–సమాచార శాఖ కమిషనర్ హరీష్
Commissioner Harish: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాదాన్యత ఇస్తున్నదని సమాచార శాఖ కమి షనర్ హరీష్ అన్నారు. మీడియా అకాడమి భవన్లో ఆదివారం మహి ళా జర్నలిస్టులకు “ఆన్లైన్ జర్నలిజం – మహిళా జర్నలిస్టుల పాత్ర” అంశం పై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ హరీష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. మహిళా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారిలో ప్రాధాన్యత ఇస్తాము అని హామీ ఇచ్చారు. జర్నలిజంలో మహిళా ప్రాతినిధ్య మరింత పెరగాలనీ మీ అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి ఆకాo క్షిం చారు.
ఐ ఎస్ బి దేట సైన్స్ ప్రొఫె సర్ మది విశ్వనాథం, ఏ ఐ నిపు ణుడు రాకేష్, ఐ ఎస్ బి డేట సైన్స్ కాలేజీ డైరెక్టర్ శృతి ,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మాధవి రవికుమార్, పలు అంశా లపై వివరించారు.వివిధ ప్రాంతాల నుండి పలువురు మహిళా జర్న లిస్టులు హాజరైనారు.