Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMrevanthreddy : తెలంగాణ కోసం దేవేందర్ గౌడ్ సాహసోపేత నిర్ణయం

--తెలంగాణ ఉద్యమ ప్రతిబింబం 'విజయ తెలంగాణ" -- పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ కోసం దేవేందర్ గౌడ్ సాహసోపేత నిర్ణయం

–తెలంగాణ ఉద్యమ ప్రతిబింబం ‘విజయ తెలంగాణ”
— పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

CMrevanthreddy:  ప్రజా దీవెన, హైదరాబాద్:వేలాది మంది యువకులు, విద్యార్థుల త్యాగాలు, సబ్బండ వర్ణాల మద్ద తుతోనే తెలంగాణ ఉద్యమం విజ యవంతమైందని, అలాంటి ఉద్య మ చరిత్రను ఏ కొందరు వ్యక్తులో తమకు అనుకూలంగా మలచుకో వాలని ప్రయత్నించినప్పుడు, నిజంగా త్యాగాలు చేసిన సిసలైన ఉ ద్యమకారులకు సంబంధించిన చారిత్రక వాస్తవాలను లిఖించాల్సి న అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రజల కోణాన్ని ఆవి ష్క రించిన పుస్తకం ‘విజయ తెలంగాణ’ అని, ఇలాంటి రచనలు మరి న్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. మలి దశ ఉద్యమం లో కీలకంగా వ్యవహరించిన తెలం గాణ యోధుడు, మాజీ మంత్రి తూ ళ్ల దేవేందర్ గౌడ్ రచించిన ‘విజయ తెలంగాణ’ పుస్తకాన్ని ము ఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొన్నం ప్రభా కర్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ , ప్రభుత్వ సలహాదారు కే.కేశవ రావుతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. “వ్యక్తిగతంగా నేను చా లా అభిమానించే నా యకుల్లో దేవేందర్ గౌడ్ అగ్రస్థానంలో ఉం టా రు. విజయ తెలంగాణ వారి స్వీయ చరిత్ర కాదు. తెలంగాణ ఉద్య మ చరిత్రను ప్రజల కోణం లో పొందుపర్చిన పుస్తకం ఇది.

ఉ ద్యమ చరిత్రను కొంత మంది త మకు అనుకూలంగా మలుచు కునే ప్రయత్నం చేశారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యా ర్థులు, యువకుల త్యాగాలను చరిత్రగా లిఖించాలని మరో సారి కోరుతున్నాను.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేవేందర్ గౌడ్ ఆ నాడు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పోరాటాలు సాహసోపేతమై న వి. గోదావరి జలాల తరలింపు కోసం దేవేందర్ గౌడ్ ఆ నాడు చేసిన పాదయాత్ర ఫలితంగానే ‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు’కు ఆమోదం ల భించింది.

తెలంగాణ అంటే టీజీ అని రాయించింది దే వేందర్ గౌడే. ఉద్యమం లో యువ కులు బండ్ల పైనే కాదు, గుండెల పైనా టీజీ అని రాసుకు న్నారు. ప్రజ ల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం రాగానే టీఎస్ ను టీజీ గా మా ర్చాం. రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత జయ జయహే తెలం గాణ పాటను అధికారిక గీతంగా గుర్తించడంగానీ, తెలంగాణ ఉద్య మంలో సర్వస్వం త్యాగం చేసిన 9 మంది ఉద్యమకారులకు ఇంటి స్థ లం, ఆర్థిక సహాయ ప్రకటన వంటి నిర్ణయాలు ప్రజలు కోరు కున్న విధంగానే తీసుకున్నాం.దేవేందర్ గౌడ్ లాగా విలువలతో కూడి న నా యకుల సంఖ్య తెలంగాణ రాజ కీయాల్లో పెరగాల్సిన అవ సరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.