Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, రా బోయే పదేళ్లలో హైదరాబాద్‌ను అ ద్బుతమైన నగరoగా తీర్చిదిద్దు తాం 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాబో యే పదేళ్లలో హైదరాబాద్‌ను అ ద్బుతమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రక టించారు. ఈ మహానగరాన్ని అభి వృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ అం డగా నిలబడాలని పిలుపునిచ్చా రు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్వాసితులు అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

గోదావరి తాగునీటి సరఫరా పథకం (ఫేజ్ II & III), ఉస్మాన్ సాగర్, హి మాయత్ సాగర్ జలాశయాలను నింపడం ద్వారా మూసీ నది పున రుజ్జీవం పథకానికి గండిపేట వద్ద ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

దాదాపు 7,360 కోట్ల వ్యయంతో రెండేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యం తో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం గోదా వరి నది నుంచి 20 టీఎంసీ నీటిని తరలించడం ప్రధానం కాగా, అందు లో జంట నగరాల తాగునీటి అవస రాల కోసం 17.50 టీఎంసీల నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువులను నింపడం, మరో 2.50 టీఎంసీల జలాలను మూసీ నది పు నరుజ్జీవనానికి కేటాయించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఫోటో ఎగ్జిబిష న్‌ను తిలకించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స భలో ముఖ్యమంత్రి ప్రసంగం యావ త్తు ఆయన మాటల్లోనే…“గోదా వ రి జలాలను తరలించే ఈ గొప్ప కా ర్యక్రమం ద్వారా జంట నగరాల తా గునీటి సమస్యను పరిష్కరించ డ మే కాకుండా మూసీ కాలుష్యాన్ని నివారించి నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తాం.నగరానికి ప్రతి ఏ టా 3 శాతం ప్రజలు వలసలు పెరు గుతున్నాయి. నగరం కోటిన్నర జ నాభాకు పెరుగుతున్న తరుణంలో అందుకు తగ్గట్టుగా భవిష్యత్తు ప్ర ణాళికలు అవసరం. పెరుగుతున్న నగర అవసరాల మేరకు కృష్ణా జ లాలు కూడా సరిపోవని అనుకున్న ప్పుడు గోదావరి జలాలను తరలిం చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వా త పదేళ్లలో కృష్ణా, గోదావరి నదుల నుంచి చుక్క నీరు కూడా హైదరా బాద్ నగరానికి తరలించలేదు. త మ ప్రభుత్వం అధికారంలోకి రాగా నే మళ్లీ గోదావరి నీటిని తరలించి కేవలం హైదరాబాద్ ప్రజలకు తా గునీరే కాకుండా కాలుష్యం నుంచి మూసీ నదిని ప్రక్షాళన చేసే కార్యక్ర మం చేపట్టాం.

మురికికూపంగా మారి విషం చి మ్ముతున్న మూసీ జలాల వల్ల ఎ ల్బీనగర్, ఇబ్రహీంపట్నం, భువన గిరి, ఆలేరు ప్రాంతాల్లో నీరు తాగితే పశువులే కాదు, మనుషులు ప్రాణా లు పోతున్నాయి. పుట్టబోయే బిడ్డ లు సైతం అంగవైకల్యంతో పుడు తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో స బర్మతీ, ఉత్తర ప్రదేశ్‌లో గంగా, ఢిల్లీ లో యమునా నదుల ప్రక్షాళన చే సుకున్నప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగొద్దు.ఆ జిల్లా ప్రజలతో కలిసి నడిచినప్పుడు ఎ లాగైనా సరే మూసీని పునరుజ్జీవిం పజేయాలని ప్రజలు కోరినప్పుడు ఆరోజు మాటిచ్చా, మూసీని ప్రక్షా ళన చేస్తాం. హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ ఫ్యాక్టరీల కాలుష్యం మూసీలో కలవకుండా నియంత్రి స్తాం.

హైదరాబాద్ నగరానికి గోదావరి జ లాలను తరలించాలన్న ప్రాజెక్టుకు మూలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తర లిస్తున్నాం. గోదావరిపై 2008 లో తుమ్మడిహెట్టి వద్ద దివంగత వైఎస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతిని ప్రారంభిం చారు.ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో త్వరలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చలు జరు పుతాం. తుమ్మడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు చేపట్టాలని ప్రతిపాదిస్తే, మహారాష్ట్ర ప్రభుత్వం 142 మీటర్ల ఎత్తు వరకు అభ్యం తరం చెప్పడం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మధ్యంతరం గా148, 150 మీటర్ల వరకైనా ఒ ప్పించి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో లక్షన్నర, రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం.

గతంలో సంకల్పించినట్టుగా ప్రాజె క్టును పూర్తి చేసి చేవెళ్ల, వికారాబా ద్, తాండూరు, పరిగి వరకు వ్యవ సాయానికి గోదావరి జలాలను తర లించడం ద్వారా ఈ ప్రాంత రైతాం గాన్ని ఆదుకుంటాం.ఈ ప్రాజెక్టు రా జకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. బుద్వేల్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన హబ్‌గా అభివృద్ధి చే స్తాం. గేవ్ వే ఆఫ్ హైదరాబాద్ ప్రా జెక్టు కోసం ప్రణాళికలు సిద్ధం చే శాం. ప్రభుత్వం తలపెట్టిన ఈ అభి వృద్ధి కార్యక్రమాల్లో కలిసిరండని పి లుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొ న్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకట స్వామి, స్థానిక శాసనసభ్యుడు ప్ర కాశ్ గౌడ్ తో పాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాంత ప్రజాప్రతిని ధులు పాల్గొన్నారు.