–ప్రతి అర్హమైన వాటన్నిoటికీ సానుకూల పరిష్కారం
–భూభారతి పోర్టల్ లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ పూర్తి
–రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమా చార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Revenue Grievance Applications : ప్రజా దీవెన,హైదరాబాద్: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తు ను సమగ్రంగా పరిశీలించి అర్హమైన అన్నింటినీ సానుకూలంగా పరిష్క రించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసిం గ్, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అ ధికారులను ఆదేశించారు. ప్రతి దర ఖాస్తుపై సరైన విచారణ జరపాలని, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని అవసరమైన డా క్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలన్నింటినీ ఒకే డాక్యుమెంట్ గా భూభారతి పోర్టల్ లో అప్లోడ్ చేయాలని అధికారుల కు సూచించారు. తిరస్కరణకు గు రైన దరఖాస్తులను ఎందుకు తిర స్కరించవలసి వచ్చిందో అనే వివ రాలను లిఖిత పూర్వకంగా దర ఖా స్తుదారులకు అందించాలని ఆదే శించారు. రెవెన్యూ సదస్సుల్లో వ చ్చిన దరఖాస్తులపై మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో మం త్రి మాట్లాడారు.
మొత్తంగా 594 మండలాల్లో 10,2 26 రెవెన్యూ సదస్సులు నిర్వ హిం చామని, ఇందులో 8,27,230 దర ఖాస్తులు వచ్చాయని ఇప్పటి వర కు 7,98,528 దరఖాస్తులను డేటా ఫార్మేట్ లో భూభారతి పోర్టల్ లో న మోదు చేయడం జరిగిందన్నారు. మిగిలినవాటిని కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. రా ష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పం తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృ త్వంలోభూ భారతి చట్టాన్ని తీసు కురావడం జరిగిందన్నారు. ఈ చ ట్టం ద్వారా దశాబ్దకాలంగా పెండిం గ్లో ఉన్న భూ సమస్యలను పరి ష్కరించాలనే లక్ష్యంతో ఏప్రిల్ 17వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు దశల వారీగా రెవెన్యూ సదస్సుల ను నిర్వహించడం జరిగిందన్నారు.
సర్వే నెంబర్లలో లోపాలు పిపిబి, ఆర్వోఆర్, నాలా, ఆర్ .ఎస్ .ఆర్ సవరణ, అప్పీల్స్, కోర్టుకేసులు, పోడుభూములు తదితర 30 రకా ల భూ సమస్యలపై 8.27 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపా రు.ఈ రెవెన్యూ సదస్సులలో వ చ్చి న దరఖాస్తులను పరిశీలిస్తే ధరణి పోర్టల్ మూలంగా తెలంగాణ ప్రజా నీకం ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొ న్నసమస్యలు కళ్లకుకట్టినట్లు కన బడుతున్నాయన్నారు. గత ప్రభు త్వం తీసుకువచ్చిన స్వార్ద పూరిత మైన ఆర్వోఆర్ చట్టం 2020 వల్ల ఇబ్బందులు పడిన తెలంగాణ ప్ర జానీకానికి భూభారతి చట్టం ద్వా రా విముక్తి కల్పిస్తామని ప్రకటిం చా రు. కింది నుంచి పై స్ధాయి వరకు మొత్తం రెవెన్యూ యంత్రాంగం ప్ర త్యేక ఎజెండాగా తీసుకొని సమస్య ల పరిష్కారానికి అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలన్నారు. రైతుల సం తోషమే ధ్యేయంగా పనిచేస్తున్న ఇం దిరమ్మ ప్రభుత్వంలో వారికి ఎటు వంటి అసౌకర్యం లేకుండా చూడా లని, అంకితభావంతో సానుకూల దృక్పధంతో ఈ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు.