Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సంతోషం 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తం గా వినాయక నిమజ్జనోత్సవాలు ప్ర శాంతంగా ముగియడంపై ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

తొమ్మిది రోజుల పాటు భక్తులు గ ణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని ము ఖ్యమంత్రి పేర్కొన్నారు. తొమ్మిది రో జులపాటు ఎటువంటి అవాంఛనీ య ఘటనలు చోటు చే సుకోకుం డా అత్యంత భక్తి శ్రద్ధలతో శోభా యాత్ర ప్రశాంతంగా సాగడంలో అ హర్నిశలు పనిచేసిన పోలీసు, ము న్సిపల్, రెవెన్యూ, విద్యుత్, ర వా ణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖ ల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల ని ర్వాహాకులు, క్రేన్ ఆపరేటర్లు అం ద రికీ ముఖ్యమంత్రి అభినందనలు తె లిపారు.

హైదరాబాద్ నగరంలో లక్షలాది వి గ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమ యానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగ తా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్య క్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడా నికి సహకరించిన ప్రజలందరికీ ము ఖ్యమంత్రి అభినందనలు తెలియ జేశారు.

*ఇప్పటివరకు 2.61 లక్షల విగ్ర హాలు నిమజ్జనం….*

వినాయక చవితి నిమిత్తం ఏర్పాటు చేసిన విగ్రహాల నిమజ్జన కార్యక్ర మం ఆదివారం కూడా హైదరాబా ద్‌లో వేడుకల మధ్య కొనసాగుతోం ది. ఇప్పటివరకు నగరంలోని వివిధ జోన్లలో కలిపి 2.61 లక్షల విగ్రహా లు నిమజ్జనం అయినట్లు అధికా రులు వెల్లడిస్తున్నారు.జోన్ల వారీగా విగ్రహాల నిమజ్జనం కొనసాగిందని చెబుతూ ఖైరతాబాద్‌ జోన్‌లో అ త్యధికంగా 63 వేల విగ్రహాలు, కూ కట్‌పల్లి జోన్‌లో 62 వేల విగ్రహాలు,

శేరిలింగంపల్లి జోన్‌లో 41 వేల విగ్ర హాలు, ఎల్‌బీ నగర్‌ జోన్‌లో 35,9 94 విగ్రహాలు, చార్మినార్‌ జోన్‌లో 22,304 విగ్రహాలు, సికింద్రాబాద్‌ జోన్‌లో 36 వేల విగ్రహాలు నిమజ్జన మయ్యాయని తెలిపారు. నగరం లోని హుస్సేన్‌సాగర్‌తో పాటు పలు చెరువులు, కుంటల్లో నిమజ్జనం కా ర్యక్రమం కొనసాగుతుండగా, పోలీ సులు, జిహెచ్ఎంసీ సిబ్బంది భద్ర తా చర్యలు కట్టుదిట్టం చేస్తూనే ఉన్నారు.