–సుధీర్ఘ సమాలోచనల అనంతరం రాహుల్ గాంధీ నిర్ణయం
–వయనాడ్ను నుంచి ప్రియాంక పోటీ చేసేందుకు సుముఖం
–వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన రాహుల్
— బిజెపి, కాంగ్రెస్ లకు రాజకీయ కేంద్రబిందువైన కేరళ
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కాంగ్రెస్ (CONGRESS) యువరాజు ఎట్టకేలకు రాజకీయ నిర్ణయం ప్రకటించాడు. సుధీర్ఘ సమాలోచనల తర్వాత వాయనాడ్ ను వదులుకొని, రాయబరేలి కే రాకపోకలు సాగించేందుకు తుది నిర్ణయం తీసుకున్నాడు. లోక్సభ ఎన్నికల్లో (LOKSHABAHA ELECTIONS) యూపీలోని రాయ్బరేలీ, కేరళలోని వయనాడ్ల నుంచి రెం డు చోట్ల విజయం సాధించిన కాంగ్రె స్ అగ్రనేత రాహుల్గాంధీ (RAHUL GANDHI) రాయ్ బరేలీకి ప్రాతినిధ్యం వహించాలని, వయనాడ్ స్థానాన్ని వదులుకోవా లని నిర్ణయించుకున్నారు. వయనా డ్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే (Malli Karjuna Kharge) ఇందుకు సంబంధించి న రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిం చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని మీడియాకు వెల్లడిం చారు.
సోమవారం ఖర్గే నివాసంలో ఆయనతో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi ), రాహుల్ గాంధీ (Rahul Gandhi), పార్టీ ప్రధాన కార్య దర్శులు కేసీ వేణుగోపాల్, ప్రియాం కాగాంధీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెండు స్థా నాల్లో గెలిచిన ఎంపీలు లోక్సభ ఎన్ని కల ఫలితాలు వెలువడిన 14 రోజుల్లో ఏదో ఒక స్థానాన్ని ఖాళీ చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాయ్బరేలీ, వయనాడ్లో రాహుల్ ఏ స్థానాన్ని నిలుపుకోవాలనే అంశంపై చర్చిం చారు. అనంతరం ఖర్గే (Malli Karjuna Kharge) మీడియాతో మాట్లాడుతూ తరతరాలుగా నెహ్రు కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉన్నందువల్ల రాయబరేలీ నుంచే రాహుల్ ఎంపీగా కొనసాగాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. వయనాడ్ ప్రజలూ రాహుల్నే కోరుకుంటున్నప్పటికీ నిబంధనలు అనుమతించడం లేదని పేర్కొన్నా రు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అత్యంత క్లిష్ట పరిస్థి తుల్లో పోరాడటానికి అవసరమైన శక్తిని వయనాడ్ (Wayanad) ప్రజలు తనకు అం దించారని, ఆ విషయాన్ని ఎన్నడూ మర్చిపోనని చెప్పారు. రాయ్బరే లీ, వయనాడ్లతో తనకు భావోద్వే గపూరిత సంబంధం ఉందని, వాటి ల్లో దేనిని ఎంచుకోవాలన్న నిర్ణయం సులభం కాలేదని వెల్లడించారు. రాహుల్ లేని లోటు లేకుండా తాను చూస్తానని వయనాడ్ ప్రజలకు ప్రియాంకగాంధీ హామీ ఇచ్చారు. కష్టపడి పని చేసి మంచి ప్రజాప్రతి నిధి అనిపిచుకుంటానన్నారు. ఇదిలా ఉంటే వయనాడ్లో రాహు ల్పై పోటీ చేసి ఓడిపోయిన కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ మాట్లాడుతూ రాహుల్ వయనాడ్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు. కేరళను, వయనాడ్ (Wayanad) ను కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఏటీఎం గా వాడుకుందని వ్యాఖ్యానించారు.