Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Disaster Monitoring : సీఎం కీలక నిర్ణయం, విపత్తుల ప ర్యవేక్షణకు సరికొత్త వ్యవస్థ

Disaster Monitoring : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైద రాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తి నప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప ర్యవేక్షించడానికి వీలుగా ఒక వ్యవ స్థను ఏర్పాటు చేసుకోవాలని ము ఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికా రులను ఆదేశించారు. వర్షాలు పడి నప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పో లీసు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచే యాలని చెప్పారు.వర్షాకాల సన్నద్ధ తపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారు ల సమావేశంలో పరిస్థితిని సమీక్షిం చారు.

అవసరానికి అనుగుణంగా 24 గం టల పాటు ఎమర్జెన్సీ టీమ్స్ అందు బాటులో ఉండాలని చెప్పారు. జం ట నగరాల్లో గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ హా ర్వెస్టింగ్ వెల్స్ పనులకు సంబంధిం చిన పురోగతిని అధికారులను అడి గి తెలుసుకున్నారు.వాతావరణ శా ఖ సూచనలకు అనుగుణంగా ఎప్ప టికప్పుడు ముందస్తు చర్యలు చేప ట్టాలని చెప్పారు. అసంపూర్తిగా ఉ న్న నాలాల పూడికతీత పనులు వీ లైనంతగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాం తాలను గుర్తించి ముందస్తు చర్య లు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల కోర్ అర్బ న్ రీజియన్‌లో సమస్యలు తలెత్త కుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని అ న్నారు. ఈ ప్రాంతంలోని చెరువు లు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభి వృద్ధికి సంబంధించిన ప్రత్యేక పాల సీని తయారు చేసే అంశాన్ని పరిశీ లించాలని అధికారులకు చెప్పారు. డీసిల్టింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణారావుతో పాటు ఇతర ఉన్న తాధికారులు పాల్గొన్నారు.