CM Revanth Reddy : ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి: తెలంగాణ పేద ప్రజలు దేశపునర్ని ర్మాణంలో భాగస్వాములు అయ్యే లా నిలబెడతానని, జపాన్, సింగ పూర్ సరసన రాష్ట్రా న్ని నిలుపు తానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.ప్రజలు సహకరిస్తే తెలంగాణను10 ఏళ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ క లిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. శుక్రవారం ఆయన యా దాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ని యోజకవర్గం తిరుమలగిరి గ్రామం లో సుమారు 1051.45 కోట్ల రూ పాయల విలువ చేసే పలు అభివృ ద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ హిరంగ సభలో ముఖ్యమంత్రి మా ట్లాడారు.
దేశంలో వందేళ్లలో ఎవరు చేయని విధం గా మొదటి సారి కు లగణను చేపట్టి రాష్ట్రంలో56.36% బలహీన వర్గాలు ఉన్నారని లెక్కలు తీశామ న్నారు. విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నా మన్నారు. మహిళలను కోటీశ్వరు లుగా చేయడంలో భాగంగా ఉచిత బ స్సు సౌకర్యం కల్పించడమే కా కుండా, 600 బస్సులను స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇ చ్చి వారు వ్యాపార రంగంలో రా ణించే విధంగా చేశామని, ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బం కులు, అమ్మ ఆదర్శ పాఠశాల పను లను, పాఠశాల యూనిఫామ్ కుట్టే బాధ్య తలను మహిళలకు అప్పగిం చమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదల కు నా లుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, గ తం నుండి పేదోడు ఇందిరమ్మ ఇం డ్లలో నే ఉంటున్నాడని చెప్పారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్నిర కాలుగా అభివృద్ధి చేస్తామని, ఎట్టి పరిస్థితు లలో గంధమల్ల రిజర్వా యర్ ను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీ అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకు నే విధంగా 100 నియోజకవర్గా లలో 20వేల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తు న్నామని చెప్పారు. ప్రభుత్వం వ చ్చిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ప్రై వేట్ రంగంలో లక్ష ఉద్యోగాలు క ల్పించామన్నారు. ఆరు నూరైన మూసీ నదిని ప్రక్షాళన చేసి గోదావ రి నది జలాలతో మూసిని నింపు తామని తెలిపారు. గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టు లపై 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఎస్ ఎల్బీసీకి, డిండికి నిధులు ఎం దుకు ఇవ్వలేదని ఎందుకు పూర్తి చేయలే దని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ కు టిటిడి లాగే వైటిడి యాదగిరి గు ట్ట టెంపుల్ డెవలప్ మెంట్)బోర్డ్ ని ఏర్పాటు చేసుకోబోతున్నామని, తి రుపతిలో పద్మావతి మహిళ విశ్వవి ద్యాలయం మాదిరిగానే ఇక్కడ చే పట్టే ప్రభుత్వ వైద్య కళాశాలను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తా మని, అలాగే విద్యాసంస్థలను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లి దేశంలోనే గుర్తింపు ఉన్న యూనివ ర్సిటీగా తీర్చిదిద్దుతామని అన్నా రు. గత ప్రభుత్వం యాదగిరిగుట్ట మీద ఎవరు నిద్రించకూడదని నిషే ధం విధిస్తే తాము అధికారంలోకి వ చ్చిన తర్వాత ఆ నిషేధాన్ని తొల గించి గుట్టపైకి వెళ్లే విధంగా ఏర్పా టు చేశామని ముఖ్యమంత్రి తెలిపా రు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ సన్న బియ్యం ద్వా రా 80% ప్రజలకు కడుపు నిండా అన్నం పెడుతున్నామని, సన్న బి య్యం పై 11,000 కోట్లు ఖర్చు చే సి ప్రతి ఒక్కరికి ఆరు కేజీల బి య్యం ఇస్తున్నామని చెప్పారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న గం ధమల్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను 574 కోట్లతో చేపట్టి పూర్తి చేయ నున్నామని, రిజర్వాయర్లో ఎక్కువ గ్రామాలు ముంపునకు గురికాకుం డా రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 1.4 టీఎంసీలకు తగ్గించి 60 వేల ఎకరా లకు సాగునీరు ఇచ్చేలా రూపొం దించడం జరిగిందని తెలిపారు.
గత ప్రభుత్వం ఎస్ఎల్బిసి,డిండి ప్రాజెక్టుల తో పాటు, కృష్ణా నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రజక్టులను చేపట్ట లేదని చెప్పారు.తమ ప్రభుత్వ హ యాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల ను పూర్తి చేస్తామన్నారు .ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునియదిగానీబ కాలువ అన్నింటిని పూర్తి చేస్తా మని, అయితే లిఫ్ట్ ఇరిగేషన్ల కింద భూసేకరణను పూర్తి చేసే బాధ్యత ను సంబంధిత శాసనసభ్యులు తీ సుకోవాలన్నారు. గత ప్రభుత్వం డిండి కి ఎక్కడినుండి నీరు తీసుకో వాలో గుర్తించలేకపోయిందని, అ లాంటిది తాము 1800 కోట్ల రూపా యలతో ఎదుల రిజర్వా యర్ నుం డి డిండి ప్రాజెక్టును మొదలుపెట్ట బోతున్నమని, తమ ప్రభుత్వ హ యాంలోనే పూర్తి చేస్తామని తెలి పారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నా లజీని ఉపయోగించి ఎస్ఎల్ బి ని పూర్తి చేస్తా మని చెప్పారు.తుమ్మడి హట్టి ప్రాజెక్టుకు నీళ్లు తీసుకువచ్చిన విధం గానే గంధ మళ్లకు నీళ్లు తీ సుకువచ్చి సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభు త్వం పేద ప్రజలకు అండగా ఉం టుందని, సన్న బియ్యంతో పేదవా డికి రెండు పూటలా అన్నం పెడు తున్నామని, ఇచ్చిన వాగ్దానాలే కా కుండా, ఇవ్వని వాటిని కూడా నెర వేరుస్తున్నామని, ఆలేరు నియోజక వర్గంలో మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వనున్నమని, యా దగి రిగుట్ట మున్సిపాలిటీలో తాగునీటితో పాటు, ఇండ్లు , డ్రైనే జిలు అన్ని కట్టిస్తామని తెలిపారు.
భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లా డుతూ తమ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి చేస్తున్న పథకాలను వివరించారు.సమావేశానికి అధ్యక్షత వహించిన ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ నియో జక వర్గంలో ఏ ఎం ఆర్ పి కింద మిగిలిపోయిన 10 కిలోమీ టర్ల ఉప కాలువ పనులకు నిధు లు ఇచ్చి పూర్తి చేయాలని, తుర్క పల్లి మండలానికి ఇండస్ట్రియల్ పార్కు మంజూరు చేయాలని, గుం డాల కాల్వపనులకు నిధులు మం జూరు చేయాలని, బొమ్మల రామా రంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తీర్చాలని, కష్టాల్లో ఉన్న మదర్ డైరీ ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశా రు.
అంతకుముందు ముఖ్యమంత్రి574.56 కోట్ల రూపాయల వ్య యంతో నిర్మించనున్న గంధమల్ల రిజర్వాయర్ పనులకు శంకు స్థాపన చేశారు.200 కోట్ల రూపాయలతో నిర్మించే యంగ్ ఇండియా రెసిడెన్షి యల్ పాఠశాల నిర్మాణానికి , యా దాద్రి భువనగిరి జిల్లా లో 183 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించను న్న నూతన ప్రభుత్వ వైద్య కళాశా ల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు.యాదగిరిగుట్ట మున్సిపా లిటీలో ఒకటో వార్డు నుండి 12వ వార్డు లలో 25.5 50 కోట్ల రూపా యల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, బిటి రోడ్లు ,స్ట్రాం వాటర్ డ్రై నేజీ పనులకు పనులకు , 7.50 కోట్ల రూపాయల వ్యయంతో కొల నుపాక లో చేపట్టనున్న హెచ్ ఎల్ బి నిర్మాణ పనులకు, 6 కోట్ల రూపా యల వ్యయంతో కల్వలలో చేపట్టే హెచ్ ఎల్ బి నిర్మాణ పనులకు , మోట కొండూరు మండల కేంద్రంలో 8.25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ నున్న తహసిల్దార్, ఎంపీ డీవో, పోలీస్స్టేషన్ భవనాల నిర్మా ణానికి శంకుస్థాపన చేశారు.
యాదగిరి గుట్ట మండలం దాతర్ పల్లి గ్రామంలో 22.75 కోట్ల రూ పాయల వ్యయంతో నిర్మించ నున్న 20 వేల మెట్రిక్ టన్నుల సా మర్థ్యం కలిగిన గోదాం పనులకు , 21.14కోట్ల రూపాయల వ్య యంతో ఆలేరు నియోజక వర్గంలో సి ఆర్ ఆర్, ఎం ఆర్ ఆర్ ప నులతో చేపట్టే బిటి రోడ్ల పనులకు , ఆలేరు మార్కె ట్ యార్డులో 2.75 కోట్లు రూపాయ ల వ్యయంతో చేపట్టనున్న 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం పనులకు శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ముగ్గురు ఇందిర మ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టా లను పంపిణీ చేశారు .అంతేకాక స్వయం సహాయక మహిళా సం ఘాలకు 54 కోట్ల 70 లక్షల రూపాయల బ్యాంక్ లింకేజీ చెక్కు ల ను పంపిణీ చేశారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు, వైద్యశాఖ మంత్రి దామోదర రా జనర్సింహ, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ ,సమా చార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచా యతీ రాజ్ శాఖ మంత్రి దనసరి సీ తక్క, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి ,కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం ,మందుల సా మెల్,ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, తీన్మార్ మల్లన్న, శ్రీపాల్ రెడ్డి, ప్రభు త్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా ఆమి థ్ రెడ్డి, పర్యటక్ శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమం తరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డిసిపి ఆకా న్స్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.