CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక ప్రకటన, విదేశా ల్లో ఉద్యోగావకాశాలను అందిపు చ్చుకోవడానికి సహాయకారిగా ప్ర భుత్వంలో ప్రత్యేకం విభాగo
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలోని యువతీ యువకులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకో వడానికి ప్రభుత్వం అన్ని రకాల అ వకాశాలు కల్పిస్తుందని, ఆ అవకాశాలను స ద్వినియోగం చేసుకుని భవిష్యత్తు కు ప్రణాళికలు వేసుకో వాలని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. నైపుణ్యత కలిగిన యు వతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు విదేశాల్లో ఉద్యో గా వకాశాలను అందిపు చ్చుకోవడాని కి సహాయకారిగా ప్రభుత్వంలో ప్ర త్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ని ఐటీఐలను అత్యాధునిక సాం కే తిక పరిజ్ఞానంతో అడ్వాన్స్డ్ టెక్నా లజీ సెంటర్లుగా (ATCs) మార్చిన నేపథ్యంలో మల్లేపల్లి ఐటీఐ కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యా ప్తంగా 65 ఏటీసీలను వర్చువల్గా ప్రారంభించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొం గులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్య మంత్రి అధునాతన సాంకేతిక పరి జ్ఞానంతో రూపుదిద్దుకున్న మల్లేపల్లి ఏటీసీని పరిశీలించారు.
అనంతరం అక్కడ జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నైపు ణ్యం పెంచుకోవడానికి ప్రభుత్వం అ న్ని అవకాశాలను కల్పిస్తుందని, వా టిని సద్వినియోగం చేసుకుని మం చి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వే సుకోవాలని యువతకు పిలుపుని చ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్ర సంగం యావత్తు ఆయన మాట ల్లో నే…“ఏటీసీల్లో చదువుకునే ప్రతి వి ద్యార్థికి ప్రతి నెలా 2000 రూపా యల స్టయిఫండ్ ఇస్తాం. వచ్చే వి ద్యా సంవత్సరం నుంచి ఈ స్ట యి ఫండ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభు త్వానిది. ఇది ఖర్చు కాదు. భవి ష్య త్తుకు పెట్టుబడి. పని చేయాలన్న సంకల్పం కావాలి. కష్టపడి పని చే యాలి. మీకు ఉద్యోగావకాశాలు, పాస్పోర్టు తదితర సర్వీసును అం దించడానికి ప్రభుత్వంలో ప్రత్యేకం గా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. మీ భవిష్యత్తుకు పునాదులు వే స్తాం.
ఏటీసీల్లో శిక్షణ పొందిన తమ్ముళ్లు, చెల్లెళ్లు తెలంగాణ పునర్నిర్మాణం లో భాగస్వాములు కావాలి. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డా లర్ల ఆర్థిక శక్తిగా ఎదగడంలో మీ వంతు కృషి చేయాలి. అభివృద్ధిని సాధించాలన్న సంకల్పంతోనే యు వతలో సాంకేతిక నైపుణ్యాన్ని నే ర్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా ని ర్దేశించుకుంది.రాష్ట్రంలో 1956 లో ప్రారంభమైన ఐటీఐలు, క్రమేణా 65 ఐటీఐలకు పెరిగినప్పటికీ గత ప్ర భుత్వాలు వీటిని పట్టించుకోలేదు. మారిన కాలానికి ఈ కేంద్రాలు ఏ మాత్రం సంబంధం లేకుండా పాత కాలపు ఒరవడిలో నడిచాయి. వా టిని సమూలంగా మార్చి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా నూత న సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యం కలిగిన శిక్షణ అందించాలన్న లక్ష్యం తో గత ఏడాది ఇదే ప్రాంగణంలో ఏ టీసీలకు పునాదులు వేసుకున్నాం.
టాటా టెక్నాలజీస్ సహకారంతో రా ష్ట్రంలో 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చడానికి ప్రభుత్వం కేవలం రూ. 300 కోట్లు ఖర్చు చేస్తే టాటా సంస్థ 2100 కోట్లు ఖర్చు చేసి ఆధునిక ఏ టీసీలను తీర్చిదిద్దారు. మన వద్ద డబ్బుకన్నా ఆలోచన, చిత్తశుద్ది ఉం డాలి. చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. ప్ర స్తుతం 65 ఏటీసీలకు అదనంగా వ చ్చే విద్యా సంవత్సరం నుంచి రా ష్ట్రంలో మరో 51 ఏటీసీలను ప్రా రంభిస్తాం. ఈ 116 ఏటీసీలు యు వతకు ఉద్యోగ, ఉపాధి అవకాశా లు కల్పించడమే లక్ష్యంగా పనిచే స్తాయి. ఒకప్పుడు ఐటీఐల్లో చదు వుకున్న వారికి ఆర్టీసీలో అప్రెంటిస్ చేయడానికి అవకాశం ఉండేది. ఇ ప్పుడు కూడా మంత్రి పొన్నం ప్రభా కర్ అప్రెంటిషిప్ ఇప్పించే ఏర్పాట్లు చేయాలి.
రాష్ట్రంలో ప్రతి ఏటా 1 లక్షా 10 వే ల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టా పొందుతున్నప్పటికీ నైపు ణ్యం లేని కారణంగా చాలా మందికి ఉద్యోగావకాశాలు రావడం లేదు. నై పుణ్యం లేనిదే ప్రైవేటు కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే స్కిల్స్ పెంచాలన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారిం చిం ది. యంగ్ ఇండియా స్కిల్స్ యూ నివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి ప్రారంభించామంటే మ ట్టిలో మాణిక్యాలను వెలికి తీ యా లన్నదే మా సంకల్పం.చేతుల్లో డిగ్రీ లు ఉన్నా స్కిల్స్ లేకపోతే ప్రయోజ నం లేదు. నైపుణ్యత కలిగిన వారికి దక్షిణ కొరియా, జర్మనీ, జపాన్, ర ష్యా లాంటి దేశాల్లో అనేక ఉద్యో గా వకాశాలు ఉన్నాయి. కేవలం ఐటీ చదివితేనే ఉద్యోగాలొస్తాయన్న అ పోహల్లో బతుకుతున్నాం. అది త ప్పు. ఏటీసీల్లో చదువుతున్న యు వత నైపుణ్యత సాధించడంపై ఫోక స్ పెట్టాలి.
చదువు ఒక్కటే సమాజంలో అ స మానతలు రూపుమాపుతుంది. మీ కు గౌరవం దక్కుతుంది. చదువు, సాంకేతిక నైపుణ్యం ఒక్కటే మీ త లరాతను మార్చుతుంది. ఈ ప్రభు త్వం మీకు అవకాశాలు, వసతుల ను ఏర్పాటు చేస్తుంది. చదువుకుని రాణించండి. చదువు లేకపోతే, నై పుణ్యం లేకపోతే ఎందుకూ కొరకా కుండా పోతారని ఉద్బోధించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు ర వి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు ఉన్నతాధికారులు, టాటా టెక్నాలజీస్ (Tata Technolog ies) ప్రతినిధులు, ఏటీసీ విద్యార్థు లు హాజరయ్యారు.రాష్ట్ర వ్యా ప్తం గా వివిధ ఏటీసీల నుంచి స్థానికం గా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి గ డ్డం వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు.