత్రులు దామోదర రాజన ర్సింహ, కొండా సురేఖ, స్థానిక ప్ర జాప్రతినిధులతో కలిసి ముఖ్య మంత్రి గారు పలు అభివృద్ధి కార్య క్రమాలను ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

జహీరాబాద్‌ నిమ్జ్ కోసం భూ సేక రణలో భాగంగా భూములు కోల్పో యిన 5,612 కుటుంబాలకు ఇంది రమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు అవసర మైన చర్యలు తీసుకోవాలని కలెక్ట ర్ కి ఆదేశాలిచ్చారు. గత పదేళ్ల కా లంలో జహీరాబాద్ నిమ్జ్ పూర్తిగా కుంటుపడిందని చెబుతూ, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్జ్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచి భూ సేకరణ ను వేగవంతం చేశామన్నారు. హ్యూందయ్ సంస్థ త్వరలోనే ఇక్కడ కార్యకలాపాలను ప్రారం భించనుందన్న శుభవార్తను ఈ సం దర్భంగా ముఖ్యమంత్రి తెలిపా రు.

రైతులంతా కలిసి సహకార వ్యవ స్థను ఏర్పాటు చేసుకుని నడిపిస్తా మంటే చెక్కర కర్మాగారం ఏర్పాటు కు నిమ్జ్‌లో వంద ఎకరాలు కేటా యించి అందుకు అవసరమైన ని ధులను మంజూరు చేస్తామన్నారు.
జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ ని యోజకవర్గాల అభివృద్ధికి అవసర మైన నిధులు మంజూరు చేస్తామ ని, ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలోనే రాజకీ యాలు,ఆ తర్వాత అభివృద్ధి విష యంలో అందరినీ కలుపుకుని పని చేస్తామని, అభివృద్ధి, రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలో ఎ న్నిసార్లయినా ప్రధానమంత్రి మోదీ గారిని కలుస్తానని పునరుద్ఘాటిo చారు. మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇంది రా గాంధీ మెదక్ లోక్‌సభ స్థా నం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ చే సిన అనేకానేక అభివృద్ధి కార్యక్ర మాలు, ఈ జిల్లాతో ఉన్న విడదీ యలేని అనుబంధాన్ని వివరించా రు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రభు త్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొన సాగిస్తోందని చెప్పారు. ప్రభు త్వం రైతు, మహిళా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, రుణవి ముక్తులను చేయడానికి రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సహాయం కింద రైతు భరోసాను 10 నుంచి 12 వేలకు పెంపు, మద్దతు ధరతో పాటు ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లింపు, భూమి లేని వ్యవసాయ నిరుపేదలకు 12 వేల చొప్పున సహాయం అందిస్తు న్న విషయాలను ముఖ్యమంత్రి వివరించారు.

మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 లకే వంట గ్యాస్ సిలిం డర్ అందించడంతో పాటు రాష్ట్రం లో కోటి మంది మహిళలను కోటీ శ్వరులను చేయాలన్న సంకల్పంతో ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరంగా తెలియజేశారు. వన్ ట్రి లియన్ డాలర్ ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిర్ధేశించుకున్న కా ర్యక్రమాలను విశదీకరించారు.
జహీరాబాద్ పస్తాపూర్‌లో ఏ ర్పా టు చేసిన సభలో పాల్గొనడానికి ముందు ముఖ్యమంత్రి స్వయం స హాయక సంఘాలకు కేటాయించిన పెట్రోల్ పంపును ప్రారంభించారు. అక్కడే మహిళా సంఘాలు ఏర్పా టు చేసిన స్టాళ్లను సందర్శించి వా రి ఉత్పత్తులను పరిశీలించారు.
సభా వేదికగా సంగారెడ్డి జిల్లా మ హిళా సమాఖ్యకు బ్యాంకు లింకేజీ కింద రూ. 126.54 కోట్లు, మెప్మా కింద 17.51 కోట్లకు సంబంధించి చెక్కును అందజేశారు. జిల్లాలో రూ. 494.67 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు లోక్‌సభ సభ్యులు సురేష్ షెట్కర్ గారు, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , మహమ్మద్ అలీ షబ్బీర్ , ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారు లు పాల్గొన్నారు.