Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM RevanthReddy sand polocy : ఇసుక​పై ఇక సరికొత్త విధానం

--అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం --విజిలెన్స్ ఏసీబీ విభాగాలతో తనిఖీలకు తక్షణ ఆదేశం --త్వరలోనే సరికొత్త పాలసీకి ప్రభుత్వం శ్రీకారం --గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇసుక​పై ఇక సరికొత్త విధానం

–అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం
–విజిలెన్స్ ఏసీబీ విభాగాలతో తనిఖీలకు తక్షణ ఆదేశం
–త్వరలోనే సరికొత్త పాలసీకి ప్రభుత్వం శ్రీకారం
–గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన/ హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాల సీని తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ( Revan thReddy) నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమ కూర్చటంతో పాటు ప్రజ ల అవసరాలకు అనుగుణంగా ఉండే విధి విధానాలుండే కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచిం చారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు.

ఇప్పుడు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ (sand polocy) అవినీతి దందాగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని స్థాయి ల్లో అక్రమాలు జరు గుతున్నాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం సచివాలయంలో గనులు, భూగర్భ ఖనిజ వన రుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావే శం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగే శ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు అధి కారులు ఈ సమావే శంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 48 గంటల్లో అన్ని స్థా యిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని డెడ్లైన్ విధించారు. రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దిం పాలని అధికారులను ఆదేశించారు.

అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్ట వద్దని సీఎం హెచ్చరించారు. అన్ని రూట్లలో ఉన్న టోల్ గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా మొత్తం బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు న్న ఇసుక రీచ్లు, డంప్లన్నీ తనిఖీలు చేయాలని, తప్పులుంటే జరి మానాలు వేస్తే సరిపోదని, అంతకు మించి కఠిన చర్యలు తీసుకోవా లని అన్నారు.

ఇసుక రీచ్ లన్నింటా సీసీ కెమెరాలున్నాయని అధికారులు ఇచ్చిన సమాధానంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి ఒక టిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాదయాత్రకు వెళ్లినప్పుడు మానే రు వాగులో తనుగుల ఇసుక క్వారీకి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసి అక్కడ సీసీ కెమెరాలు లేవని అన్నారు.

ఈనెల 3వ తేదీన రవాణా విభాగంతో నిజామాబాద్, వరంగల్ రూట్ల లో ఆకస్మిక తనిఖీలు చేయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే 22 లారీలకు అనుమతి లేదని గుర్తిం చారు. ఒకే పర్మిట్, ఒకటే నెంబర్తో నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నట్లు బయటపడిందని అన్నారు.

ఈ లెక్కన 25 శాతం అక్ర మంగా ఇసుక తరలిపోతుందని సీఎం అంచనాగా చెప్పారు. టీ ఎస్ఎండీసీ కేంద్రంగా జరుగుతున్న అక్రమా లను అరికట్టి, గనులు, భూగర్భ వనరుల విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని సీఎం అన్నారు.