CMRevanthReddy : సీఎం కీలక వ్యాఖ్య, కృతనిశ్చయంగా బీసీరిజర్వేషన్లతోనే ఎన్నికలకు
-- కుల సర్వేలో వివరాలు శాసనస భలో వెల్లడించాం --ముస్లిం రిజర్వేషన్ల సాకుతో బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డు --దేశానికి రోల్ మోడల్గా తెలంగా ణ కులగణన --ఓబీసీ రిజర్వేషన్లకు 2029 లోక్స భ ఎన్నికలు లిట్మస్ టెస్ట్ --ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసే విషయంపై ఆలోచిస్తున్నాం --డిల్లీ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
సీఎం కీలక వ్యాఖ్య, కృతనిశ్చయంగా బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు
CMRevanthReddy: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: బీసీలకు 42 శా తం రిజర్వేషన్లతో తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించేం దు కు కృతనిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్ప ష్టం చేశారు. హైకోర్టు సైతం 90 రోజుల్లో సెప్టెంబరు నెలాఖరు లో గా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని, 30 రోజుల్లో (జులై నెలాఖ రులోగా) రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశిం చిందన్నా రు. ఢిల్లీ లోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CMRevanthReddy) బుధవారం విలేకరులతో మాట్లా డారు.
బీసీలకు విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శా తం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ పూర్తి స్థాయిలో చర్చించి ఆమోదించిన రెండు బిల్లు లను ఆమోదించ డంలో కేంద్ర ప్రభు త్వం తాత్సారంచేస్తోందని సీఎం ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు బి ల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్య సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లను గురువారం ఉదయం కలిసి తెలంగాణ ప్రభత్వం చేపట్టిన సా మాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజ కీయ మరియు కుల సర్వే (SEE EPC) జరిపిన తీరు, రాష్ట్ర ప్రభు త్వం అనుసరించిన విధానాలను వివరిస్తామని తెలిపారు.
సాయంత్రం కాంగ్రెస్ లోక్సభ, రా జ్యసభ సభ్యులకు ఈ అంశాన్ని వివరిస్తామని సీఎం వెల్లడించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తె లంగాణ ప్రభుత్వం చేసిన రెండు బి ల్లుల ఆమోదానికి పట్టుపడ తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ లకు 42 శాతం రిజర్వే షన్లకు ( BC regervation) సంబంధించి తెలంగాణ శాసన సభలో బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం మద్దతు పలికాయని సీఎం గుర్తుచేశారు. బీసీలకు రిజర్వేషన్లను అడ్డు కునేందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజ య్ ముస్లింలను సాకుగా చూపు తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్, ఆర్ఎ స్ఎస్ ప్రధాన కార్యాల యం ఉన్న మహారాష్ట్రలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవు తున్నాయని ,బీజేపీ నేతలకు దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో ముస్లిం రిజ ర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించాలని సీఎం సవాల్ విసిరారు.
గుజరాత్లో ముస్లింలకు రిజర్వేష న్లు అమలవుతున్నాయని, ఇక ముందు అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీ నేతలు అందుకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని సీఎం ప్రbశ్నించారు. తెలం గాణలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ మరియు కుల సర్వే ప్రక్రియను 2024, ఫిబ్రవరి 4న మొ దలు పెట్టి 2025, ఫిబ్రవరి 4వ తేదీ నాటికి పూర్తి చేసి శాసనసభ లోనూ ఆమోదించామని సీఎం రే వంత్ రెడ్డి తెలిపారు.
అందుకే తె లంగాణలో ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవం గా (సోషల్ జస్టి స్ డే) జరుపుతున్నామని తెలిపా రు. ఈ సర్వేలో తెలంగా ణలో 3.55 కోట్ల మంది వివరాలు సేకరించామ ని సీఎం పేర్కొన్నా రు. సర్వే వివరా లను శాసనసభ ముందుంచామని, దాని ప్రకారం 56.4 శాతం బీసీలు, 17.45 శాతం ఎస్సీలు, 10.08 శా తం ఎస్టీలు, 10.09 శాతం ఉన్నత వర్గాల వారు ఉన్నారని సీఎం చె ప్పారు.
తెలంగాణలో 3.09 శాతం మంది తాము ఏ కులానికి చెందమని ప్రక టించారని, తెలంగాణలో ఇదో కొత్త పరిణామమని అన్నారు. సర్వే వివ రాలను స్వతంత్ర నిపుణుల సలహా కమిటీకి ఇచ్చామని, వారు దానిపై చర్చించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వా నికి సమర్పించా రని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ నివేదికను మంత్రివ ర్గంలో చర్చిం చి శాసనసభలో ప్రవేశ పెడతామని వెల్లడించారు. సర్వే చేసినప్ప టికీ వ్యక్తిగత వివరాలు వెల్లడించకూదని, అది వ్యక్తిగత డే టా ప్రైవసీ యాక్ట్కు విరుద్ధమని సీఎంఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
కుల గణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్మో డల్గా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అ న్నారు. కుల గణన చేప ట్టమని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమ ర్పిం చిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టాక తమను అనుసరిస్తూ కుల గణనకు గెజిట్ విడుదల చేసిందన్నారు. తె లంగాణ వేసిన రోడ్ మ్యాప్ను దేశ వ్యాప్తంగా కుల గణన సేకరణకు కేంద్ర ప్రభు త్వం వినియోగించు కోవాలని సీఎం సూచించారు. కన్యా కుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాం ధీ తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని తెలంగాణలో ప్రకటించారని, ఆయన ప్రకటించిన ట్లుగానే తెలంగాణలో అధికా రంలో కి రాగానే కులగణన చేపట్టామని తెలిపారు.
రాబోయే 2029 లోక్సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్ట్గా నిలుస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు బిల్లుల ర ద్దు విషయంలోనూ తొలుత మొండి కేసిన బీజేపీ ప్రభు త్వాన్ని మెడలు వంచి రద్దు చేయించామని, కుల గణన విష యంలో తమ మార్గంలో నడిచేలా చేశామని సీఎం తెలిపారు. ఈడ బ్ల్యూఎస్ కు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోనే 50 శాతం రిజ ర్వేషన్ల పరిమితి అంశం పక్కకు పోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలి….ఉప రాష్ట్రపతి జ గ్ దీప్ ధన్ఖడ్ రాజీనా మాకు కారణాలేమిటో తనకు తెలి యద ని, కానీ ఆ రాజీనామా దుర దృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అ న్నారు. ఉప రాష్ట్రపతి పదవిని ఈదఫా తెలంగాణకు ఇవ్వాలని సీ ఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉప రాష్ట్రపతిగా ఉన్న తెలుగు వ్య క్తి వెంకయ్య నాయుడును రాష్ట్రప తి కాకుండా ఇంటికి పంపిం చారని, సికింద్రాబాద్ నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్న బీసీ నేత దత్తాత్రే యను గవర్నర్గా పంపి ఆ పదవిని కిషన్ రెడ్డికి ఇచ్చారని సీఎం అన్నా రు. బీసీ నేతగా ఉన్న సంజయ్ను బీజేపీ రాష్ట్ర అధ్య క్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి, ఆయన తర్వాత రాంచంద ర్రావుకు ఇచ్చారని, బీజేపీ బీసీలకు అన్యాయం చేసిందని సీఎం విమర్శించారు.
దత్తాత్రేయ గవర్నర్ పదవీ కాలం కూడా ముగిసిపోయిందన్నారు. బీసీలకు చేసిన ఈ అన్యాయాన్ని సరిచేసుకునేందుకు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇస్తే బాగుం టుందని సీఎం అభిప్రాయపడ్డా రు. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికలో అంతిమ నిర్ణయం కాంగ్రెస్ అధిష్టా నానిదేనని, తనను అవకాశం ఉం టే దత్తాత్రేయకు మద్దతు ఇచ్చే విష యంలో ప్రయత్నం చేస్తానని సీఎం ఓ ప్రశ్నకు సమాధా నం చెప్పారు. స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల ని బంధనను ఎత్తివేసే విషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నామని మరో ప్రశ్నకు సీఎం రేవం త్ రెడ్డి బదులిచ్చారు.
సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సల హాదారులు షబ్బీర్ అలీ, హర్కా ర వేణుగోపాల రావు, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘు రామిరె డ్డి, పోరిక బలరాం నా యక్, కుం దూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, డాక్టర్ కడియం కావ్య, సురేశ్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొ న్నారు.