CM Key Statement : ప్రజా దీవెన , హైదరాబాద్ : ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ కల్ప న, ప్రపంచ స్థాయి మౌలిక సదు పాయాల కల్పనతో పాటే సమాజం లోని అన్ని వర్గాల సంక్షేమాన్ని స మతుల్యం చేసుకుంటూ సమగ్ర మైన సమ్మిళితమైన అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పా రు. “తెలంగాణ రైజింగ్” అనే ఆలో చనలో ఈ దార్శనికత ఇమిడి ఉం దన్నారు. నానక్రామ్గూడలో సొ నాటా సాఫ్ట్వేర్ నూతన ఫెసిలిటీ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారం భించారు.
తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, హైదరా బాద్ను ప్రపంచంలోని అద్భుత నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రణాళికలను ఈ వేదికగా వివరిం చారు. అత్యుత్తమ నగరంగా తీర్చి దిద్దడంలో, తెలంగాణ అభివృద్ధిని ప్రపంచం ముందు చాటడానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలని, హైద రాబాద్ బ్రాండ్ అంబాసిడర్లుగా ప నిచేయాలని కోరారు. ఆయన ప్ర సంగం యావత్తు ఆయన మాటల్లో నే…
“హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెం టర్ల (GCCs) హబ్ గా మారింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్, AI -రెడీ డేటా సెంటర్లలో ప్రముఖం గా నిలుస్తోంది. మైక్రోసాఫ్ట్, కాగ్ని జెంట్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి గ్లోబల్ ఐటీ కంపెనీలు హైదరాబాద్లో కార్యకలాపాలను విస్తరించాయి.
హైదరాబాద్ అంతర్జాతీయ ప్రా ముఖ్యత పెరిగింది. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు ఈ నగరం ఆతిథ్య మిస్తోంది. రానున్న రోజుల్లో మరి న్ని అంతర్జాతీయ ఈవెంట్లు హైద రాబాద్లో నిర్వహిస్తాం.
తెలంగాణ అనేక కీలక రంగాల్లో దే శంలోనే మొదటి స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం పోలీసింగ్ లో గానీ, చట్టాలను సరి గా అమలు చేయడంలోగానీ, ద్ర వ్యోల్బణ నియంత్రణ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ కల్పన, పన్నుల వసూళ్లలో తెలంగాణ అగ్ర గామిగా ఉంది.
స్వయం సహాయ సంఘాల (SHG s) ద్వారా 66 లక్షల మందికి పైగా మహిళలకు సాధికారత కల్పిస్తూ, దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఫండింగ్ మరియు మెంటరింగ్ కార్యక్రమాన్ని తెలంగాణ అమలు చేస్తోంది.
రాజీవ్ యువ వికాసం కార్యక్రమం ద్వారా వేలాది యువతకు వ్యాపా ర, స్వయం ఉపాధి రంగాల్లో మద్ద తు అందిస్తున్నాం. అలాగే, సమాన త్వం దిశగా కీలక అడుగు వేసిన తెలంగాణ, ట్రాన్స్జెండర్ వాలంటీ ర్లను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ బృందంలో చేర్చిన మొదటి రాష్ట్రం గా నిలిచింది.
తెలంగాణలో మౌలిక సదుపాయా లు, వివిధ ప్రాజెక్టుల కోసం డ్రైపో ర్టును ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ని సముద్రతీర పోర్టుకు అనుసంధా నం చేయనున్నాం. భారతదేశం లోనే అత్యంత శాస్త్రీయంగా ప్ర ణాళికాబద్ధంగా హైదరాబాద్ స మీపంలో ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణా న్ని చేపట్టాం. ఇందులో ప్రత్యేకంగా ‘AI సిటీ’ కూడా ఏర్పాటు చేస్తు. న్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించడం వంటి అనేక కీలక నిర్ణయాలు తీసు కున్నాం.
2023 డిసెంబర్ నుండి ఇప్పటివర కు తెలంగాణ ₹ 3 లక్షల కోట్ల పెట్టు బడులను ఆకర్షించడమే కాకుండా, దాదాపు 1 లక్షకు పైగా ప్రైవేట్ రం గంలో ఉద్యోగాలను కల్పించాం. దా వోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ స మావేశం, అమెరికా, దక్షిణ కొరి యా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాల ద్వారా పెట్టుబడుల ఆకర్షణలో భారతదేశంలోనే అగ్ర స్థానంలో తెలంగాణ నిలిచింది. దావోస్ సమావేశంలోనే ₹1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగా ణకు లభించాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ శాస న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఐటీ మరియు పరిశ్రమల మం త్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సోనా టా సాఫ్ట్వేర్ మేనేజింగ్ డైరెక్టర్, సీ ఈఓ శ్రీ సమీర్ ధీర్ తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.