–క్రిటికల్ ఫీడర్ల, DTR ల పై నిరంత ర పర్యవేక్షణ ఉండాలి
–33 కేవీ మరియు LT నెట్వర్క్ TG AIMS సర్వే చేపట్టాలి
–SE లు తప్పనిసరిగా క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహించాలి
–అధికారులకు CMD ముషారఫ్ ఫరూఖీ ఆదేశం
CMD Musharraf Farooqui: ప్ర జా దీవెన, హైదరాబాద్: వచ్చే వ ర్షాకాలంలో ఎలాంటి విద్యుత్ స మస్యలు రాకుండా సిబ్బంది అప్ర మత్తంగా ఉండాలని దక్షిణ తెలం గాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మ న్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫ రూఖీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మింట్ కాం పౌండ్ లోని ప్రధాన కార్యలయం నుండి చీఫ్ ఇంజినీర్లు, సూపెరిం టెండింగ్ ఇంజినీర్ల తో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భముగా సీఎండీ మాట్లా డుతూ సూపెరింటెండింగ్ ఇంజినీ ర్లు తమ పరిధిలోని ఫీడర్లలో విద్యు త్ సరఫరా పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి, వారానికొక సారి సంబంధిత అధికారులతో స మీక్ష చేయాలన్నారు. అత్యధికంగా అంతరాయాలు నమోదైన ఫీడర్ల పై ప్రత్యేక ద్రుష్టి సారించి, లైన్ల, డిస్ట్రి బ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల, AB స్విచ్ లను తనిఖీలు చేపట్టి, సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చూ డాలి. ముఖ్యంగా ఫీడర్ల అంత రాయాలకు గల కారణాలను విశ్లే షించగా ఎక్కువ శాతం చెట్ల కొమ్మ లు విద్యుత్ తీగల పై పడటం తాక డం మూలంగానే ట్రిప్ అవుతున్నా యని గుర్తించామన్నారు. కావున, క్షేత్ర స్థాయి సిబ్బంది గత అనుభ వాలను దృష్టిలో పెట్టుకుని చెట్లు అధికంగా వుండే ప్రాంతాల్లో విధిగా పెట్రోలింగ్ చేసి తగు చర్యలు తీసు కోవాలన్నారు.
అలాగే, వర్షాలు కురిసేటప్పుడు, వాతావరణ శాఖ హెచ్చరికల సమ యంలో సిబ్బంది తమ తమ కార్యా లయాల్లో నిత్యం అందుబాటులో వుండే విధంగా చర్యలు తీసుకోవా లి. అలాగే, వినియోగదారుల ఫి ర్యాదులపై తక్షణంగా స్పందించి స మస్య పరిష్కరించాలి. FOC పరి ధిలో వుండే ఆటోలకు GPS సాంకే తికను అమర్చడం జరిగింది. ఈ సదుపాయం వలన ఫిర్యాదిదారుడి ప్రాంగణానికి త్వరితగతిన చేరే అవ కాశముంటున్నారు.
గతం లో 11 కేవీ నెట్వర్క్ పై నిర్వ హించిన TG AIMS సర్వే సత్ఫలి తాలను ఇస్తున్నదని, ఈ సర్వే ద్వా రా విద్యుత్ స్తంభాల, డిస్ట్రిబ్యూష న్ ట్రాన్స్ ఫార్మర్ ల మరియు ఇతర నెట్వర్క్ మాపింగ్ విజయవంతంగా పూర్తి అయింది. దీనిని 33 కేవీ నె ట్వర్క్ మరియు LT స్థాయిలో కూ డా సర్వే చేపట్టాలని సీఎండీ అధికా రులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎండీ తో పాటు, సంస్థ ఇంచార్జి డైరెక్టర్ లు డా. నర్శింహులు, కే సాయి బా బా, చీఫ్ ఇంజినీర్లు చక్రపాణి, పాం డ్య, కామేష్, బాల స్వామి సుపరిం టేడింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.