CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, ద త్తాత్రేయ జీవనశైలిని చూసి ఎంతో నేర్చుకోవలసి ఉంది
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించేవారు ప్ర ముఖ నాయకుడు బండారు దత్తా త్రేయ జీవనశైలిని చూసి ఎంతో నే ర్చుకోవలసి ఉందని ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉ ద్యమానికి ఎంతో స్ఫూర్తిని చ్చింద ని గుర్తుచేశారు. హైదరాబాద్ శిల్ప కళా వేదికలో అలయ్ బలయ్ ఫౌం డేషన్ ఆధ్వర్యం లో సీనియర్ నా యకుడు, హర్యానా గవర్నర్ బండా రు దత్తాత్రేయ “ప్రజలకథే నా ఆత్మ కథ” పుస్తకావిష్కరణ కార్య క్రమం లో ముఖ్యఅతిథిగా ముఖ్య మంత్రి పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్ గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు సుదీర్ఘమై న ప్రయాణంలో దత్తాత్రేయ ఎన్నో ఒడిదుడుకులను అనుభవించారు. వారు ప్రజలతో సంబంధాలను ఏ నాడూ కోల్పోలేదు. నాకు వారితో 40 సంవత్సరాల అనుబంధం ఉం ది. దత్తాత్రేయ కుటుంబంతో సన్ని హిత సంబంధాలు ఉన్నాయి. దత్తా త్రేయని గౌరవించని నాయకులు తె లంగాణలో ఎవరూ లేరు. దత్తాత్రే య స్ఫూర్తి మా ప్రభుత్వ నిర్ణయా ల్లో ఉంటుంది.
రాజకీయంగా భిన్న మార్గంలో ప్ర యాణం చేస్తున్నప్పటికీ వ్యక్తిగత సంబంధాల విషయంలో దాచిపెట్టా లన్న ప్రయత్నం చేయడం లేదు. ద త్తాత్రేయని చూసి ఎంతో నేర్చుకో వాలి. ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటంలో దత్తాత్రేయ అజాతశ త్రువు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి జాతీయ రాజ కీయాల్లో పదవుల్లో ఉన్నా లేకున్నా వారి గౌరవం ఎప్పుడూ తగ్గలేదు. అలాగే దత్తాత్రేయని కూడా అదే తీరుగా గౌరవిస్తారు.
బీజేపీ నాయకుడిగా కన్నా దత్తా త్రే యని ఒక మర్యాద కలిగిన నాయ కుడిగా అందరూ ఆయనను గౌరవి స్తారు. జంట నగరాల ప్రజలకు ఏ బాధ ఉన్న వినడానికి ఇద్దరు నా యకుల పేర్లు వినిపిస్తాయి. ఖైర తాబాద్ పి. జనార్ధన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ. జంట నగరాల నాయ కులు ఈ నేతలను గమనించాలి.
దత్తాత్రేయతో పాటు కేంద్ర మంత్రి కి షన్ రెడ్డితోనూ సన్నిహిత సంబం ధాలున్నాయి. రాజకీయాలకు అతీ తంగా కిషన్ రెడ్డిని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూనే వారితో ఉన్న సాన్నిహి త్యంతో తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ముఖ్య మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గవ ర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ , ఒడిశా గవర్నర్ కంభంపాటి హరి బాబు, త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్ర సేనారెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పా ర్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎ మ్మెల్యేలు, మరెందరో ప్రముఖులు పాల్గొన్నారు.