Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Unorganised Workers’ Welfare : సీఎం రేవంత్ కీలక ప్రకటన, అసం ఘటిత కార్మికుల కోసం రోల్ మో డల్‌ విధానం

Unorganised Workers’ Welfare :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలోని అసంఘటిత కార్మికుల కోసం దేశానికి రోల్ మాడల్‌గా ఉం డే ఒక మంచి విధానం తీసుకొ స్తా మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర కటించారు. ప్రభుత్వం ఇప్పుడి ప్పు డే పట్టాలెక్కుతున్న తరుణంలో ఆ ర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం (May Day) సందర్భంగా తెలంగా ణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో రవీం ద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా కార్మిక సోదరు లందరికీ ముఖ్యమంత్రి మేడే శుభా కాంక్షలు తెలియజేశారు. ఈ సంద ర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. సీఎం ప్రసంగం యావత్తు ఆయన మాటల్లోనే…

మే డే రోజున కార్మిక సోదరులకు మాటిస్తున్నా. ఏ వెసులుబాటు ఉన్నా ప్రతి రూపాయి కార్మికుల సంక్షేమం, అభివృద్ధి, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే బా ధ్యత తీసుకుంటా. ఒకనాడు న ష్టాల ఊబిలో కూరుకుపోయి ఆత్మ హత్యలు జరుగుతున్న ఆర్టీసీలో ఈరోజు లాభాల బాటలో నడిచి జీ తాలు చెల్లించుకునే స్థాయికి చేరు కోవడంలో కార్మికుల కృషి ఎంతో ఉంది. ఆర్టీసీని గాడిలో పెట్టి లాభా ల వైపు నడిపించే ప్రయత్నం చేస్తు న్నాం.

సమ్మెకు వెళ్లాలని చర్చలు చేస్తు న్నారు. ఈ సంస్థ మీదే. ఏమాత్రం పట్టింపులకు వెళ్లొద్దు. రాజకీయం గా ఎవరైనా ప్రోత్సహిస్తే, ఏదైనా త ప్పుగా నిర్ణయం తీసుకుంటే మొ త్తం వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి ఉం దన్న విషయాన్ని ఆలోచన చేయం డి. మంత్రితో చర్చించండి. చేయగ లిగిందేమున్నా చేస్తాం. ఇప్పుడిప్పు డే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరుతో ఏదైనా పొర పాటు జరిగితే, మళ్లీ పునరుద్ధరిం చడానికి అవకాశం కూడా లేని పరి స్థితులు తలెత్తుతాయి.

మీ అందరి సహకారంతో అన్నిం టా తెలంగాణ నంబర్ వన్‌గా ఉం ది. కార్మిక చట్టాలను సవరించి కా ర్మికులను ఆదుకునే విధానాన్ని తెచ్చి దేశానికి మార్గదర్శిగా తె లం గాణ నిలబెడుతాం. తెలంగాణ సా ధనలో సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ శాఖ కార్మికు లు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిది. వారిని ఆదుకోవాల నే ఆలోచనతో సవరించుకుంటూ, సరిచేసుకుంటూ పాలన పరమైన ఎన్నో నిర్ణయాలు తీసుకుంటు న్నాం.

సింగరేణి సంస్థ లాభాల బాటలో నడవడమే కాకుండా గతంలో ఎ ప్పుడూ లేని స్థాయిలో కార్మికుల కు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు బోనస్ చెల్లించాం. బీమా సౌకర్యం అమలు చేస్తున్నాం. సింగరేణి సం స్థలను లాభాల బాటలో నడిపించ డమే కాకుండా బొగ్గు ఉత్పత్తి పెం చి, కొత్త గనులను కేటాయించి నూ తనంగా ఉద్యోగ, ఉపాధి అవకాశా లు కల్పించాలని ప్రయత్నిస్తున్నాం. సింగరేణిలో దాదాపు 400 పైచిలు కు కారుణ్య నియామకాలు చేప ట్టాం. ఆర్టీసీలోనూ కారుణ్య నియా మకాలు చేపట్టాం.

రైతు భరోసా, రైతు రుణమాఫీ, షా దీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఆడ బిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం, నిరుపేదలకు సన్నబి య్యం ఇలా రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం ఆగలేదు. అధికారంలోకి వ చ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ప్ర భుత్వ ఉద్యోగాలిచ్చాం. ఇన్ని చేసి నా సరిపోతాయని భావించడం లే దు. ఇంకా సమస్యలున్నాయి. కా ర్మికులకు కష్టాలున్నాయి. వాటన్నిం టినీ పరిష్కరించాలంటే కొంత సమ యం కావాలి.

తెలంగాణలో పూర్తి చేసిన కులగణ న ఈరోజు దేశానికి ఆదర్శవంతం గా నిలబడింది. తెలంగాణ మాడలే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవ లసి వచ్చింది. కులగణన చేస్తామ న్నాం. చేశాం. ఎస్సీ వర్గీకరణ చేస్తా మన్నాం. చేశాం. ఉద్యోగాలు ఇస్తా మన్నాం. ఇచ్చాం. సన్న బియ్యం ఇచ్చాం. ఆడబిడ్డలకు ఉచిత బ స్సు సౌకర్యం, ఇలా చేయగలిగింది ప్రతిదీ చేస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే మీకే చెప్పుకుంటాం. సహక రించండని ముఖ్యమంత్రి వివరిం చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొ న్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సలహాదారు హర్కర వేణు గోపాల్ రావు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారు లు పాల్గొన్నారు.