Collector P Rambabu :ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట మండలం పిల్లలమర్రి లోని పి ఎ సి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను శని వారం జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పరిశీలించారు. ఈ సం దర్బంగా అదనపు కలెక్టర్ మాట్లా డుతూ ఇప్పటి వరకు ఈ సెంటర్ ద్వారా 3200 క్విoటాల ధాన్యం ను మిల్లులకి ఎగుమతి చేశామని పేర్కొన్నారు. రమావత్ రవీందర్, రమావత్ రాములకి చెందిన ట్రక్ షీట్ లను పరిశీలించారు.
రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకరావాలి… రైతులు తాలు లేకుండా తేమ శాతం 17 ఉండేలా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకి తీసుకొని రావాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అ న్నారు. శనివారం నాగారం మండ లం డి కోత్తపల్లి గ్రామంలో శివలిం గ ఎం ఎ సి ఎస్ ఆధ్వర్యంలో నిర్వ హించే కొనుగోలు కేంద్రాన్ని అదన పు కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ తూకం వేస్తున్న ధాన్యాన్ని పరిశీ లించారు. తూకం లో ఎలాంటి తే డా లేకుండా చూసుకోవాలని అ న్నారు.బెల్లి వీరయ్య అనే రైతుకి చెందిన వడ్ల తేమ శాతం పరిశీలిం చారు.
తదుపరి నాగారం లోని వాసవి రైస్ మిల్లు తనిఖీ చేశారు. మిల్లర్లు ధా న్యం వెంటనే దిగుమతి చేసుకోవా లని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో పి ఎ సి ఎస్ చైర్మన్ పద్మ,సెం టర్ ఇంచార్జి లు నాగరాజు, వీర య్య తదితరులు పాల్గొన్నారు.