CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, వందేళ్లు, వెయ్యేళ్లు చెప్పుకునేలా హైద రాబాద్ నగరాన్ని అభివృద్ధిచేస్తాం
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభో త్సవ కార్యక్రమంలో తెలంగాణ ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ప్ర సంగం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఆ యన కార్యక్రమంలో ఆయన వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే..
అపోహలు, అనుమానాలను దా టుకుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళి కలతో ముందుకు వెళుతున్నాం. అ పోహలు సృష్టించడం ద్వారా అ భి వృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి క నువిప్పు కలిగించేలా ఈ కార్యక్ర మాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకు లను అభినందిస్తున్నా. ప్రభుత్వం పాలసీ, కన్స్ట్రక్షన్ రెండూ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివి.
పాలకులు మారినా పాలసీ పెరాల సిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతు న్నాం. నాయకుల మధ్య ఉన్న భి న్నాభిప్రాయాలు కొంతకాలం ఇలాం టి అనుమానాలు, అపోహలకు తా విస్తుంది. పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం.
పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు.లాభాలు వచ్చేలా ప్రోత్సహిం చే బాధ్యత మా ప్రభుత్వానిది. రా జకీయ నాయకులు సృష్టించే అపో హలకు మీరు ఊతం ఇస్తే నష్టపో యేది మీరే. అలాంటి అపోహలను తొలగించడానికే ఇక్కడికి వచ్చాను.
ఇతర దేశాల ప్రతినిధులను ఇక్కడ పెట్టుబడులకు ఆహ్వానించే మేము ఇక్కడే ఉన్న మిమ్మల్ని ఎందుకు వ దులుకుంటాం. పెట్టుబడుల విష యంలో మీకే మా మొదటి ప్రాధా న్యత. నేను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని.
కొల్లగొట్టి విదేశాలకు తరలించుకు పోవాలన్న విశాల దృక్పథం ఉన్న వాడిని కాదు. సమాజ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తా.అందుకే మీరు అడిగిన కొన్నింటికి నేను అం గీకరించకపోవచ్చు. నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను.
పారదర్శక విధానంలో ప్రజలకు ఉ పయోగపడేలా అభివృద్ధికి సహక రించేందుకు నాకు అభ్యంతరం లే దు. జైపాల్ రెడ్డి చొరవతో హైదరా బాద్ నగరానికి మెట్రో వచ్చింది. ప దేళ్లుగా మెట్రో విస్తరణ జరగలేదు.
అలా జరిగి ఉంటే హైదరాబాద్ ట్రా ఫిక్ సమస్య కొంతైనా పరిష్కారమ య్యేది.జనసాంద్రత ఉన్న ప్రాంతా ల్లో మల్టీ యూనిట్ ఉండే ట్రాన్స్పో ర్టేషన్ ఉండాలి.లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నేను శాయశక్తులా ప్ర యత్నిస్తున్నా.
షామీర్ పెట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణకు కృషి చేస్తున్నాం. మన న గరం ప్రతిష్ట పెంచడానికే మా ప్రయ త్నం. మాటిమాటికీ ఢిల్లీకి వెళుతు న్నారని కొందరు మాట్లాడుతున్నా రు. మెట్రో, మూసీ, ఇతరేతర అను మతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభు త్వం. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా ఎక్కడికి వెళతా రు. ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగళా ఇచ్చింది నెలకు నాలుగురోజులు వె ళ్లి కేంద్రంతో అనుమతులు తెచ్చుకో వడానికే.దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా.
అది ఫామ్ హౌస్ లా వాడుకుని దా వత్ లు చేసుకునేందుకు కాదు. 26 వేల కోట్లు రుణాలను 35 ఏళ్లకు 7. 5 శాతం వడ్డీకి రీ స్ట్రక్చర్ చేయిం చా. అలా 2 లక్షల కోట్ల రుణాలకు రీ స్ట్రక్చర్ కోసం ప్రధానిని కోరుతు న్నా. ఇదినా ఒక్కడి కోసం చేస్తున్న ది కాదు రాష్ట్ర ప్రయోజనాల కోస మే నా తాపత్రయం.తెలంగాణకు మరిన్ని విమానాశ్రయాలు తెచ్చుకో వాల్సిన అవసరం లేదా. మెట్రో, ఎ యిర్ పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్డు, రీజ నల్ రింగ్ రైల్ అనుమతులు అడిగి నా రాష్ట్ర ప్రయోజనాల కోసమే.
రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు 11 కొత్త రేడియల్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నాం
వాటర్, రోడ్డు కనెక్టివిటీ లేకుండా ఇ న్ఫ్రా స్రక్చర్ ఎలా అభివృద్ధి అవు తుంది. హైదరాబాద్ అమరావతి గ్రీ న్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం కేం ద్రానికి ప్రతిపాదనలు పంపాం. త్వర లోనే అనుమతులురాబోతున్నా యి. తెలంగాణను మూడు భాగా లుగా విభజించి అభివృద్ధి ప్రణాళిక లు రూపొందిస్తున్నాం. కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ గా విభజించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయ బోతున్నాం.
నీళ్ళుండే చోటుకు మనం వెళితే నీళ్లు ఎక్కడికి వెళతాయి.అందుకే హైడ్రాతో చెరువులను పునరుద్ధరి స్తున్నాం. నాలాల ఆక్రమణలు తొ లగిస్తే ఒక పెద్దమనిషి సోషల్ మీడి యా ద్వారా మాపై దుష్ప్రచారం చే స్తున్నారు. దానికి మీరు మద్దతుగా నిలిస్తే మీకే నష్టం. తెలంగాణ కోసం ప్రణాళికలు మేం సిద్ధం చేస్తాం. మీ రు ప్రమోట్ చేయండి.ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది.
కులీ కుతుబ్ షా చార్మినార్ కట్టారు, ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ నిర్మిం చారు, హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు. వాళ్లు ఇక్కడ లేకపోయినా వారి పేర్లు చె ప్పుకుంటున్నాం. వారిని గుర్తు చేసు కుంటున్నాం. సంపాదించింది ఎవ రైనా తీసుకెళతారేమో కానీ సమా జానికి ఇచ్చింది ఎవరూ తీసుకెళ్లలే రు. నాకు వేరే కోరికలేం లేవు.
హైదరాబాద్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా.భవిష్యత్ లో వందే ళ్లు, వెయ్యేళ్లు చెప్పుకునేలా నగరా న్ని అభివృద్ధి చేస్తాం. నాకు తెలంగా ణను అభివృద్ధి చేయాలన్న చిత్తశు ద్ధి, తపన ఉంది. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. అందరం కలిసి కట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసు కుందాం. భూమి ఒక సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను మీరు ఎంత పా జిటివ్ గా ముందుకు తీసుకెళ్తార నేదనిపైనే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆధారపడి ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.