Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMrevathreddy: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, అంత ర్జాతీయ నగరాలతో పోటీ

సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, అంత ర్జాతీయ నగరాలతో పోటీ

CMrevathreddy : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రస్తుతం దేశంలోని ముంబై, బెంగుళూరు, ఢిల్లీ నగరాలతోనే కాకుండా న్యూయార్క్, సియోల్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతోoదని పేర్కొన్నారు. అభి వృద్ధి, సంక్షేమం, సుపరిపాలన వంటి కీలకమైన మూడింటి సమ్మ ళితమైన విధానం కొనసాగించడమే తెలంగాణ మాడల్ అని ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి ఢిల్లీలో ఇండియా టుడే కoక్లేవ్- 25లో పాల్గొన్నారు. ఈ వేదికపై ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, ఇండి యా టుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రీ తి చౌదరి అడిగిన అనేక సమకాలీన అంశాలపై రేవంత్ రెడ్డి స్పష్టమైన సమాధానాలిచ్చారు.

గుజ రాత్ రాష్ట్రానిది టెస్ట్ మ్యాచ్ మో డల్ అయితే, తెలంగాణది ట్వంటీ ట్వంటీ మాడల్ అని ఒక ప్రశ్నకు సమాధానంగా అభివర్ణిం చారు. అ నేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమా ధానం ఆయన మాటల్లోనే…..

30 వేల ఎకరాల్లో అంతర్జాతీయస్థాయి అత్యంత అద్భుతమైన ఫ్యూ చర్ సిటీ నిర్మా ణానికి శ్రీకారం చుట్టాం. అందు కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశాం. అయిదు సంవత్స రాల తర్వాత హైద రాబాద్ నగరాన్ని చూడండి. హైదరాబాద్ నగరాన్ని ముంబై, బెంగుళూరు, ఢిల్లీతో పోల్చుకోవడం లేదు. న్యూయార్క్, సియోల్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతున్నాం. తెలంగాణ మాడల్‌తో ఎవరూ పోటీ పడలేరు.

హైదరాబాద్ అభి వృద్ధి ఒక్కరోజులో సాధ్యమైంది కాదు. కుతుబ్ షాహీ కాలం నుంచి ఈ నగరానికి 450 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రభుత్వా లు మారినా, ముఖ్య మంత్రులు మారినా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. పెట్టుబడుల విషయంలో గుజరాత్ తరహాలోనే దేశ ప్రధా నమంత్రిగా నరేంద్ర మోదీ మిగతా రాష్ట్రాలకు కూడా రాయితీలు ప్రక టించాలి. రాష్ట్ర ప్రజలు మాపై నమ్మకం ఉం చినందున రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై అడగటం మా బా ధ్యత. తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పులున్నాయి.

2014 ప్ర త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్పుడు కేవలం 69 కోట్లు మాత్రమే అ ప్పులుండేవి. ప్రస్తుతం తెలంగాణ ఆదాయం నెలకు 18,500 కోట్లు మాత్రమే. జీతాలకు, అప్పులపై అ సలు వడ్డీలకే 13 వేల కోట్లు చెల్లిం చాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కేపిటల్ ఇన్వెస్ట్‌ మెంట్ కోసం కనీసం నెలకు 500 కోట్లు కేటాయిం చలేని పరిస్థితులున్నాయి. ఇలాంటి అంశాలపై జాతీ యస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. 2026 లో డీలిమి టేషన్ ప్రక్రియ చేపట్టడానికి ముందు అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోవాలి. దీనిపై ముందు చర్చ జరగాలి.

రాజకీయ కోణంలో దక్షిణాదికి నష్టం జరిగే నిర్ణయాలు సరికాదు. దే శంలో కులగణన ఎందుకు జరగకూడదు. అందులో తప్పేముంది. బీసీల జనాభాను ఎందుకు లెక్కించకూడదు. ఎస్సీ, ఎస్టీ లెక్కలు తే ల్చినట్టుగానే బీసీల గణాంకాలు సేకరించడంలో ఇబ్బందేంటి. వారి డిమాండ్ సమంజస మైనప్పుడు బీసీ జనాభా ప్రాతిపది కన వారికి రిజర్వేషన్లు కల్పించ డంలో తప్పేముంది.

ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఓబీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదు. హిందీ నేర్చుకోవడ మన్నది ఒక ఐచ్చికంగా మాత్రమే ఉండాలి. బలవంతంగా రుద్దకూ డదు. కాలేజీల్లో ఫ్రెంచ్, జర్మనీ వంటి ఎన్నో భాషలు ఉన్నాయి. ఎవరి కి ఏదిష్టముంటే దాన్ని నేర్చుకుంటారు.

హిందీని నేర్చుకోవడాన్ని వ్యతి రేకించడం లేదు. బలవంతంగా రుద్ద డానికి ప్రయత్నించవద్దనేదే మా అభిప్రాయం. హిందీ నేర్చుకో వడం వల్ల ప్రయోజనం ఉందంటే నేర్చుకుంటారు.హైదరాబాద్ వేదికగా ఒ లంపిక్ క్రీడలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశాం.

క్రీడలకు హైదరాబాద్ ఒక మంచి కేంద్రం. ప్రపంచ మిలటరీ గేమ్స్, నేషనల్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ హైదరాబాద్‌ లో నిర్వహించాం. ఎం తో మంది ప్రపంచ స్థాయి క్రీడాకారులు తెలం గాణ నుంచి ఉన్నారు. హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ఏది ఉత్త మమైన నగరమో అంత ర్జాతీయ ఒలింపిక్ అసోషియేషన్ నిర్ణయించాలని ముఖ్యమంత్రి అ న్నారు.