Fake Seed Companies :ప్రజా దీవెన, హైదరాబాద్: వానా కాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధి కారులను ముఖ్యమంత్రి ఎ.రే వం త్ రెడ్డి ఆదేశించారు. అన్ని జి ల్లా ల్లో సాగు విస్తీర్ణానికి సరిపడేన్ని వి త్తనాలు, ఎరువులు అందుబా టు లో ఉండేలా చూడాలన్నారు. నకి లీ విత్తనాలు, రైతులను మోసం చే సే కంపెనీలు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమం త్రి హెచ్చరించారు. నకిలీ విత్తనా లు, ఎరువులు విక్రయించే వ్యాపా రులపై ఉక్కుపాదం మోపాలని సీఎం అధికారులను ఆదేశించారు. కల్తీ, నకిలీ విత్తనాల దందాను అరి కట్టేందుకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడు లు నిర్వహించాలని, రాష్ట్ర సరిహ ద్దులు అన్ని చోట్ల టాస్క్ఫోర్స్ ని ఘా ఉంచాలని చెప్పారు. రైతుల ను మోసం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం హెచ్చరించారు.
ఎవరెవరు కల్తీ విత్తనాలు విక్రయి స్తున్నారు, ఎక్కడ నిల్వలులున్నా య ఎక్కడ నుంచి రవాణా అవు తున్నాయనే వివరాలన్నీ అధికా రులకు సమాచారం ఉందని, ఎవరి నీ ఉపేక్షించకుండా చట్ట ప్రకారం చ ర్యలు తీసుకోవాలని అన్నారు. నకి లీ దందా చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలన్నారు. విత్త నాలు, ఎరువులకు సంబంధించి రై తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడాలని సీఎ స్ రామకృష్ణా రావును సీఎం ఆదేశించారు.
సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వానాకాలం పంటల సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కా ర్యదర్శి సందీప్కుమార్ సుల్తాని యా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో పాటు ఉన్న తాధికారులు ఈ సమావేశంలో పా ల్గొన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో సరిపడే విత్తనాలు, ఎరువులు అం దుబాటులో ఉన్నాయని అధికారు లు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సీజన్లో వరి, పత్తి సాగు విస్తీ ర్ణం ఎక్కువగా ఉంటుందని, రైతు ల నుంచి డిమాండ్ ఉన్న అన్ని కం పెనీల విత్తనాలు మార్కెట్లో ఉన్నా యని చెప్పారు. ఎరువులు, విత్త నాల గురించి ఆందోళన చెందాల్సి న అవసరం లేదని ముఖ్యమంత్రి రైతులకు భరోసానిచ్చారు. ఈసారి రుతుపవనాలు ముందే వస్తుండ టంతో, రాష్ట్రంలోనూ వానలు ముందుగానే కురిసే అవకాశముం దని వాతావరణ శాఖ చేసిన సూ చనలను రైతులు గమనించాల న్నా రు. అందుకు అనుకూలంగా సరైన అదనులో పంటలు వేసుకో వాలని, నకిలీ విత్తనాలు కొని మో సపోవద్దని రైతులను అప్రమత్తం చేశారు. ప్యాక్డ్ విత్తనాలు తప్ప లూజ్ విత్తనాలు కొనుగోలు చేయ వద్దని, విత్తన పాకెట్లు కొనేటప్పు డు తప్పకుండా బిల్లును, పాకెట్ను పంట కాలం ముగిసేంత వరకు భద్రపరుచుకోవాలని ముఖ్యమం త్రి సూచించారు. నకిలీ కంపెనీలు, కల్తీ విత్తనాల బారిన పడి రైతులు మోసపోకుండా పెద్ద ఎత్తున అవ గాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు ఆదేశించారు.