–నిన్నటి వరకు ఒక్కొక్కరుగా, రేపటి నుంచి బృందాలుగా చేరికలు
–ఈ వారం రోజులోనే ముహూర్తం ఖరారుకు ప్రయాత్నాలు
–బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యం గా కదులుతోన్న పావులు
–బడ్జెట్ సమావేశాల కన్నా ముందే కసరత్తు పూర్తికి సన్నాహాలు
–అదే దారిలో మండలిలోనూ పై చేయి సాధించేందుకు యత్నాలు
–నేడు కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మె ల్యే బండ్ల, వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలు
Congress: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆరు ఆ నెంబర్ పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఏక చత్రాధిపత్యంగా పరిపాలించిన గులాబి పార్టీ (brs)అధినేత మాజీ ముఖ్యమంత్రి లక్కీ నెంబర్. అయితే ఇటీవల రాష్ట్రంలో అధికా రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ ఆరు పైనే ఆసాంతం చర్చ జరుగు తోoది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ (BRS party in Congress party) నుంచి చేరికల సంఖ్యాపరంగా ఆరు సంఖ్యకు అత్యంత ప్రాధాన్యత సంతరిం చు కుంది. టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు చొప్పున ఎమ్మెల్యే, ఎమ్మె ల్సీల చేరికలే రాష్ట్రంలో ఈ ఆరు సంఖ్యపై జరుగుతున్న ప్రచారానికి ప్రధాన కారణం. ప్రతిపక్ష బి ఆర్ ఎస్ పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ (Congress party))లో చేరగా మరో ఆరుగురు ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధం కావడంతో ఆరుకు సూపర్ సిక్స్ గా నామక రణం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయ కులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ లక్కీ నంబర్ ‘6’ పైన సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) దృష్టి కేంద్రీకరించి సూపర్ సిక్స్ తోనే దెబ్బ కొట్టాలన్న ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. గురువారం అర్ధ రాత్రి ఒకేసారి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మె ల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఆయన మరో ఆరు గురు ఎమ్మెల్యేలను (mlcs) చేర్చుకోవ డంపై కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే సోమ లేదా మంగళవారం మొత్తానికి ఈ వారంలోనే ఉమ్మడి మహబూ బ్నగర్, గ్రేటర్ హైదరాబాద్ల పరిధిలోని ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గూటికి చేర్చేందుకు రంగం సిద్ధమైనట్లు వినికిడి. చర్చలు ఇప్పటికే పూర్తిచేసుకుని చేరికలు దాదాపుగా ఖరారయ్యాయని, అమావాస్య, మంచి రోజులు కాకపోవడంతో చేరిక వచ్చే వారానికి వాయిదా పడిందని పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. ప్రభుత్వ సుస్థిరతేలక్ష్యం గా అధిష్ఠానం అనుమతితో ఆప రేషన్ ఆకర్ష్ను ప్రారంభించిన రేవం త్రెడ్డి తదననుగుణంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ను ఒక్కొక్కరుగా పార్టీ లో చేర్చుకుంటున్న ఆయన ఇక మీదట గుంపులుగా పార్టీలో చేర్చు కునే ప్రక్రియకు తెరలేపారు. ఇప్పటి దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడి యం శ్రీహరి, పోచారం శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలె యాదయ్య లు సీఎం రేవంత్రెడ్డి (revanth reddy) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే వా రం మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకూ రంగం సిద్ధమ వుతోంది. కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో సంప్ర దింపుల ప్రక్రియ కొనసాగిస్తూనే చేరికల ప్రక్రియనూ సీఎం రేవంత్రె డ్డి కొనసాగించనున్నట్లు చెబుతు న్నారు.
నేడు కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్రెడ్డి
జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీఆ ర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి (Bandla Krishna Mohan Reddy)కాంగ్రెస్ పార్టీలో చేరిక కు ముహూర్థం ఖరారైంది. శనివా రం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కం డువా కప్పుకోనున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి (Bandla Krishna Mohan Reddy)మంత్రి జూపల్లితో పాటు పలువురు మంత్రులను కలిసి చర్చించి చేరిక ను ఖరారు చేశారు. అయితే ఎమ్మె ల్యే బండ్ల చేరికను జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వ్యతిరేకిస్తున్నా రు. వారి అనుచరవర్గం శుక్రవారం గాంధీ భవన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. గురువారం కూడా గద్వాలలో ఆందోళనలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఎంపీ మల్లు రవితో కలిసి సరిత, ఆమె భర్త తిరుపతయ్య, సీఎం రేవంత్రెడ్డిని కలిసి మాట్లాడారు. ఆయన నేనున్నానని వారికి ధైర్యం చెప్పినట్లు సమాచారం. అన్ని విష యాలు పీసీసీ వర్కంగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్తో మాట్లాడా లని సూచించడంతో వారు తిరిగి మహేష్కుమార్ గౌడ్తో చర్చలు జరిపారు. ఒక్కొక్కరుగా జరుగుతు న్న ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియ ఇక గుంపులుగా జరగనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నప్పుడు కేసీఆర్ ఏ విధానాన్ని అనుసరించా రో అదే విధానాన్ని ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను సీఎల్పీలో విలీ నం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు.
శాసనస భలో సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీకి (brs) 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. వారిలో మూడిం ట రెండొంతులు అంటే కనీసంగా 26 మంది ఎమ్మెల్యేలు చీలి ప్రత్యేకంగా శాసనసభా పక్షంగా ఏర్పడి సీఎల్పీ లో విలీనం కావాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరా రు. బడ్జెట్ సమావేశాల లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలను విలీనం చేసు కునేం దుకు సీఎం రేవంత్రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ లోపున 26 మంది కి పైగా ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం ఇక మీదట ఒక్కొక్కరుగా కాకుండా గుంపులుగా చేర్చుకొనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఇందులో భాగం గానే సోమ లేదా మంగళవారం మరో ఆరుగు రు ఎమ్మెల్యేలను (6 melcs) చేర్చుకొనేందుకు చర్చలు జరుగుతున్నట్లు చెబుతు న్నాయి.
ఎమ్మెల్సీలపై దృష్టి… కీలక బిల్లులు, తీర్మానాలు శాసనమండ లిలో ఎలాంటి ఇబ్బందులు లేకుం డా ఆమోదం పొందడానికి ఆ సభ లోనూ మెజారిటీ సాధించే దిశగా సీఎం రేవంత్రెడ్డి (revanth reddy)కసరత్తు చేస్తు న్నారు. శాసనమండలిలో 40 మం ది సభ్యులకు గాను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు రెండు ఖాళీగా ఉ న్నాయి. ఉన్న 38 మంది సభ్యుల్లో బీఆర్ఎస్ పార్టీ (brs party)ఎమ్మెల్సీలు పాతిక మంది వరకూ ఉన్నారు. కాంగ్రెస్ సంఖ్యాబలం కేవలం నాలుగుగా ఉంది. అయితే పట్నం మహేందర్రె డ్డి ఇప్పటికే కాంగ్రెస్లో చేరి ఉండ డం, మండలి చైర్మన్ గుత్తా సుఖేంద ర్రెడ్డీ ప్రభుత్వం పట్ల సానుకూలం గానే ఉండడంతో సభలో కాంగ్రెస్కు ఆరుగురి మద్దతు లభించినట్లయిం ది. వీరిద్దరికి తోడుగా గురువారం అర్థరాత్రి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం తో సభలో గులాబీల బలం 17కు పడిపోయింది. అయితే, ప్రస్తుతం మండలిలో ఉన్న నలుగురు నామి నేటెడ్ సభ్యులూ బీఆర్ఎస్ మద్ద తుదారులే కావడంతో ఇప్పటికీ మెజారిటీ సభ్యులు బీఆర్ఎస్ పక్షానే ఉన్నట్లయింది. ఇక ఆరు గురు ఎమ్మెల్సీల చేరికతో కాంగ్రెస్ పార్టీ బలం 12కు చేరుకుంది. ఎమ్మె ల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ సీట్లూ జత చేరితే పార్టీ బలం 14కు చేరుకోనుంది. సభలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పక్షాన ఉంటేనే కీలక బిల్లులు, తీర్మానాల కు ఇబ్బంది ఉండబోదని భావిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్సీల సంఖ్య ను 20ని దాటించే ఆలోచనలో ఉ న్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో 7 నుంచి 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చే ర్చుకునేందుకు సంప్రదింపులు జరు గుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శాసనమండలిలో మెజారిటీ సాధన ప్రక్రియ కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమ య్యే లోపు ముగించేందుకు కసర త్తు జరుగుతున్నట్లు చెబుతున్నా రు.